Swathi Muthyam: ఊహించిన దానికంటే ఎక్కువగా నవ్వుకుంటున్నారు
‘‘ఓ సాధారణ కుటుంబంలో అనుకోని సమస్య వస్తే వాళ్లెలా స్పందిస్తారు అనే అంశాన్ని తీసుకొని ‘స్వాతిముత్యం’ సినిమా చేశాం. అదే అందరికీ బాగా నచ్చింది’’ అన్నారు లక్ష్మణ్ కె.కృష్ణ.
‘‘ఓ సాధారణ కుటుంబంలో అనుకోని సమస్య వస్తే వాళ్లెలా స్పందిస్తారు అనే అంశాన్ని తీసుకొని ‘స్వాతిముత్యం’ (Swathi Muthyam) సినిమా చేశాం. అదే అందరికీ బాగా నచ్చింది’’ అన్నారు లక్ష్మణ్ కె.కృష్ణ. ఆయన దర్శకత్వంలో గణేష్ (Bellamkonda Ganesh), వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) జంటగా నటించిన చిత్రమే ‘స్వాతిముత్యం’. సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi) నిర్మించారు. రావు రమేష్, గోపరాజు రమణ, నరేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్లో విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో గణేష్ మాట్లాడుతూ.. ‘‘మా చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు. నటుడిగా నన్ను అందరూ అంగీకరించారు. ప్రతి ఒక్కరూ ‘తెరపై గణేష్ కనిపించలేదు. బాలా అనే కుర్రాడు మాత్రమే కనిపించాడ’ని చెబుతున్నారు. ఆ మాటలు విన్నప్పుడు నటుడిగా ఓ పది మార్కులు వేయించుకున్నానని చిన్న తృప్తి కలిగింది’’ అన్నారు. ‘‘విడుదలకు ముందే ‘ఈ సినిమా చూసి నవ్వుకుంటూ బయటకు వస్తార’ని మేం చెప్పాం. అయితే మేము ఊహించిన దానికంటే ఎక్కువగా నవ్వుకుంటూ బయటకు వస్తున్నారు. దీన్ని బట్టే చెప్పొచ్చు.. ఇదెంత పెద్ద విజయమన్నది’’ అంది నాయిక వర్ష. దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘‘సినిమాలో పాత్రలు చాలా సహజంగా.. నిజ జీవితంలో చూసినట్లుగా ఉన్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు’’ అన్నారు. ‘‘మా చిత్రానికి దక్కుతున్న ఆదరణ.. ఆనందాన్నిస్తోంది. ఈ వారాంతానికి వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది’’ అన్నారు నిర్మాత నాగవంశీ. ఈ కార్యక్రమంలో సురేఖా వాణి, దివ్య శ్రీపాద తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కథలతో ప్రయాణం
సరికొత్త కథలతో ప్రయాణం చేయనున్నారు విజయ్ దేవరకొండ. మొదట్నుంచీ ఆయనది అదే పంథానే. అందుకే యువ కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు -
సంద్రంలో జాలరి.. తీరంలో అల్లరి
సహజమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్న కథానాయిక... సాయిపల్లవి. ‘తండేల్’లో బుజ్జితల్లిగా సందడి చేయనుంది. -
వీరిద్దరి జీవితం క్రికెట్ ఒక్కటే
నచ్చిన జట్టు క్రికెట్ ఆటలో విజయం సాధిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేరు కొందరు. ఆ కొందరిలో బాలీవుడ్ తారలు జాన్వీ కపూర్, రాజ్కుమార్ రావ్లు కూడా ఉన్నారు. -
ఈటీవీ విన్లో ఒకే రోజు రెండు సినిమాలు
ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో గురువారం రెండు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. ‘చిత్రం చూడర’, ‘పారు’్ధ.. ఈ రెండు సినిమాలు నేడే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి -
విడుదల సెట్ అయ్యిందే...!
కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న ‘భజే వాయు వేగం’ విడుదల ఖరారైంది. ఈ నెల 31న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో తెలిపాయి. -
ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రావడం లేదు?
సినిమాకు కథే హీరో. ఈ కథలే ఎంతో మంది ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేలా చేస్తాయి. కానీ ప్రస్తుతం బాలీవుడ్లో అలాంటి కథా చిత్రాలు రాకపోవడంతో థియేటర్లలో సందడి లేదు. -
తండ్రీతనయులు తాత మనవళ్లుగా...
నిజ జీవితంలో తండ్రీ తనయులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ తెరపై తాత, మనవడుగా సందడి చేయనున్నారు. -
ఇలాంటి కలయికలో మరో చిత్రం రాదేమో!
గత కొంత కాలంగా హిందీ సినిమాలకు దూరంగా ఉన్న అగ్రకథానాయిక ప్రియాంక చోప్రా వరుస హాలీవుడ్ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. -
వించిపేట భద్ర... ఎంతో ప్రత్యేకం
‘‘ఇప్పటివరకూ చేసిన పాత్రలకి పూర్తి భిన్నంగా... గాఢతతో కూడిన వించిపేట భద్ర పాత్ర నా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది’’ అన్నారు సత్యదేవ్. -
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.