ప్రాజెక్ట్‌ కె లక్ష్యం 2024 వేసవేనా!

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె(వర్కింట్‌ టైటిల్‌). ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో భారీ హంగులతో తీర్చిదిద్దుతున్నారు.

Published : 01 Nov 2022 02:27 IST

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె(వర్కింట్‌ టైటిల్‌). ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో భారీ హంగులతో తీర్చిదిద్దుతున్నారు. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్‌ కీలక పాత్రలో  నటిస్తున్నారు. అశ్వనీదత్‌ నిర్మాత. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని 2024 వేసవి లక్ష్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరికిగానీ 2023 ప్రారంభంలోగానీ సినిమా చిత్రీకరణను పూర్తి చేసి ఆ తర్వాత నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారట. ప్రేక్షకులకు ఓ విజువల్‌ వండర్‌లా ఈ సినిమాని చూపించడం కోసం విఎఫ్‌ఎక్స్‌ పనుల కోసం కూడా చిత్రబృందం ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటోదట. అవన్నీ పూర్తి చేసి 2024కి సినిమాని విడుదల చేయడానికి ప్రణాళికలు రచించినట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని