Tollywood: కథకే కాదు విజయానికీ కొనసాగింపే
కొనసాగింపు చిత్రాల ట్రెండ్ను తెలుగు చిత్రసీమ ఎప్పుడో అందిపుచ్చుకుంది. అయితే ఆరంభంలో ఈతరహా ప్రయత్నాలు అంతగా అచ్చిరాలేదు. కానీ, ‘బాహుబలి’ సిరీస్ సినిమాలకు దక్కిన ఆదరణతో లెక్కలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి.
2022లో మెప్పించిన సీక్వెల్ చిత్రాలు
కొనసాగింపు చిత్రాల ట్రెండ్ను తెలుగు చిత్రసీమ ఎప్పుడో అందిపుచ్చుకుంది. అయితే ఆరంభంలో ఈతరహా ప్రయత్నాలు అంతగా అచ్చిరాలేదు. కానీ, ‘బాహుబలి’ సిరీస్ సినిమాలకు దక్కిన ఆదరణతో లెక్కలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ఈ విజయమిచ్చిన స్ఫూర్తితో కొన్నేళ్లుగా తెలుగులో కొనసాగింపు చిత్రాల జోరు పెరిగింది. హిట్టు మాట వినిపించిన సినిమాల్ని కొందరు ఫ్రాంచైజీల్లా కొనసాగిస్తే.. మరికొందరు ఓ కథను రెండు భాగాలుగా చెప్పడం మొదలు పెట్టారు. ఈ ఏడాది ఈతరహా సినిమాలు అరడజను వరకు బాక్సాఫీస్ ముందుకొచ్చాయి. మరి వీటిలో ప్రేక్షకుల మెప్పు పొందినవి ఎన్ని? వాటి విశేషాలేంటి?
‘ఎఫ్2’తో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ విజయవంతమైన చిత్రానికి కొనసాగింపుగా అనిల్ తెరకెక్కించిన మరో చిత్రమే ‘ఎఫ్3’. వెంకటేష్, వరుణ్ తేజ్ కథానాయకులుగా నటించిన ఈ సినిమా ఈ ఏడాది మేలో బాక్సాఫీస్ ముందుకొచ్చింది. అయితే తొలి భాగంతో పోల్చితే ఈ రెండో భాగం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా.. వాణిజ్యపరంగా చక్కటి విజయాన్నే అందుకొంది. దాదాపు రూ.70కోట్ల బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమా రూ.134కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక జూన్లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న సినిమా ‘విక్రమ్’. కమల్హాసన్ హీరోగా నటించిన ఈ సినిమాని లోకేష్ కనగరాజ్ తెరకెక్కించారు. ఒకరకంగా ఇదీ కొనసాగింపు చిత్రాల కోవకు చెందిన సినిమానే. ఎందుకంటే 1986లో విడుదలైన కమల్ ‘విక్రమ్’ కథకు కొనసాగింపుగానే ఈ చిత్ర కథను అల్లుకున్నారు లోకేష్. దాన్ని కార్తి ‘ఖైదీ’ చిత్ర కథతో ముడివేస్తూ.. తనదైన ఓ సరికొత్త కథా ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. ఈ ప్రయోగం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచిచ్చింది. ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా ‘విక్రమ్2’, ‘ఖైదీ2’ చిత్రాలు రానున్నాయి.
ఈ ఏడాది తెలుగు చిత్రసీమలో దాదాపు ఇరవై వరకు హిట్లు కనిపిస్తే.. అందులో కొనసాగింపు చిత్రాలే అరడజను వరకు ఉన్నాయి. ఆరంభంలో ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ లాంటి బడా చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచినా.. కొవిడ్ మూడో దశ ఉద్ధృతి వల్ల వాటి రాక వీలు పడలేదు. కానీ, ఆ కొవిడ్ భయాల మధ్యే ‘బంగార్రాజు’తో పండగ బరిలో నిలిచి మెరుపులు మెరిపించారు నాగార్జున, నాగచైతన్య. ఈ ఇద్దరూ కలిసి నటించిన ఈ సినిమాని కల్యాణ్ కృష్ణ తెరకెక్కించారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’కు సీక్వెల్గా రూపొందిన చిత్రమిది. తొలి సినిమా కథ ఎక్కడైతే ముగిసిందో.. అక్కడి నుంచే ఈ రెండో భాగం కథ మొదలవుతుంది. తొలి సినిమాలో లాగే ఇందులోనూ నాగార్జున బంగార్రాజుగా కనిపించగా.. నాగచైతన్య చిన్న బంగార్రాజుగా సందడి చేశారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. బాక్సాఫీస్ ముందు చక్కటి వసూళ్లనే దక్కించుకుంది. దాదాపు రూ.25కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా రూ.63కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టి సత్తా చాటింది. ‘బాహుబలి’ స్ఫూర్తితో రెండు భాగాలుగా రూపుదిద్దుకున్న సినిమా ‘కేజీఎఫ్’. మూడేళ్ల క్రితం విడుదలైన తొలి భాగం సంచలన విజయం దక్కించుకొని సత్తా చాటగా.. ఈ ఏడాది విడుదలైన రెండో భాగం అంతకు మించిన భారీ విజయంతో బాక్సాఫీస్ ముందు జోరు చూపింది. యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమిది. ఇందులో రాఖీ భాయ్గా యశ్ చూపిన యాక్షన్ హంగామాకు, ప్రశాంత్ టేకింగ్ స్టైల్కు ఇటు సినీప్రియులతో పాటు అటు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ.1200కోట్ల వసూళ్లు రాబట్టినట్లు లెక్కలు వేస్తున్నారు.
సైన్స్కి.. ఇతిహాసాన్ని జత చేసి లాజిక్గా కథ చెబితే.. ప్రేక్షకులు బాగానే చూస్తారని ‘కార్తికేయ’తో నిరూపించారు దర్శకుడు చందూ మొండేటి. దీంతో ఆ ఆలోచన నుంచే ఆయన మరో ఆసక్తికరమైన కథను అల్లుకొని ‘కార్తికేయ2’ని ముస్తాబు చేశారు. నిఖిల్ కథానాయకుడిగా నటించిన ఈ కొనసాగింపు చిత్రం.. ఈసారి పాన్ ఇండియా స్థాయిలో మెరుపులు మెరిపించింది. తొలి భాగంలో మెడికోగా ఓ ఆలయం వెనకున్న రహస్యాన్ని ఛేదించిన నిఖిల్.. ఈ రెండో భాగంలో డాక్టర్గా శ్రీకృష్ణుడి కాలి కంకణాన్ని అన్వేషిస్తూ ప్రయాణం సాగించారు. దాన్ని చందూ ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకుల్ని మెప్పించింది. అందుకే దాదాపు రూ.20కోట్ల బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమాకి.. బాక్సాఫీస్ వద్ద రూ.120కోట్ల పైచిలుకు వసూళ్లు దక్కాయి. ‘హిట్’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే సినీప్రియుల మెప్పు పొందిన దర్శకుడు శైలేష్ కొలను. ఈ విజయమిచ్చిన స్ఫూర్తితోనే ‘హిట్’ను ఓ యూనివర్స్లా మార్చి.. అడివి శేష్ కథానాయకుడిగా ‘హిట్: ది సెకండ్ కేస్’ను తీసుకొచ్చారు శైలేష్. దీనికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే దక్కింది. ఓ సైకో కిల్లర్ కథతో ఈ క్రైమ్ థ్రిల్లర్ను ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడిపిన తీరుకు ఇటు సినీప్రియులతో పాటు అటు విమర్శకుల నుంచీ ప్రశంసలు దక్కాయి. ఇప్పుడీ ఫ్రాంఛైజీలో రానున్న తదుపరి సినిమాలో నాని కథానాయకుడిగా కనిపించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు