సంక్షిప్త వార్తలు(4)
ప్రముఖ బాలీవుడ్ కథానాయిక రాణీ ముఖర్జీ నటిస్తోన్న కొత్త చిత్రం ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’. ముందు అనుకున్న ప్రకారం ఈ సినిమా మార్చి 3న విడుదల కావాల్సి ఉంది.
పిల్లల కోసం పోరాటం
ప్రముఖ బాలీవుడ్ కథానాయిక రాణీ ముఖర్జీ నటిస్తోన్న కొత్త చిత్రం ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’. ముందు అనుకున్న ప్రకారం ఈ సినిమా మార్చి 3న విడుదల కావాల్సి ఉంది. కానీ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురాన్నుట్లు ఓ కొత్త పోస్టర్తో ప్రకటించింది చిత్రబృందం. సరస్వతి పూజలో పిల్లలతో కలిసి సెల్ఫీ తీసుకుంటున్న రాణీ ముఖర్జీని ఇందులో చూడొచ్చు. తన పిల్లలను తన కస్టడీకి తెచ్చుకోవడానికి నార్వేజియన్ ఫోస్టర్ కేర్ సిస్టిమ్, స్థానిక యంత్రాంగంతో పోరాటం చేసే భారతీయ వలస మహిళగా రాణీ ఇందులో నటిస్తున్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు వినోదం పంచడమే కాదు మంచి సందేశాన్ని కూడా అందిస్తుందని’’ చెబుతోంది రాణి. ఆషియా చిబ్బర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
నీ ఆలోచనలే నీ శత్రువులు
‘పలాస’ చిత్రంతో సినీప్రియుల్ని మెప్పించిన హీరో రక్షిత్ అట్లూరి. ఇప్పుడాయన ‘ఆపరేషన్ రావణ్’గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. వెంకట సత్య తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మించారు. సంగీర్తన విపిన్ కథానాయిక. రాధికా శరత్కుమార్, చరణ్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ను మేఘా అండ్ ఒమేఘా విద్యా సంస్థల వైస్ చైర్పర్సన్ మాలతి రెడ్డి విడుదల చేశారు. ‘నీ ఆలోచనలే నీ శత్రువులు’ అనే క్యాప్షన్తో ఉన్న ఆ ప్రచార చిత్రంలో రక్షిత్ సీరియస్ లుక్తో కనిపించారు. ‘‘న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో మరిన్ని వివరాలు ప్రకటిస్తాం’’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: శరవణ వాసుదేవన్, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి.
మదిని హత్తుకునే.. సోదర సోదరీమణులు
కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో రఘుపతి రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సోదర సోదరీమణులారా’. విజయ్ కుమార్ పైండ్ల నిర్మాత. కాలకేయ ప్రభాకర్, పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో గురువారం ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ‘‘హృదయాల్ని హత్తుకునే చక్కటి కుటుంబ కథాంశంతో రూపొందిన చిత్రమిది. 35రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: మదీన్ ఎస్.కె, ఛాయాగ్రహణం: మోహన్ చారి.
భాయీజాన్ ఆగయా!
సల్మాన్ ఖాన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’. యాక్షన్తో కుటుంబ బంధాలకు ప్రాధాన్యమిస్తూ తెరకెక్కిన ఇటీవలే ఈ చిత్రం టీజర్ విడుదలైంది. ఓ పక్క కుటుంబ సన్నివేశాల్లోనూ మెప్పిస్తూనే యాక్షన్ కూడా ఇరగదీశాడు సల్మాన్ అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. వెంకటేష్తో పాటు జగపతిబాబు కీలక పాత్రలో నటించిన చిత్రమిది. ‘‘మీ పేరేంటి అంటే..నా కంటూ పేరు లేదు. కానీ నన్ను అందరూ భాయిజాన్ అని పిలుస్తారు’ లాంటి సంభాషణలు ఆకట్టుకుంటాయి. ఈ టీజర్ను పంచుకుంటూ సరైంది ఎప్పుడూ సరైందే..తప్పు తప్పే అని రాశారు సల్మాన్. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. ఈద్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..