‘వహీదా’ అభినయానికి ‘వెండితెర ఫిదా’
ఆమె పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిందంటే.. ఏ భావాన్నైనా ఇట్టే పలికించగలదు...పందొమ్మిదేళ్లకే కళ్లతో కుట్రలు పన్నే పడుచు అమ్మాయిగా నటించింది.
ఆమె పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిందంటే.. ఏ భావాన్నైనా ఇట్టే పలికించగలదు...
పందొమ్మిదేళ్లకే కళ్లతో కుట్రలు పన్నే పడుచు అమ్మాయిగా నటించింది.
సమాజం అసహ్యించుకొనే వేశ్య పాత్రలో ఒదిగిపోయి.. వాళ్లకీ ఓ మనసుంటుందని ఒప్పించింది... ఆ కాలంలోనే ప్రియుడితో పారిపోయే ఆధునిక భావాలున్న యువతిగానూ మెప్పించింది...
ఒప్పుకున్న పాత్ర ఏదైనా.. నటనతో దాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లడం వహీదా రెహమాన్ తీరు.
అందుకే ఆ రోజుల్లో ఆమె నిర్మాతలకు తొలి ఛాయిస్. స్టార్ హీరోల కలల జోడీ. అభిమానుల హృదయాలు గెలిచిన సామ్రాజ్ఞి...
అందం, నటనా కౌశలంతో మేటిగా ఎదిగిన ఆమెను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ పురస్కారం వరించడం సినిమా అభిమానులకు ఆనందదాయకం.
భారతీయ సినీ చరిత్రలో వహీదా రెహమాన్ని అత్యుత్తమ నటీమణుల్లో ఒకరిగా పరిగణిస్తుంటారు. ఐదు దశాబ్దాల ఆమె సినీ జీవితంలో తొంభైకిపైగా సినిమాల్లో నటించారు. 1955లో ‘రోజులు మారాయి’తో ఆమె వెండితెర ప్రస్థానం మొదలైంది. ఆనాటి దిగ్దర్శకుడు, నటుడు గురుదత్తో కలిసి ‘ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్’, ‘కాలా బాజార్’, ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ లాంటి మరపురాని చిత్రాల్లో అత్యుత్తమ నటన ప్రదర్శించారు. 1965లో వచ్చిన రొమాంటిక్ డ్రామా ‘గైడ్’ ఆమె ప్రతిభకి ఓ మచ్చుతునక. ఆ నటనకే ఉత్తమ నటిగా తొలి ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. ‘నీల్కమల్’, ‘చౌదావీ కా చాంద్’, ‘రామ్ ఔర్ శ్యామ్’, ‘సి.ఐ.డి.’, ‘ఖామోశీ’ చిత్రాల్లో నటనతో అందలానికి చేరారు. రొమాన్స్, సెంటిమెంట్, డ్రామా, హారర్.. ఎలాంటి భావోద్వేగాలనైనా అలవోకగా పలికించే వహీదా.. దిలీప్కుమార్, రాజేంద్రకుమార్, రాజ్కపూర్, రాజేశ్ ఖన్నా, దేవానంద్, సునీల్దత్, బిశ్వజిత్.. లాంటి అప్పటి స్టార్ హీరోలందరితో కలిసి పని చేశారు. ఆమె నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘బీస్ సాల్ బాద్’ 1962లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ‘తీస్రీ కసమ్’ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ‘ఖామోశీ’ చిత్రంలో ప్రేమలో విఫలమై, చివరికి పిచ్చిదానిలా మారిన నర్సుగా తన నటన పతాకస్థాయిలో ఉందని అంతా మెచ్చుకున్నారు. ఆమె హిందీతోపాటు కొన్ని తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లోనూ నటించారు. ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్రేతో ‘అభిజన్’లో కలిసి పని చేశారు. తర్వాత మరికొన్ని బెంగాలీ సినిమాల్లో నటించారు.
ప్రతిభకు తగ్గ గుర్తింపు
డెబ్బయో దశకం వరకు ఓ వెలుగు వెలిగిన వహీదా.. తర్వాత సహాయ పాత్రలకు మారారు. అందులోనూ తనదైన ముద్ర వేశారు. ‘కభీకభీ’, ‘త్రిశూల్’, ‘నమ్కీన్’, ‘నమక్ హలాల్’, ‘చాంద్నీ’ తదితర చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. ఆమె సుదీర్ఘ ప్రస్థానికి గుర్తింపుగా ఫిల్మ్ఫేర్ లైఫ్టైం అఛీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ఆమె అత్యుత్తమ నటనకి ఒక జాతీయ అవార్డుతోపాటు, మూడు ఫిల్మ్ఫేర్ అవార్డులు వరించాయి. 1959 నుంచి 1964 వరకు బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకున్న నటి వహీదానే.
80ల్లో తల్లి పాత్రలు
1980ల కాలానికి వచ్చేసరికి వహీదా రెహమాన్ తల్లి పాత్రలవైపు మరలారు. 1991లో ‘లమ్హే’ తర్వాత వహీదా కొన్నాళ్లు విరామం తీసుకున్నారు. ఆ తర్వాత 2002లో ‘ఓమ్ జై జగదీష్’తో పునరాగమనం చేశారు. ఆ తర్వాత ‘వాటర్’, ‘రంగ్ దే బసంతీ’, ‘15 పార్క్ అవెన్యూ’, ‘దిల్లీ 6’ లాంటి విజయవంతమైన చిత్రాలు చేశారామె. 2021లో ‘స్కేటర్ గర్ల్’ సినిమాలో నటించారు వహీదా.
అనుకోకుండానే నటన వైపు..
అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగిన వహీదా రెహమాన్ ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తమిళనాడులోని చెంగల్పట్టులో జన్మించారు. ఈమె నలుగురు అమ్మాయిల్లో ఆఖరు. నలుగురు కూతుళ్లనీ చెన్నైలోని ఒక గురువు దగ్గర చేర్పించి, భరతనాట్యంలో శిక్షణనిప్పించారు తల్లిదండ్రులు. వహీదాకి చిన్నప్పట్నుంచీ వైద్యురాలు కావాలని ఉండేది. దురదృష్టవశాత్తు నాన్న ఆకస్మిక మరణం, తల్లి అనారోగ్యం బారిన పడటంతో ఆ కలకు దూరమయ్యారు. కొన్నాళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో పదహారేళ్ల వయసులోనే కుటుంబ భారం మోయాలనుకున్నారు. నాట్యంలో ప్రావీణ్యం ఉండటంతో తేలిగ్గానే అవకాశాలు చేజిక్కించుకున్నారు. తల్లి అభీష్టానికి వ్యతిరేకంగా సినిమాల్లోకి వెళ్లినా.. చిన్న వయసులోనే కుటుంబానికి పెద్దదిక్కుగా మారారు.
తెలుగుతో అనుబంధం
హిందీ చిత్రసీమనేలిన వహీదా రెహమాన్కి తెలుగు నేలతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె తండ్రి మున్సిపల్ కమిషనర్గా పని చేస్తుండటంతో ఉద్యోగరీత్యా వాళ్ల కుటుంబం కొన్నేళ్లపాటు విశాఖపట్నంలో ఉంది. వహీదా అక్కడే సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో చదువుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే స్థిరపడాలి అనుకుంటున్న సమయంలో.. గురువు, మార్గదర్శిలా భావించే గురుదత్ సలహాతో బొంబాయికి మకాం మార్చారు. తర్వాత భారతీయ సినిమా చరిత్రలో కొన్నేళ్లపాటు మకుటం లేని మహారాణిగా వెలుగొందారు.
గేదెను కారు ఢీకొట్టడంతో హిందీ అవకాశం
గురు దర్శకత్వంలో వహీదా ‘ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్’, ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ లాంటి గొప్ప చిత్రాలలో నటించారు. ఆ చరిత్రను సత్య సరన్ రాసిన ‘టెన్ ఇయర్స్ విత్ గురుదత్’ పుస్తకంలో గుర్తుచేసుకున్నారు రచయిత అబ్రార్ అల్వీ. తమిళంలో హిట్ అయిన ‘మిస్సమ్మ’(1955)ని హిందీలో రీమేక్ చేయాలని చూస్తున్న దత్, అల్వీ, వారి ప్రొడక్షన్ కంట్రోలర్ గురుస్వామితో కలిసి కారులో హైదరాబాద్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అనుకోకుండా అల్వీ కారు రోడ్డుపై ఉన్న ఒక గేదెని ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ధ్వంసమైన కారు కారణంగా ఆ ముగ్గురు రెండురోజుల పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది. అలా ఒకరోజు సికింద్రాబాద్లోని ఓ డిస్ట్రిబ్యూటర్ ఆఫీసులో కూర్చున్న దత్ దృష్టిని కారు దిగి ఎదురుగా ఉన్న బిల్డింగ్లోకి ప్రవేశిస్తున్న ఓ మహిళ ఆకర్షించింది. ‘ఆమె తెలుగు సినిమా ‘రోజులు మారాయి’లో డ్యాన్సర్. ఆ సినిమా సూపర్ హిట్ అయింది’ అని ఆ డిస్ట్రిబ్యూటర్ చెప్పడంతో గురు ఆమెను ఆఫీసుకి పిలిపించారు. ఆమే వహీదా రెహమాన్. సాదాసీదా దుస్తులు ధరించి, ఎంతో సున్నితంగా మాట్లాడుతూ గురుని ఆకట్టుకుంది వహీదా. అలా తొలి హిందీ చిత్రం ‘సి.ఐ.డి.’లో అవకాశం దక్కించుకున్నారు వహీదా. దేవానంద్తో కలిసి తెరపై కనిపించడం అదే తొలిసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
Imdb top movies: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఆసక్తికర మూవీల జాబితాను విడుదల చేసింది. -
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
ప్రభాస్ ‘కల్కి’ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. -
మేకప్ రూమ్లో బంధించారు.. నిర్మాతపై నటి ఆరోపణలు
నిర్మాత వేధింపుల కారణంగా బాలీవుడ్ డ్రామా షో ‘శుభ్ షగున్’ నుంచి బయటకు వచ్చేసినట్లు నటి కృష్ణ ముఖర్జీ తెలిపారు. -
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
ప్రేమ స్వభావం ఎలా ఉన్నప్పటికీ దానిని వదులుకోవడం చాలా కష్టమన్నారు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్. -
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
ఇటీవలే షూటింగ్ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
హాలీవుడ్కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. -
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
Gurucharan Singh: బాలీవుడ్లో ప్రముఖ టీవీ నటుడు ఐదు రోజులుగా కన్పించకుండా పోవడం చర్చనీయాంశమైంది. అతడిని కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన సంజు, జురెల్.. లఖ్నవూపై రాజస్థాన్ విజయం
-
మందుగుండు సామగ్రి పేలి.. 20 మంది సైనికులు మృతి!
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM