‘వహీదా’ అభినయానికి ‘వెండితెర ఫిదా’
ఆమె పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిందంటే.. ఏ భావాన్నైనా ఇట్టే పలికించగలదు...పందొమ్మిదేళ్లకే కళ్లతో కుట్రలు పన్నే పడుచు అమ్మాయిగా నటించింది.
ఆమె పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిందంటే.. ఏ భావాన్నైనా ఇట్టే పలికించగలదు...
పందొమ్మిదేళ్లకే కళ్లతో కుట్రలు పన్నే పడుచు అమ్మాయిగా నటించింది.
సమాజం అసహ్యించుకొనే వేశ్య పాత్రలో ఒదిగిపోయి.. వాళ్లకీ ఓ మనసుంటుందని ఒప్పించింది... ఆ కాలంలోనే ప్రియుడితో పారిపోయే ఆధునిక భావాలున్న యువతిగానూ మెప్పించింది...
ఒప్పుకున్న పాత్ర ఏదైనా.. నటనతో దాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లడం వహీదా రెహమాన్ తీరు.
అందుకే ఆ రోజుల్లో ఆమె నిర్మాతలకు తొలి ఛాయిస్. స్టార్ హీరోల కలల జోడీ. అభిమానుల హృదయాలు గెలిచిన సామ్రాజ్ఞి...
అందం, నటనా కౌశలంతో మేటిగా ఎదిగిన ఆమెను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ పురస్కారం వరించడం సినిమా అభిమానులకు ఆనందదాయకం.
భారతీయ సినీ చరిత్రలో వహీదా రెహమాన్ని అత్యుత్తమ నటీమణుల్లో ఒకరిగా పరిగణిస్తుంటారు. ఐదు దశాబ్దాల ఆమె సినీ జీవితంలో తొంభైకిపైగా సినిమాల్లో నటించారు. 1955లో ‘రోజులు మారాయి’తో ఆమె వెండితెర ప్రస్థానం మొదలైంది. ఆనాటి దిగ్దర్శకుడు, నటుడు గురుదత్తో కలిసి ‘ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్’, ‘కాలా బాజార్’, ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ లాంటి మరపురాని చిత్రాల్లో అత్యుత్తమ నటన ప్రదర్శించారు. 1965లో వచ్చిన రొమాంటిక్ డ్రామా ‘గైడ్’ ఆమె ప్రతిభకి ఓ మచ్చుతునక. ఆ నటనకే ఉత్తమ నటిగా తొలి ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. ‘నీల్కమల్’, ‘చౌదావీ కా చాంద్’, ‘రామ్ ఔర్ శ్యామ్’, ‘సి.ఐ.డి.’, ‘ఖామోశీ’ చిత్రాల్లో నటనతో అందలానికి చేరారు. రొమాన్స్, సెంటిమెంట్, డ్రామా, హారర్.. ఎలాంటి భావోద్వేగాలనైనా అలవోకగా పలికించే వహీదా.. దిలీప్కుమార్, రాజేంద్రకుమార్, రాజ్కపూర్, రాజేశ్ ఖన్నా, దేవానంద్, సునీల్దత్, బిశ్వజిత్.. లాంటి అప్పటి స్టార్ హీరోలందరితో కలిసి పని చేశారు. ఆమె నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘బీస్ సాల్ బాద్’ 1962లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ‘తీస్రీ కసమ్’ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ‘ఖామోశీ’ చిత్రంలో ప్రేమలో విఫలమై, చివరికి పిచ్చిదానిలా మారిన నర్సుగా తన నటన పతాకస్థాయిలో ఉందని అంతా మెచ్చుకున్నారు. ఆమె హిందీతోపాటు కొన్ని తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లోనూ నటించారు. ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్రేతో ‘అభిజన్’లో కలిసి పని చేశారు. తర్వాత మరికొన్ని బెంగాలీ సినిమాల్లో నటించారు.
ప్రతిభకు తగ్గ గుర్తింపు
డెబ్బయో దశకం వరకు ఓ వెలుగు వెలిగిన వహీదా.. తర్వాత సహాయ పాత్రలకు మారారు. అందులోనూ తనదైన ముద్ర వేశారు. ‘కభీకభీ’, ‘త్రిశూల్’, ‘నమ్కీన్’, ‘నమక్ హలాల్’, ‘చాంద్నీ’ తదితర చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. ఆమె సుదీర్ఘ ప్రస్థానికి గుర్తింపుగా ఫిల్మ్ఫేర్ లైఫ్టైం అఛీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ఆమె అత్యుత్తమ నటనకి ఒక జాతీయ అవార్డుతోపాటు, మూడు ఫిల్మ్ఫేర్ అవార్డులు వరించాయి. 1959 నుంచి 1964 వరకు బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకున్న నటి వహీదానే.
80ల్లో తల్లి పాత్రలు
1980ల కాలానికి వచ్చేసరికి వహీదా రెహమాన్ తల్లి పాత్రలవైపు మరలారు. 1991లో ‘లమ్హే’ తర్వాత వహీదా కొన్నాళ్లు విరామం తీసుకున్నారు. ఆ తర్వాత 2002లో ‘ఓమ్ జై జగదీష్’తో పునరాగమనం చేశారు. ఆ తర్వాత ‘వాటర్’, ‘రంగ్ దే బసంతీ’, ‘15 పార్క్ అవెన్యూ’, ‘దిల్లీ 6’ లాంటి విజయవంతమైన చిత్రాలు చేశారామె. 2021లో ‘స్కేటర్ గర్ల్’ సినిమాలో నటించారు వహీదా.
అనుకోకుండానే నటన వైపు..
అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగిన వహీదా రెహమాన్ ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తమిళనాడులోని చెంగల్పట్టులో జన్మించారు. ఈమె నలుగురు అమ్మాయిల్లో ఆఖరు. నలుగురు కూతుళ్లనీ చెన్నైలోని ఒక గురువు దగ్గర చేర్పించి, భరతనాట్యంలో శిక్షణనిప్పించారు తల్లిదండ్రులు. వహీదాకి చిన్నప్పట్నుంచీ వైద్యురాలు కావాలని ఉండేది. దురదృష్టవశాత్తు నాన్న ఆకస్మిక మరణం, తల్లి అనారోగ్యం బారిన పడటంతో ఆ కలకు దూరమయ్యారు. కొన్నాళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో పదహారేళ్ల వయసులోనే కుటుంబ భారం మోయాలనుకున్నారు. నాట్యంలో ప్రావీణ్యం ఉండటంతో తేలిగ్గానే అవకాశాలు చేజిక్కించుకున్నారు. తల్లి అభీష్టానికి వ్యతిరేకంగా సినిమాల్లోకి వెళ్లినా.. చిన్న వయసులోనే కుటుంబానికి పెద్దదిక్కుగా మారారు.
తెలుగుతో అనుబంధం
హిందీ చిత్రసీమనేలిన వహీదా రెహమాన్కి తెలుగు నేలతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె తండ్రి మున్సిపల్ కమిషనర్గా పని చేస్తుండటంతో ఉద్యోగరీత్యా వాళ్ల కుటుంబం కొన్నేళ్లపాటు విశాఖపట్నంలో ఉంది. వహీదా అక్కడే సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో చదువుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే స్థిరపడాలి అనుకుంటున్న సమయంలో.. గురువు, మార్గదర్శిలా భావించే గురుదత్ సలహాతో బొంబాయికి మకాం మార్చారు. తర్వాత భారతీయ సినిమా చరిత్రలో కొన్నేళ్లపాటు మకుటం లేని మహారాణిగా వెలుగొందారు.
గేదెను కారు ఢీకొట్టడంతో హిందీ అవకాశం
గురు దర్శకత్వంలో వహీదా ‘ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్’, ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ లాంటి గొప్ప చిత్రాలలో నటించారు. ఆ చరిత్రను సత్య సరన్ రాసిన ‘టెన్ ఇయర్స్ విత్ గురుదత్’ పుస్తకంలో గుర్తుచేసుకున్నారు రచయిత అబ్రార్ అల్వీ. తమిళంలో హిట్ అయిన ‘మిస్సమ్మ’(1955)ని హిందీలో రీమేక్ చేయాలని చూస్తున్న దత్, అల్వీ, వారి ప్రొడక్షన్ కంట్రోలర్ గురుస్వామితో కలిసి కారులో హైదరాబాద్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అనుకోకుండా అల్వీ కారు రోడ్డుపై ఉన్న ఒక గేదెని ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ధ్వంసమైన కారు కారణంగా ఆ ముగ్గురు రెండురోజుల పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది. అలా ఒకరోజు సికింద్రాబాద్లోని ఓ డిస్ట్రిబ్యూటర్ ఆఫీసులో కూర్చున్న దత్ దృష్టిని కారు దిగి ఎదురుగా ఉన్న బిల్డింగ్లోకి ప్రవేశిస్తున్న ఓ మహిళ ఆకర్షించింది. ‘ఆమె తెలుగు సినిమా ‘రోజులు మారాయి’లో డ్యాన్సర్. ఆ సినిమా సూపర్ హిట్ అయింది’ అని ఆ డిస్ట్రిబ్యూటర్ చెప్పడంతో గురు ఆమెను ఆఫీసుకి పిలిపించారు. ఆమే వహీదా రెహమాన్. సాదాసీదా దుస్తులు ధరించి, ఎంతో సున్నితంగా మాట్లాడుతూ గురుని ఆకట్టుకుంది వహీదా. అలా తొలి హిందీ చిత్రం ‘సి.ఐ.డి.’లో అవకాశం దక్కించుకున్నారు వహీదా. దేవానంద్తో కలిసి తెరపై కనిపించడం అదే తొలిసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Malla Reddy: మహేశ్బాబు ‘బిజినెస్మేన్’ చూసి ఎంపీ అయ్యా.. మల్లారెడ్డి స్పీచ్కు మహేశ్బాబు నవ్వులే నవ్వులు!
Minister Malla Reddy: ‘యానిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్లో మంత్రి మల్లారెడ్డి ప్రసంగం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతోంది. -
Kriti Sanon: అల్లు అర్జున్తో నటించే అవకాశం త్వరగా రావాలనుకుంటున్నా..!
అల్లు అర్జున్తో (Allu arjun) కలిసి నటించాలని ఉందని కృతిసనన్ మరోసారి తన ఆసక్తిని బయటపెట్టారు. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. -
Animal: అసలు రన్ టైమ్ 3 గంటల 21నిమిషాలు కాదు.. తెలిస్తే షాకే!
Animal: ‘యానిమల్’ మూవీ గురించి చిత్ర బృందం ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. -
Rashmika: అమ్మాయిలందరికీ ఇదే చెప్పాలనుకుంటున్నా..: రష్మిక
తన డీప్ ఫేక్ వీడియోపై రష్మిక (Rashmika) మరోసారి స్పందించారు. తనకు చాలా మంది మద్దతు లభించిందన్నారు. -
Rathika rose: టాప్-5లో ఉండే అర్హత నాకు లేదు.. నన్ను క్షమించండి: రతిక
Rathika rose Interview: బిగ్బాస్ నుంచి ఎలిమినేట్ అయిన రతికా రోజ్ అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. -
Raashii Khanna: ఆ ఉద్వేగం మాటల్లో చెప్పలేను: రాశీఖన్నా
భాష ఏదైనా.. నటనతో మెప్పిస్తూ, అన్నిచోట్లా దూసుకెళ్తోంది రాశీఖన్నా. ప్రస్తుతం విక్రమ్ మాస్సేకి జోడీగా ‘టీఎంఈ’లో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. -
Mahesh babu: నేను రణ్బీర్కు చాలా పెద్ద అభిమానిని
‘‘ప్రతి సంవత్సరం ఎంతో మంది కొత్త దర్శకులు వస్తుంటారు. పెద్ద సినిమాలు.. సూపర్ హిట్టు చిత్రాలు చేస్తుంటారు. కానీ, ‘సినిమా అంటే ఇలాగే తీయాలి’ అనే సినీ సూత్రాల్ని షేక్ చేసే దర్శకుడు అప్పుడప్పుడు ఒకరు వస్తుంటారు. -
Kalyan ram: డ్యాన్స్ కొత్తగా.. కొంచెం మత్తుగా
‘డెవిల్’గా సినీప్రియుల్ని థ్రిల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు కల్యాణ్ రామ్. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సంయుక్త కథానాయిక. -
kantara: జన్మించాడు ఓ లెజెండ్
చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయంతో అందరి దృష్టినీ ఆకర్షించిన చిత్రం ‘కాంతార’. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాకి ఇప్పుడు ప్రీక్వెల్ సిద్ధమవుతోంది. -
Tillu Square: నా కొంపెట్లా ముంచనున్నావో చెప్పు రాధికా..
‘డీజే టిల్లు’గా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడాయన మరోసారి అదే పాత్రలో ‘టిల్లు స్క్వేర్’తో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు. సిద్ధు హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నారు. -
sudheer babu: భయపడితే కాదు.. భయపెడితేనే..!
‘‘వాడు సమరమే మొదలుబెడితే.. ఆ సంభవానికి సంతకం నాదైతది’’ అంటున్నారు సుధీర్బాబు. మరి ఆ సమరం దేనికోసం.. అందులో పైచేయి సాధించేదెవరు? తెలుసుకోవాలంటే ‘హరోం హర’ చూడాల్సిందే. -
Vishwak Sen: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వాయిదా.. చిత్ర బృందం అధికారిక ప్రకటన
విశ్వక్సేన్, నేహాశెట్టి జంటగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ సినిమా వాయిదా పడింది. -
Social Look: నీటితో సమస్యలకు చెక్ అన్న అదా.. మీనాక్షి స్ట్రీట్ షాపింగ్
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు... -
Lokesh Kanagaraj: కొత్త ప్రయాణం మొదలుపెట్టిన లోకేశ్ కనగరాజ్.. ఫస్ట్ ఛాన్స్ వారికే
దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. అదేంటంటే? -
Atharva: క్లైమాక్స్ను ఎవరూ ఊహించలేరు
‘‘సస్పెన్స్ థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమా ‘అథర్వ’. ప్రతి ఒక్కరినీ సీటు అంచున కూర్చోబెట్టేలా సాగుతుంది’’ అన్నారు దర్శకుడు మహేశ్రెడ్డి. -
Navadeep: నా నిజ జీవిత ప్రేమ కథల ఫలితమే ఈ చిత్రం
‘లవ్ మౌళి’గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు నవదీప్. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అవనీంద్ర తెరకెక్కించారు. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై సి స్పేస్ సంస్థ నిర్మించింది. -
Vishwak Sen: గోదావరి గ్యాంగ్ విడుదల!
విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. -
Extra Ordinary Man: పదింతల వినోదం గ్యారంటీ
‘‘నా 20ఏళ్ల కెరీర్లో.. ‘ఎక్స్ట్రా - ఆర్డినరీ మేన్’ నా 32వ సినిమా. నేనిప్పటి వరకు చేసిన అత్యుత్తమ పాత్రల్లో ఇందులో చేసిన పాత్రే నంబర్ వన్’’ అన్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రమే ‘ఎక్స్ట్రా - ఆర్డినరీ మేన్’.


తాజా వార్తలు (Latest News)
-
Musk: అప్పటి వరకు ప్రతిరోజూ ఈ ట్యాగ్ ధరిస్తా: ఎలాన్ మస్క్
-
USA: ‘ప్రార్థనా స్థలాల్లో రాజకీయాలొద్దు’.. ఖలిస్థానీల దుశ్చర్యపై ‘సిఖ్స్ ఆఫ్ అమెరికా’ ఖండన
-
Uttarakhand Tunnel: ఏ క్షణమైనా మీ వాళ్లు బయటకు.. కూలీల కుటుంబాలకు సమాచారం
-
Britain-Greek: పురాతన శిల్పాల వివాదం.. ప్రధానుల భేటీ రద్దు
-
Malla Reddy: మహేశ్బాబు ‘బిజినెస్మేన్’ చూసి ఎంపీ అయ్యా.. మల్లారెడ్డి స్పీచ్కు మహేశ్బాబు నవ్వులే నవ్వులు!
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు