Parineeti Chopra: అందులో నటించడానికి కారణం నా పాటలే

నటిగానే కాదు సంగీతకారిణిగా మంచి పేరు తెచ్చుకుంది బాలీవుడ్‌ కథానాయిక పరిణీతి చోప్రా. సంగీతమే తనకిష్టమైన మరో ప్రపంచం అంటూ ఇటీవల ఆమె ఒక మ్యూజిక్‌ షోలో పాల్గొంది. 

Updated : 18 Feb 2024 03:23 IST

నటిగానే కాదు సంగీతకారిణిగా మంచి పేరు తెచ్చుకుంది బాలీవుడ్‌ కథానాయిక పరిణీతి చోప్రా. సంగీతమే తనకిష్టమైన మరో ప్రపంచం అంటూ ఇటీవల ఆమె ఒక మ్యూజిక్‌ షోలో పాల్గొంది. తాను నటించిన కొన్ని సినిమాల్లోనూ తన గాత్రాన్ని వినిపించింది. ప్రస్తుతం ఆమె పంజాబీ గాయకుడు అమర్‌ సింగ్‌ ఛమ్కీలా జీవితం ఆధారంగా అదే పేరుతో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా గడుపుతోంది. దిల్జీత్‌ దోసాంజ్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్నారు. తన భార్య అమర్‌జ్యోత్‌ కౌర్‌గా పరిణీతి కనిపించనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఈ చిత్రం చేయడానికి గల కారణాన్ని తెలిపింది. ‘ఈ చిత్రంలోని పాటలన్నీ నేనే పాడాల్సి వచ్చింది. కథ నచ్చడంతో నటించాలనిపించింది. అన్ని పాటలు పాడిన నేను ఆ సినిమాలో భాగం కావాలని కోరుకున్నాను. సంతకం చేశాను. ఆ సినిమాలో నేను పాడిన పాటలే నన్నందులో నటించేలా చేశాయి’ అని అంది. వేదికపై సంగీత ప్రదర్శన ఇవ్వడానికి కారణం తెలుపుతూ...‘అమర్‌ సింగ్‌ ఛమ్కీలా’ చిత్రీకరణ సమయంలో దిల్జీత్‌ నా పాటలు విని లైవ్‌ పర్ఫామెన్స్‌ ఇవ్వమని అన్నారు. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ నా పాటని వేదికపై ప్రదర్శించమని ఎప్పుడూ అడిగేవారు. వారు చెప్పిన ఆ మాటే నాలో ఉండిపోయింది. నా భర్త కూడా పాడమని ప్రోత్సహించేవారు. అదే ఆలోచనతో తాజాగా వేదికపై ప్రదర్శించా. సంగీత ప్రపంచంలో అడుగుపెట్టా’ అంటూ చెప్పుకొచ్చింది పరిణీతి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు