మా సినిమా స్నేహాన్ని పెంచుతుంది: చిరంజీవి
రాజకీయం శత్రువులను పెంచితే, సినిమా స్నేహితుల్నీ, స్నేహాన్ని పెంచుతుందన్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. మహేశ్బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. విజయశాంతి
హైదరాబాద్: రాజకీయం శత్రువులను పెంచితే, సినిమా స్నేహితుల్నీ, స్నేహాన్ని పెంచుతుందన్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. మహేశ్బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం ఈ చిత్ర మెగా సూపర్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా విజయశాంతితో కలిసి వేదికపై ఆయన మాట్లాడారు.
‘‘వారి అభిమానులు.. వీరి అభిమానులు అని కాకుండా అందరూ కలిసి ఐకమత్యంతో ఉండటం కావాలి. ‘సరిలేరు నీకెవ్వరు’తో మీరు ఆ కలను నిజం చేశారు. మహేశ్బాబు చాలా అందంగా ఉంటారు. ఆ అందం వెనుక చిలిపితనం కూడా ఉంటుంది. ఈ మధ్య కొన్ని నెలల క్రితం పేపర్ తిరగేస్తుంటే మహేశ్ ఫొటో కనిపించింది. చూడగానే కత్తిలా ఉంది. ఆ లుక్ నన్ను కట్టిపడేసింది. వెంటనే మహేశ్బాబుకు ఎస్ఎంఎస్ చేశా. అలా జరిగిందో లేదో ఇంతలోనే సినిమా అయిపోయిందన్నారు. నేడు ఇండస్ట్రీలో ఒక హీరో సినిమా తీయడానికి ఏడాదిపైనే అవుతోంది. కానీ, ఈ సినిమాను చాలా తక్కువ సమయంలో తీశారు. ఇండస్ట్రీకి ఇదే కావాలి. సినిమా పూర్తయ్యే వరకూ మహేశ్ ఒక్క పైసా కూడా తీసుకోలేదని తెలిసింది. ఇది ఆరోగ్యకర సంప్రదాయం. నేనెప్పుడూ నా సినిమాలకు అడ్వాన్స్ తీసుకోను. ఎందుకంటే నిర్మాతలకు కలిసి వస్తుంది. అదే రామ్చరణ్ కూడా ఫాలో అవుతున్నాడు. నిర్మాతకు వెన్నుదన్నుగా నిలబడటం సంతోషంగా ఉంది. ఇదే విషయాన్ని మా దర్శకుడు కొరటాలతో అంటే ఆయన కూడా ‘మీతో సినిమా 80-85రోజులకు మించదు’ అని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ విషయాన్ని పబ్లిక్గా చెబుతున్నా. సినిమా త్వరగా పూర్తయ్యేలా ఆరోగ్యకర వాతావరణం వస్తుందని నేను అనుకుంటున్నా. దీనికి మహేశ్ ముందడుగు వేయడం సంతోషం.
‘‘సీనియర్ మోస్ట్ నటుడైన కృష్ణగారికి దక్కాల్సిన గౌరవం ఇంకా దక్కలేదేమో అనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కృషి చేసి ఆయన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు సిఫార్సు చేస్తే అది మన తెలుగు వారికి దక్కిన గౌరవంగా భావించవచ్చు. ఆయన చేసినన్ని ప్రయోగాలు మరో నటుడు చేయలేదు. దిల్రాజు సినిమా అంటే తప్పకుండా విజయం శాతం ఎక్కువ. రష్మిక, తమన్నా చాలా చక్కగా చేశారు. నటి సంగీత అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది’’
‘‘సండే అననురా.. మండే అననురా.. ఎన్నడూ నీదానరా..’ అంటూ పాట పాడిన విజయశాంతి నన్ను వదిలేసి 15ఏళ్లు దాటి పోయింది. ఇన్నేళ్లకు మళ్లీ కలవడం ఆనందంగా ఉంది. ‘నా కన్నా ముందే రాజకీయాల్లోకి వెళ్లావు కదా! నన్ను ఎలా తిట్టావు విజయశాంతి..’ (మధ్యలో విజయశాంతి అందుకుని, రాజకీయం వేరు.. సినిమాలు వేరు.. నవ్వులు) 15ఏళ్లు అయినా, అదే సొగసు, అదే పొగరు.. అదే అందం.. మళ్లీ మనం కలిసి నటిస్తామేమో. రాజకీయం శత్రువులను పెంచుతుంది. సినిమా స్నేహాన్ని పెంచుతుంది. తన మీద ఉన్న ప్రేమ, మమకారం వల్ల ఎప్పుడూ తనని ఒక్క మాట కూడా అనలేదు. (మధ్యలో విజయశాంతి అందుకుని.. మీ మీద ఎప్పటికీ గౌరవం ఉంది. ప్రజల కోసమే నా పోరాటం.) ఇన్నేళ్ల తర్వాత మహేశ్ సినిమా వల్ల మేము కలిసి మాట్లాడే అవకాశం లభించింది. ఈ సినిమాతో పాటు సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని చిరంజీవి అన్నారు.
మాస్ సినిమా చేసి చాలా రోజులైంది: మహేశ్బాబు
‘‘ఈ రోజు ఒక మిరాకల్ అని చెప్పవచ్చు. ఉదయం మా దర్శకుడికి అబ్బాయి పుట్టాడు. దిల్రాజు గారి ఇంటికి ఒక పాప వచ్చింది. ‘ఒక్కడు’ చూసి చిరంజీవిగారు నన్ను అభినందించారు. ‘అర్జున్’ సినిమా చేస్తున్నప్పుడు సెట్కు వచ్చి, ‘నీలాంటి వాళ్లు ఇండస్ట్రీకి కావాలి’ అన్నారు. అలాగే ‘పోకిరి’లో నా నటన చూసి చాలా మెచ్చుకున్నారు. ప్రతి సినిమాకు ఆయన నుంచి ఫోన్ వస్తుంది. ఈ సినిమాకు కూడా మీదే మొదటి ఫోన్ కావాలని కోరుకుంటున్నా. విజయశాంతిగారు చాలా క్రమశిక్షణతో ఉంటారు. మేము ఆమెకు అవకాశం ఇవ్వలేదు. మాకే ఆమె అవకాశం ఇచ్చారు. మా సినిమా చేయడానికి ఒప్పుకొన్నందుకు ధన్యవాదాలు. భారతి పాత్ర మీరు తప్ప వేరే వాళ్లు చేయలేరు. చాలా మందితో పనిచేశాను కానీ, ఒక దర్శకుడు పాజిటివ్ ఎనర్జీ నాకు అనిల్ రావిపూడిలో కనిపించింది. ఇంత త్వరగా నేనెప్పుడూ సినిమా పూర్తి చేయలేదు. నేను ఒక మాస్ సినిమా చేసి చాలా రోజులైంది. నేనెప్పుడైనా కథ నచ్చితేనే చేస్తా. ఇప్పుడు కూడా అనిల్ కథ నచ్చడంతోనే చేశా. తమన్నా, రష్మిక చాలా బాగా చేశారు. ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి అభిమానులు లభిస్తారు. జనవరి 11న మీకో కానుక ఇవ్వబోతున్నాం. మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ కావాలి. చివరిగా చిరంజీవిగారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు’’ అని మహేశ్బాబు అన్నారు.
తండ్రితో ఇండస్ట్రీకి పరిచయం అయ్యా.. కొడుకుతో రీఎంట్రీ ఇచ్చా.
విజయశాంతి మాట్లాడుతూ... ‘‘1979 నుంచి 2020 వరకూ సుదీర్ఘ ప్రయాణం. మీతో నడిచాను. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ అన్ని రకాల సినిమాలు చేశా. చిరంజీవిగారితో కూడా పలు సినిమాలు చేశా. అమ్మాయిల కోసం ‘నేను ఉన్నాను’ అనే ప్రోత్సహాన్ని ఇచ్చేందుకు నేను మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేశా. చిన్నప్పుడు మహేశ్బాబును చూస్తుంటే చాలా క్యూట్గా ఉండేవారు. కృష్ణగారి దర్శకత్వంలో ఆ సినిమా చేశా. మళ్లీ ఇన్నేళ్లకు మహేశ్తో సినిమా చేశా. కృష్ణగారే నన్ను హీరోయిన్గా పరిచయం చేశారు. రీఎంట్రీ మహేశ్బాబుగారితో అవ్వడం నాకు ఆశ్చర్యంగా ఉంది. మహేశ్ 24 క్యారెట్ల బంగారం. జెంటిల్మెన్. ‘సూపర్స్టార్’ అన్న పదానికి అర్థం మహేశ్బాబుగారు. అంచెలంచెలుగా ఎదగడం.. ఒదగడంలో మహేశ్బాబును మించిన వారు ఎవరూ లేరు. ఈ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ సూపర్. మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సీన్లు మీరు తెరపైనే చూడాలి. మహేశ్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలు చూసి ఆశ్చర్యపోయా. ఆయన నిజంగా బయట కూడా సూపర్స్టార్. అనిల్ రావిపూడి కామెడీ టేకింగ్ చాలా బాగుంటుంది. ఇదొక కొత్త ట్రెండ్ సృష్టిస్తుంది. నాతో పట్టుబట్టి ఈ సినిమా చేయించారు. ఈ పాత్రకు న్యాయం చేశానని అనుకుంటున్నా. మీరు తోడుంటే మరిన్ని సినిమాలు చేస్తా. ఇన్నేళ్ల తర్వాత చిరంజీవిని కలవడం చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్పై దర్శకుడు ప్రశాంత్వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది.