వీవీఐటీలో ‘పలాస 1978’ చిత్ర బృందం సందడి

పల్నాడులో ‘పలాస’ బృందం సందడి చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో ఒకప్పుడు చోటు చేసుకున్న యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తుండగా..

Published : 19 Feb 2020 21:48 IST

గుంటూరు: పల్నాడులో ‘పలాస 1978’ బృందం సందడి చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో ఒకప్పుడు చోటు చేసుకున్న యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తుండగా.. రక్షిత్‌, నక్షత్ర హీరోహీరోయిన్‌గా కనిపిస్తున్నారు. ధ్యాన్‌ అట్లూరి నిర్మాత. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ప్రముఖ గాయకుడు రఘుకుంచె విలన్‌ పాత్రలో కనిపించనుండటం విశేషం. ఆయనే సంగీతం అందిస్తున్నారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా గుంటూరులోని వీవీఐటీ (వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ)ని చిత్ర బృందం బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించింది. అనంతరం హీరోహీరోయిన్లతో విద్యార్థులు సెల్ఫీలు దిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు