Nadigar Sangam: మళ్లీ పాండవులు గెలిచారు
ఓట్ల లెక్కింపు ప్రక్రియ దాదాపు రెండేళ్ల తర్వాత జరిగినా అనుకున్నట్లుగానే నడిగర్ సంఘం ఎన్నికల్లో నటుడు విశాల్ జట్టు (పాండవర్ అని)
భారీ విజయాన్ని దక్కించుకున్న విశాల్ జట్టు
కౌంటింగ్ మధ్యలో వాకౌట్ చేసిన భాగ్యరాజ్ టీం
కోడంబాక్కం, న్యూస్టుడే: ఓట్ల లెక్కింపు ప్రక్రియ దాదాపు రెండేళ్ల తర్వాత జరిగినా అనుకున్నట్లుగానే నడిగర్ సంఘం ఎన్నికల్లో నటుడు విశాల్ జట్టు (పాండవర్ అని) విజయం సాధించింది. వారికిది వరుసగా రెండో విజయం కావడం విశేషం. మరోవైపు ఈ లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయని కౌంటింగ్ నుంచి భాగ్యరాజ్ జట్టు వాకౌట్ చేసింది. 2019, జూన్ 23న దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికలు జరిగాయి. సీనియర్ దర్శక నటుడు భాగ్యరాజ్ సారధ్యంలో ‘స్వామి శంకరదాస్’ జట్టు, నాజర్-విశాల్ సారధ్యంలో ‘పాండవర్ అని’.. జట్లు పోటీ చేశాయి. కొన్ని కారణాల వలన, ఎన్నికలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ కారణంగా.. అసలు ఈ ఎన్నికలు చెల్లవని, కౌంటింగ్ ప్రక్రియను నిషేధించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో పోలింగ్ బాక్సులను నుంగంబాక్కంలోని సౌత్ ఇండియన్ బ్యాంక్లో భద్రపరిచారు. ఇదిలా ఉండగా ఎన్నికలు చెల్లవని ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ విశాల్- నాజర్ జట్టు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీంతో ఇటీవల ఈ కేసు విచారణకు రాగా, ఎన్నికలు చెల్లుతాయని, కౌంటింగ్ ప్రక్రియ జరపవచ్చని న్యాయస్థానం ఆదేశించింది. అయితే తీర్పును సవాలుచేస్తూ ఏళుమలై అనే సహాయ నటుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.
ఆనాటి ఉత్సాహంతో..
న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ నుంగంబాక్కంలోని గుడ్ షెపర్డ్ పాఠశాలలో జరిగింది. దాదాపు రెండేళ్ల క్రితం నాటి ఎన్నికలే అయినా.. ఇరు జట్లు అనాటి ఉత్సాహంతో కౌంటింగ్ ప్రాంగణానికి చేరుకున్నాయి. ఎన్నికల అధికారి, నటీనటుల సంఘం ప్రత్యేక అధికారుల సమక్షంలో కౌంటింగ్ చేపట్టారు. కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో విశాల్ జట్టు (పాండవర్ అని) విజయం సాధించింది. అధ్యక్ష పదవికి పోటీ చేసిన నాజర్ ఘన విజయం సాధించారు. ఆయనకు 1,701 ఓట్లు లభించగా, భాగ్యరాజ్కు 1054 ఓట్లు దక్కాయి. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసిన విశాల్ 1720 ఓట్లు సొంతం చేసుకోగా, ఐసరి గణేశ్కు 1,032 ఓట్లు పడ్డాయి. దీంతో విశాల్ మళ్లీ విజయం సాధించారు. కోశాధికారి పదవికి పోటీ చేసిన కార్తికి 1827, ప్రశాంత్కు 919 ఓట్లు వచ్చాయి. 908 ఓట్ల వ్యత్యాసంతో కార్తి గెలుపొందారు. అలాగే ఉపాధ్యక్ష పదవులకు పోటీ చేసిన కరుణాస్కు 1,605 (పాండవర్ అని), కుట్టి పద్మినికి 1,015 (శంకరదాస్ జట్టు), పూచ్చి మురుగన్ 1,612 (పాండవర్ అని), ఉదయకు 973 (శంకరదాస్ జట్టు) ఓట్లు దక్కాయి. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లోనూ పాండవర్ అని విజయం సాధించింది. అంటే వరుసగా రెండు సార్లు గెలుపు గుర్రాలై నిలిచారు. పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి మూడేళ్ల పాటు వీళ్లు పదవిలో కొనసాగుతారు.
భవనం పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యం
‘‘2015 నుంచి 2019 వరకు ‘నడిగర్ సంఘం’ చరిత్రలో కీలకమైన రోజులు. సభ్యులకు దక్కిన సంక్షేమ పథకాలు, దాదాపు 70శాతం పూర్తయిన సంఘం భవన నిర్మాణ పనులు.. వంటి విషయాలు మా జట్టుకు దక్కిన గౌరవ ప్రతీకలు. కానీ రెండేళ్ల పాటు ఆ పనులు ఆగిపోయాయి. మేం చాలా బాధపడ్డాం. దాదాపు రెండేళ్ల తర్వాత న్యాయపోరాటంతో తిరిగి విజయం దక్కింది. ఇది అసాధారణమైన విజయం! ఆ భవనాన్ని పూర్తి చేస్తాం. తద్వారా వచ్చే ఆదాయం తదుపరి తరానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విజయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.’’- నటుడు కార్తి (కోశాధికారిగా గెలిచిన అభ్యర్థి)
లెక్కింపుపై అసంతృప్తి
కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్న భాగ్యరాజ్, ఆయన జట్టులోని ఐసరి గణేశ్లు ప్రారంభం నుంచే తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు. నమోదైన ఓట్లకన్నా ఎక్కువ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. దీంతో కాసేపు ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. మళ్లీ కౌంటింగ్ మొదలవడంతో భాగ్యరాజ్ జట్టు సభ్యులు అక్కడి నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా భాగ్యరాజ్ మీడియాతో మాట్లాడుతూ.. పోలైన ఓట్ల కన్నా 100 ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
పెళ్లిపై నటి వరలక్ష్మీ శరత్కుమార్ ఓ వీడియో క్రియేట్ చేశారు. దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన రణ్వీర్ సింగ్
రణ్వీర్ సింగ్ తన ఇన్స్టా నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. -
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. -
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్పెట్టారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
ఎన్నికల తర్వాత కూడా తాను ఇండస్ట్రీలోనే కొనసాగుతానని కంగనా స్పష్టం చేశారు. -
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
తన గురువు సుకుమార్కి బుచ్చిబాబు సానా ప్రేమ లేఖ రాశారు. నెట్టింట అది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. -
‘పుష్ప’ తర్వాత ఎలాంటి మార్పు రాలేదు: ఫహాద్ ఫాజిల్
‘పుష్ప’ తర్వాత తన కెరీర్లో ఎలాంటి మార్పు రాలేదని నటుడు ఫహాద్ ఫాజిల్ అన్నారు. -
‘యానిమల్’తో పోలుస్తూ ‘రానా నాయుడు’పై రానా కామెంట్..
‘యానిమల్’ విడుదలయ్యాక ‘రానా నాయుడు’ చాలామందికి మంచి సిరీస్లా కనిపించిందని రానా అన్నారు. -
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
సిద్ధార్థ్తో తన రిలేషన్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి ఓపెన్ అయ్యారు. -
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
‘ఆర్య’ విడుదలై 20 ఏళ్లు పుర్తయిన సందర్భంగా అల్లుఅర్జున్ పోస్ట్ పెట్టారు. -
పవన్ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ది అని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది. -
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా సుశాంత్ ఏమన్నారంటే? -
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హీరామండి’ నటుడు
‘హీరామండి’లో సోనాక్షీతో తన సన్నివేశాల గురించి నటుడు ఇంద్రేష్ మాలిక్ స్పందించారు. -
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
సమంత (Samantha) ఒక ఫొటో షేర్ చేసి డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం