Super Star Krishna: కృష్ణ కెరీర్లో ఆ కాలం స్వర్ణయుగం..
కృష్ణ కెరీర్లో 1978-86 మధ్య కాలం స్వర్ణయుగమని చెప్పొచ్చు. ఆ కాలంలో సంఖ్య పరంగా ఎక్కువ సినిమాలు చేయడమే కాదు... అత్యధిక విజయాలూ అందుకున్నారు.
హైదరాబాద్: సూపర్స్టార్ కృష్ణ కెరీర్లో 1978-86 మధ్య కాలం స్వర్ణయుగమని చెప్పొచ్చు. ఆ కాలంలో సంఖ్య పరంగా ఎక్కువ సినిమాలు చేయడమే కాదు... అత్యధిక విజయాలూ అందుకున్నారు. 1978లో ‘అన్నదమ్ముల సవాల్’, ‘ఏజెంట్ గోపి, ‘ఇంద్ర ధనస్సు’, ‘కుమార్ రాజా’, ‘అల్లరి బుల్లోడు’.. 1979లో వియ్యాలవారి కయ్యాలు, హేమాహేమీలు, మండే గుండెలు, కొత్త అల్లుడు, బుర్రిపాలెం బుల్లోడు విజయవంతమైన చిత్రాలుగా నిలిచాయి. ఘరానా దొంగ, మామా అల్లుళ్ల సవాల్, చుట్టాలున్నారు జాగ్రత్త, రామ్ రాబర్ట్ రహీమ్ లాంటి హిట్ చిత్రాల్లో నటించారు. వీటిలో అత్యధిక చిత్రాల్లో కలసి నటించిన కృష్ణ, శ్రీదేవి హిట్పెయిర్గా పేరొందారు.
1981లో సంక్రాంతికి విడుదలైన ‘ఊరికి మొనగాడు’ పెద్ద విజయం సాధించింది. 1982లో కృష్ణ స్వయంగా నిర్మించిన ‘ఈనాడు’ సినిమాతో ఆయన 200 చిత్రాల మైలురాయిని చేరుకోవడం విశేషం. 1983లో ఆయన పద్మాలయా స్టూడియోస్ను స్థాపించారు. ఆ తర్వాతా ఆయన జైత్రయాత్రను కొనసాగించారు. ‘ముందడుగు’, ‘కిరాయి కోటిగాడు’, ‘అడవి సింహాలు’, ‘ప్రజారాజ్యం’, ‘ఇద్దరు దొంగలు’, ‘బంగారు కాపురం’, ‘ముఖ్యమంత్రి’, ‘కంచు కాగడా’ చిత్రాలతో ఆకట్టుకున్నారు. 1985లో కృష్ణ ఇమేజ్ శిఖరాగ్రస్థాయికి చేరింది. ఆ ఏడాది విడుదలైన ‘అగ్నిపర్వతం’, ‘పల్నాటి సింహం’, ‘వజ్రాయుధం’ చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి. వాటిలోని ఆవేశపూరిత పాత్రల్లో కృష్ణ ప్రదర్శించిన అభినయానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
1986లో కృష్ణ దర్శకుడిగా మారి.. ‘సింహాసనం’తో సత్తా చాటారు. ఆ తర్వాతి సంవత్సరాల్లో ‘ముద్దాయి’, ‘తండ్రీ కొడుకుల ఛాలెంజ్’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘సాహసమే నా ఊపిరి’, ‘గూఢచారి 117’, ‘గూండారాజ్యం’ చిత్రాలతో మెప్పించారు. హిందీలోనూ అడుగుపెట్టి నిర్మాతగా ‘ఇష్క్ హై తుమ్సే’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ‘తెలుగు వీర లేవరా’ (1995)తో 300 చిత్రాలు పూర్తిచేశారు. ఆ తర్వాత కథానాయకుడిగా నటిస్తూనే ఇతర చిత్రాల్లో కీలకపాత్రలు పోషించడం ప్రారంభించారు. ‘వారసుడు’, ‘రాముడొచ్చాడు’, ‘ఒసేయ్ రాములమ్మా’, ‘సుల్తాన్’, ‘రాజకుమారుడు’, ‘వంశీ’, ‘మల్లన్న’ తదితర చిత్రాల్లో ప్రత్యేక పాత్రలతో ఆకట్టుకున్నారు కృష్ణ. ‘శ్రీశ్రీ’ సినిమా తర్వాత ఆయన నటించలేదు. ఆరోగ్యం సహకరించకపోవడంతో కొన్నేళ్లుగా సినిమాలకు పూర్తి దూరంగా ఉంటున్నారు. కృష్ణ నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు మహేశ్బాబు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు