Psychovarma: గుండెలోన నువ్వే..
నట్టి క్రాంతి, ముస్కాన్, సుపూర్ణ మలాకర్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘వర్మ’. వీడు తేడా.. అనేది ఉపశీర్షిక. నట్టి కుమార్ తెరకెక్కిస్తున్నారు. నట్టి కరుణ నిర్మాత. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జనవరి 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల గుండెలోన నువ్వే’’ అనే గీతాన్ని విడుదల చేశారు.
నట్టి క్రాంతి, ముస్కాన్, సుపూర్ణ మలాకర్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘వర్మ’. వీడు తేడా.. అనేది ఉపశీర్షిక. నట్టి కుమార్ తెరకెక్కిస్తున్నారు. నట్టి కరుణ నిర్మాత. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జనవరి 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల గుండెలోన నువ్వే’’ అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఎంతో హాయిగా సాగిపోతున్న ఓ సాఫ్ట్వేర్ కుర్రాడి జీవితంలో కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి. దాంతో అతని జీవితం ఎలా మారిపోయింది? ఆ తర్వాత ఏం జరిగింది? అన్న ఆసక్తికర మలుపులతో సినిమా సాగుతుంది. క్రాంతి తన పాత్రలో అద్భుతంగా జీవించాడ’’న్నారు. ‘‘యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. ఇలాంటి కథా బలమున్న చిత్రంలో నటించడం ఆనందంగా ఉంద’’న్నారు క్రాంతి. నిర్మాత మాట్లాడుతూ ‘‘మంగళవారం చిత్ర ట్రైలర్ విడుదల చేస్తామ’’న్నారు.
ఈ చిత్రానికి సంగీతం: రవిశంకర్,
ఛాయాగ్రహణం: జనార్ధన్ నాయుడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కథలతో ప్రయాణం
సరికొత్త కథలతో ప్రయాణం చేయనున్నారు విజయ్ దేవరకొండ. మొదట్నుంచీ ఆయనది అదే పంథానే. అందుకే యువ కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు -
సంద్రంలో జాలరి.. తీరంలో అల్లరి
సహజమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్న కథానాయిక... సాయిపల్లవి. ‘తండేల్’లో బుజ్జితల్లిగా సందడి చేయనుంది. -
వీరిద్దరి జీవితం క్రికెట్ ఒక్కటే
నచ్చిన జట్టు క్రికెట్ ఆటలో విజయం సాధిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేరు కొందరు. ఆ కొందరిలో బాలీవుడ్ తారలు జాన్వీ కపూర్, రాజ్కుమార్ రావ్లు కూడా ఉన్నారు. -
ఈటీవీ విన్లో ఒకే రోజు రెండు సినిమాలు
ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో గురువారం రెండు చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. ‘చిత్రం చూడర’, ‘పారు’్ధ.. ఈ రెండు సినిమాలు నేడే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి -
విడుదల సెట్ అయ్యిందే...!
కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న ‘భజే వాయు వేగం’ విడుదల ఖరారైంది. ఈ నెల 31న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో తెలిపాయి. -
ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రావడం లేదు?
సినిమాకు కథే హీరో. ఈ కథలే ఎంతో మంది ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేలా చేస్తాయి. కానీ ప్రస్తుతం బాలీవుడ్లో అలాంటి కథా చిత్రాలు రాకపోవడంతో థియేటర్లలో సందడి లేదు. -
తండ్రీతనయులు తాత మనవళ్లుగా...
నిజ జీవితంలో తండ్రీ తనయులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ తెరపై తాత, మనవడుగా సందడి చేయనున్నారు. -
ఇలాంటి కలయికలో మరో చిత్రం రాదేమో!
గత కొంత కాలంగా హిందీ సినిమాలకు దూరంగా ఉన్న అగ్రకథానాయిక ప్రియాంక చోప్రా వరుస హాలీవుడ్ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. -
వించిపేట భద్ర... ఎంతో ప్రత్యేకం
‘‘ఇప్పటివరకూ చేసిన పాత్రలకి పూర్తి భిన్నంగా... గాఢతతో కూడిన వించిపేట భద్ర పాత్ర నా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది’’ అన్నారు సత్యదేవ్. -
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.