Nagarjuna: సినిమా పరిశ్రమకి రాజధానిలా హైదరాబాద్
‘‘1976లో మేం హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్ని ప్రారంభించాం. అప్పటికి ఇక్కడ చిత్ర పరిశ్రమ లేదు, సాంకేతిక నిపుణులు లేరు, సినిమాకి సంబంధించిన ఏ విభాగం లేదు.
‘‘1976లో మేం హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్ని ప్రారంభించాం. అప్పటికి ఇక్కడ చిత్ర పరిశ్రమ లేదు, సాంకేతిక నిపుణులు లేరు, సినిమాకి సంబంధించిన ఏ విభాగం లేదు. అలాంటి దశ నుంచి మొదలైన ప్రయాణం ఇక్కడివరకూ వచ్చింది. సాంకేతికంగా రోజు రోజుకీ గొప్ప మార్పు కనిపిస్తోంది. హైదరాబాద్ సినిమా పరిశ్రమకి రాజధానిలా మారుతోంది’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు నాగార్జున. ఆయన మంగళవారం హైదరాబాద్లో జరిగిన సినిమాటిక్ ఎక్స్పో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ, వినోద రంగంలోని సరికొత్త సాంకేతికతని పరిచయం చేయడంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్ సంస్థలు సమర్పిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాగార్జున మాట్లాడారు. ‘‘తెలుగువాళ్లకి సినిమాలంటే ప్రాణం. ఓ సినిమాకి భారతదేశం మొత్తం వచ్చిన వసూళ్లు ఓ ఎత్తు, తెలుగు రాష్ట్రాల వసూళ్లు మరో ఎత్తు. దక్షిణాది సినిమాల్ని భారతదేశం మొత్తం అనుసరిస్తుండడం గర్వపడే విషయం. నాగ్ అశ్విన్లాంటి దర్శకులు తమ ప్రతిభని ప్రపంచానికి చూపిస్తున్నారు. తెలుగు నుంచి ఆస్కార్స్కి వెళ్లాం. ఎనిమిదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్లని అభినందిస్తున్నా. చిత్ర పరిశ్రమ, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, యానిమేషన్ తదితర రంగాలకి చెందినవాళ్లకి ఇండియా జాయ్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో ఉపయుక్తం’’ అన్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘‘హాలీవుడ్ సినిమాల్లా అంత నాణ్యతతో సినిమాలు ఎందుకు చేయరనే ప్రశ్న మాకు తరచూ ఎదురయ్యేది. గత పదేళ్లుగా మనం కూడా గొప్ప నాణ్యతతో సినిమాలు తీస్తున్నాం. హాలీవుడ్వాళ్లు కూడా ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. ‘కల్కి 2898 ఎ.డి’ని పూర్తిగా మన సాంకేతికతతోనే భారత్లో తయారైన సినిమాలా చేద్దామని ప్రయత్నించా. చాలా వరకు ఇక్కడే ఆ సినిమా పనులు జరుగుతున్నాయి. నా తదుపరి సినిమాని మాత్రం వందశాతం ఇక్కడి సాంకేతికతతోనే తెరకెక్కిస్తా’’ అన్నారు. ‘‘2016లో తీసుకొచ్చిన పాలసీతో యానిమేషన్, గేమింగ్ పరిశ్రమల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాం. భవిష్యత్తులో మరిన్ని రాయితీలతో ఈ రంగాల్ని ప్రోత్సహిస్తాం’’ అన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు కె.కె.సెంథిల్కుమార్, పి.జి.విందాతోపాటు వివిధ సంస్థల ప్రతినిధులు బిరేన్ గోస్, మైక్, ఆశిష్ కులకర్ణి, సరస్వతి వాణి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
‘పంచాయత్ సీజన్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
‘పంచాయత్ సీజన్ 3’ వెబ్సిరీస్ విడుదల తేదీ ఖరారైంది. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందంటే? -
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్సిరీస్ ఎలా ఉంది?
భారీ తారాగణంతో సంజయ్లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన వెబ్సిరీస్ మెప్పించిందా? -
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. -
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈసారి ‘సిద్ధి’గా
చిట్టిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్రవేసుకుంది నటి ఫరియా అబ్దుల్లా. అమాయకమైన చూపులతోనూ నటనతోనూ ఆకట్టుకుంటున్న ఈ హైదరాబాదీ అమ్మాయి ‘ఆ ఒక్కటీ అడక్కు’లోని సిద్ధి పాత్రతో నవ్వులు పంచేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
తలదించితే బానిసవి.. ఎత్తినావా నువ్వే బాదుషావి
‘‘తలదించినావా బానిసవి.. ఎత్తినావా బాదుషావి.. తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా’’ అంటూ తను నమ్మిన జీవిత సూత్రాన్ని అందరికీ బోధిస్తున్నాడు పుష్పరాజ్. -
అక్టోబరులో మొదలు!
‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. -
రజనీ బయోపిక్ రానుందా?
సినిమాల్లో తమ అభిమాన హీరోలు చేసే యాక్షన్ హంగామాను చూస్తూ మురిసిపోతుంటారు ప్రేక్షకులు. -
కృష్ణమ్మ.. అందరూ మాట్లాడుకునే చిత్రమవుతుంది
‘‘సత్యదేవ్ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్డమ్ వస్తుంది. -
మనం నవ్వుతుంటే ప్రేక్షకులు భయపడాలి!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఆ మార్పు నాలో విశ్వాసాన్ని నింపింది
‘ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పు నాలో విశ్వాసాన్ని పెంచుతుంది’ అని అంటోంది బాలీవుడ్ నాయిక తాప్సీ. -
సందేశమిచ్చే గాంధీ తాత చెట్టు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం కానుంది. -
ఇందులో అన్నీ ఉంటాయి
‘‘ప్రేక్షకులకు చాలా తృప్తినిచ్చే సినిమా ‘ప్రసన్న వదనం’. దీన్ని సీటు అంచున కూర్చొని ఆస్వాదిస్తారు. అదిరిపోయిందని చప్పట్లు కొడతారు’’ అన్నారు సుహాస్. -
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం