సోషల్‌ లుక్‌: హరితేజ సరదాగా.. ఆది రెస్క్యూ

నిత్యం సామాజిక మాధ్యమాల వేదికగా తమ అభిప్రాయాలను, అభిరుచులను, ప్రత్యేక చిత్రాలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటారు సెలబ్రిటీలు. తాజాగా కొందరు సెలబ్రిటీలో

Updated : 16 Sep 2022 14:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నిత్యం సామాజిక మాధ్యమాల వేదికగా తమ అభిప్రాయాలను, అభిరుచులను, ప్రత్యేక చిత్రాలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటారు సెలబ్రిటీలు. తాజాగా కొందరు సెలబ్రిటీలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. అగ్రకథానాయిక సమంత మరోసారి తన అభిమానులకు వ్యవసాయ పాఠాలు చెప్పారు. కరోనా నేపథ్యంలో హాస్యనటుడు వెన్నెల కిషోర్‌ రోజూ ఆవిరిపడుతున్నారట. ఆహారంలో అల్లం, పసుపు, ఉల్లికాడలు, సోయా, హూసన్‌ సాస్‌ ఇలా ప్రయత్నించనిదంటూ ఏదీ లేదని చెబుతున్నారు. నటి హరితేజ ‘శశి వదనే.. శశివదనే’ పాటకు సరదాగా హావభావాలు పలికించారు. యువ నటుడు ఆది రెండు బుజ్జి కుక్క పిల్లలను కాపాడారు. ఆకలితో అలమటిస్తున్న వాటికి పాలు పట్టారు. నటి ఛార్మి తన చిన్నప్పుడు తండ్రితో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. నివేదా డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తుంటే, రాశీఖన్నా వ్యాయామాలు చేస్తూ కనిపించారు.













Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని