Cinema News: ఈనాడు సినిమా ముచ్చట్లు..!
వైష్ణవి ఫిలింస్ పతాకంపై నాగశౌర్య కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఎస్.ఎస్.అరుణాచలం దర్శకుడు.
నాగశౌర్య చిత్రం ప్రారంభం
వైష్ణవి ఫిలింస్ పతాకంపై నాగశౌర్య కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఎస్.ఎస్.అరుణాచలం దర్శకుడు. శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్కుమార్, డా.అశోక్ కుమార్ నిర్మిస్తున్నారు. బేబి అద్వైత, భవిష్య సమర్పకులుగా ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. దర్శకుడు వి.వి.వినాయక్ ముఖ్యఅతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్నిచ్చారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు తిరుమల కిషోర్ గౌరవ దర్శకత్వం వహించారు. సాంబశివారెడ్డి, సంతోష్కుమార్ చిత్ర బృందానికి స్క్రిప్ట్ని అందజేశారు. ‘‘యువతరంతోపాటు, కుటుంబ ప్రేక్షకుల్ని అలరించే అంశాలున్న చిత్రమిది’’ అని సినీవర్గాలు తెలిపాయి.
దిల్వాలా షురూ
‘పూలరంగడు’తో ప్రేక్షకుల్ని నవ్వించిన దర్శకుడు వీరభద్రమ్ చౌదరి నరేష్ అగస్త్య హీరోగా ‘దిల్వాలా’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. నబీషేక్, తూము నర్సింహ పటేల్ నిర్మిస్తున్నారు. శ్వేత అవస్తి కథానాయిక. రాజేంద్రప్రసాద్, అలీ రెజా, దేవ్గిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ హైదరాబాద్లో ప్రారంభమైంది. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలియజేశారు.
‘వీరయ్య’ కోసం సోలమన్ సీజర్గా..
చిరంజీవి కథానాయకుడిగా బాబీ (కె.ఎస్.రవీంద్ర) తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్ కథానాయిక. రవితేజ, బాబీ సింహా శక్తిమంతమైన పాత్రలు పోషించారు. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఆదివారం బాబీ సింహా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆయన ఫస్ట్లుక్ విడుదల చేశారు. ఆ పోస్టర్లో బాబీ పూల చొక్కా ధరించి మెడలో బంగారు గొలుసులు, చేతి కడియం, నల్లటి కళ్లజోడుతో వింటేజ్ లుక్లో కనిపించారు. ఇందులో ఆయన సోలమన్ సీజర్గా సందడి చేయనున్నట్లు తెలియజేశారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. ఆర్థర్ ఎ విల్సన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
టీనేజ్ ప్రేమకథ
యశ్వంత్ యజ్జవరుపు, తృప్తి శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓయ్ ఇడియట్’. వెంకట్ కడలి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సత్తిబాబు మోటూరి, శ్రీనుబాబు పుల్లేటి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. విడుదలకి ముస్తాబవుతున్న ఈ సినిమా ట్రైలర్ని దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘టీనేజ్ ప్రేమకథతో ఈ సినిమా చేశారు. విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా’’ అన్నారు.
థియేటర్లో చూడాల్సిన సినిమా
సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి జంటగా రాజశేఖర్రెడ్డి పులిచర్ల తెరకెక్కించిన చిత్రం ‘గాలోడు’. సంస్కృతి ఫిలింస్ సంస్థ నిర్మించింది. సప్తగిరి, పృథ్విరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలైన నేపథ్యంలో.. హైదరాబాద్లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ట్రైలర్కు మంచి స్పందన వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు సుధీర్. యువత, కుటుంబ ప్రేక్షకులకూ నచ్చేలా ఉండే ఈ సినిమా థియేటర్కి వెళ్లి చూడాలన్నారు గెహ్నా.
థ్రిల్ పంచే ‘అధర్వ’
కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో మహేష్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘అధర్వ’. సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు. సిమ్రాన్ చౌదరి, ఐరా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర కొత్త లుక్ విడుదల చేశారు. ‘‘వైవిధ్యభరితమైన కథతో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. ప్రేక్షకుల్ని థ్రిల్కి గురి చేసే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఛాయాగ్రహణం: చరణ్ మాధవనేని.
‘అవతార్’ చాలిస్తా
ప్రపంచవ్యాప్తంగా అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చిత్రం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’. అవతార్ సిరీస్లో ఇది రెండో చిత్రం. మూడు, నాలుగు, ఐదో భాగాలూ ఉంటాయని దర్శకుడు జేమ్స్ కామెరూన్ గతంలోనే ప్రకటించారు. అయితే దీనికి భిన్నంగా.. ‘ఒకవేళ ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ విజయం సాధించకపోతే నాలుగు, ఐదో భాగాలు తెరకెక్కించడం సాధ్యం కాద’నే సంచలనం విషయం తాజాగా వెల్లడించారు. ‘మూడు నెలల్లో అంతా తేలిపోతుంది. అవతార్ని మూడు భాగాలతో ముగించాలా? ఇంకా ముందుకెళ్లాలా.. అనేది అప్పుడే తెలుస్తుంది. సినిమాకి భారీ వసూళ్లు రాకపోతే, సరైన వ్యాపారం జరగకపోతే కథ ఇంతటితో ముగిసిపోయినట్టే’ అని ఓ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, స్టీఫెన్లాంగ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన రెండో భాగం డిసెంబరు 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..