Madhubala: ఒక భాష లక్ష్యంగా ఎప్పుడూ పనిచేయలేదు
‘‘ఇప్పుడనే కాదు పోటీతత్వం అన్నది చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఉంది. కాకపోతే దాన్ని నేనెప్పుడూ పోటీలా తీసుకోలేదు. మనకు ఏ పాత్ర రాసి ఉంటే.. ఆ పాత్రలే వస్తాయని నమ్మా. వాటిలో మనసుకు నచ్చిన వాటిని చేసుకుంటూ ముందుకు వెళ్లా.
‘‘ఇప్పుడనే కాదు పోటీతత్వం అన్నది చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఉంది. కాకపోతే దాన్ని నేనెప్పుడూ పోటీలా తీసుకోలేదు. మనకు ఏ పాత్ర రాసి ఉంటే.. ఆ పాత్రలే వస్తాయని నమ్మా. వాటిలో మనసుకు నచ్చిన వాటిని చేసుకుంటూ ముందుకు వెళ్లా. ఇప్పుడు అలాగే సినీ ప్రయాణం కొనసాగిస్తున్నా’’ అన్నారు మధుబాల (Madhubala). ‘రోజా’, ‘అల్లరి ప్రియుడు’, ‘జెంటిల్మేన్’ వంటి విజయవంతమైన చిత్రాలతో ఓతరం సినీప్రియుల్ని అలరించిన నాయిక ఆమె. ఇప్పుడు ‘ప్రేమ దేశం’లో (Premadesam) కీలక పాత్ర పోషించారు. త్రిగుణ్, మేఘా ఆకాష్ జంటగా నటించిన చిత్రమిది. శ్రీకాంత్ సిద్ధం దర్శకుడు. డిసెంబర్ 2న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు మధుబాల.
* ‘‘ఈ చిత్రంలో నేను త్రిగుణ్ తల్లిగా కనిపిస్తాను. గతంలో నేను చాలా సినిమాల్లో తల్లిగా నటించా. వాటిలో నా పాత్ర ఎంత బలంగా ఉంటుందో.. ఇందులోనూ అంతే కీలకంగా ఉంటుంది. దర్శకుడు నన్ను దృష్టిలో పెట్టుకునే ఈ పాత్రను తీర్చిదిద్దుకున్నారట. తొలుత నేనీ సినిమా చెయ్యనని చెప్పా. కానీ, దర్శకుడు పదే పదే నన్ను కలవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. తనకి నాపై ఉన్న నమ్మకం నచ్చి సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. ఈ చిత్రంలో తల్లీకొడుకుల మధ్య అనుబంధాన్ని చక్కగా చూపించారు. నిజ జీవితంలో నేను నా పిల్లలతో ఎంత సరదాగా ఉంటానో.. ఇందులో అలాగే కనిపిస్తా. సినిమాలో నా కొడుకు తనతో స్నేహం చేయకముందే నేను హీరోయిన్తో స్నేహం చేస్తాను. ఈ సున్నితమైన ప్రేమకథకు మణిశర్మ అద్భుతమైన సంగీతమందించారు’’.
* ‘‘తెలుగు భాష నాకు అంతగా తెలియకపోయినా.. మిగతా భాషల్లో నటించిన దానికంటే తెలుగులో బాగా చేసినట్లుగా అనిపిస్తుంది. చాలా సౌకర్యంగా ఉంటుంది. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ఇతరత్రా ఆదాయాల వల్ల ఇప్పుడు నిర్మాణ విలువలు పెరిగాయి. ఇది నిర్మాతలకూ మేలు చేకూరుస్తోంది. ఇంతకు ముందు చిన్న బడ్జెట్ సినిమాలంటే.. నిజంగానే చిన్న స్థాయిలో ఉండేవి. కానీ, ఇప్పుడలాంటి పరిస్థితులు లేవు’’.
* ‘‘నాకు కామెడీ పాత్రలంటే చాలా ఇష్టం. అయితే ఒకటి రెండు హిందీ సినిమాల్లో తప్ప మిగతా భాషల్లో ఆ తరహా పాత్రల్లో నటించే అవకాశం రాలేదు. నటిగా నాలోని ప్రతిభను అన్ని కోణాల్లో ఆవిష్కరించుకోవాలని ఉంది. అందుకే నెగటివ్.. పాజిటివ్ అని లెక్కలేసుకోకుండా అన్ని రకాల పాత్రలు పోషించాలనుకుంటున్నా. ఇప్పుడు తెలుగు నుంచే ఎక్కువ పాన్ ఇండియా చిత్రాలొస్తున్నాయి. ఇక్కడ పని చేస్తే ఎక్కువ రీచ్ వస్తోంది. అందుకే ప్రస్తుతం తెలుగుపై దృష్టి పెట్టాను. నేనిప్పుడు హిందీలో ‘కర్తమ్ హుక్తమ్’ అనే చిత్రం చేస్తున్నా. ‘గేమ్ ఆన్’ అనే సినిమా పూర్తి చేశా. జీ5 కోసం ఓ వెబ్సిరీస్ చేస్తున్నా’’.
* ‘‘ఓ భాషనే లక్ష్యంగా చేసుకొని నేనెప్పుడూ పని చేయలేదు. నేను నా ప్రతిభను అన్ని చిత్రసీమలకు చూపించాలనుకున్నా. అందుకే ఏ భాషలోనూ నాకు ఎక్కువ సినిమాలు లేవు. ‘రోజా’, ‘జెంటిల్మేన్’, ‘అల్లరి ప్రియుడు’ వంటి చిత్రాలతో అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరయ్యా. ఇప్పుడు రకుల్, తమన్నా వంటి వారు తెలుగు నేర్చుకుని.. ఇక్కడ వరుస సినిమాలు చేసినా ముంబయి అమ్మాయిల్లాగే చూస్తుంటారు. కానీ, ఆరోజుల్లో నన్నెవరూ ముంబయి అమ్మాయిలా చూడలేదు. ఏ భాషలో సినిమా చేస్తే.. ఆ ప్రాంతపు అమ్మాయిగానే గుర్తించారు. అదే నాకు ప్లస్’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన రణ్వీర్ సింగ్
రణ్వీర్ సింగ్ తన ఇన్స్టా నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. -
Arya: ‘అ అంటే అమలాపురం’.. 20 ఏళ్లయినా అదే గ్రేస్తో అదరగొట్టిన అభినయశ్రీ!
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్ను మలుపు తిప్పిన చిత్రంగా ‘ఆర్య’ నిలిచిపోతుంది. అప్పట్లో ఈ సినిమాలోని ‘‘అ అంటే అమలాపురం..’’ పాట యువతను ఉర్రూతలూగించింది. ఆ పాటలో అభినయశ్రీ తన డ్యాన్స్తో అదరగొట్టింది. తాజాగా నిర్వహించిన వేడుకలో ఆమె మరోసారి అదే పాటకు స్టెప్పులేసి అలరించింది.
-
Allu Arjun: ‘ఆర్య’.. నా కెరీర్ని ట్రాక్లోకి తీసుకొచ్చింది: అల్లుఅర్జున్
తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఆర్య’ ఓ మలుపు అని ప్రముఖ నటుడు అల్లుఅర్జున్ (Allu Arjun) అన్నారు. ఆయన కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్య’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మించారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి 20 ఏళ్లయింది. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం రాత్రి హైదరాబాద్లో ప్రత్యేకంగా ఓ వేడుకని నిర్వహించింది.
-
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అదాశర్మ కీలక పాత్రలో నటించిన ‘బస్తర్’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. -
Pushpa: ‘పుష్ప’ ఫేమస్ డైలాగ్ వెనుక హరీశ్ శంకర్
Pushpa 2: The Rule: ‘పుష్ప’ ఫేమస్ డైలాగ్ వెనుక దర్శకుడు హరీశ్ శంకర్ ఉన్నారు. -
‘సలార్’లో పాత్రపై ఊహించని అప్డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్
‘సలార్’లో తన పాత్రపై పృథ్వీరాజ్ సుకుమారన్ అప్డేట్ ఇచ్చారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. -
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్పెట్టారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. -
బాహుబలి విశ్వాన్ని మరింత విస్తరింపజేస్తాం
‘బాహుబలి’ సినిమాలతో సినీప్రియుల్ని అలరించారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఇప్పుడీ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న యానిమేటెడ్ సిరీస్ ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’. దీనికి జీవన్ జె.కాంగ్, నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. -
ఊరిస్తున్న ఎన్టీఆర్
‘దేవర’ ప్రచార చిత్రాలతో సినీ ప్రియుల్ని అలరించారు ఎన్టీఆర్. ‘వార్ 2’ కోసం హిందీలోకి అడుగుపెట్టి.... ఆ కొత్త ప్రయాణం గురించీ ఆసక్తిగా మాట్లాడుకునేలా చేశారు. ఆయన పుట్టినరోజు దగ్గర పడుతుండడంతో మరోసారి ‘దేవర’ ప్రచార చిత్రాలు కానీ, పాటతో కానీ హంగామా చేయొచ్చని పరిశ్రమ, అభిమాన వర్గాల అంచనా. -
తెలుగు చిత్ర పరిశ్రమకి ఓ మలుపు... ఆర్య
‘‘తెలుగు సినిమా ఇలా కూడా ఉంటుందా అనిపించేలా అప్పట్లో ‘ఆర్య’ తీశారు సుకుమార్. ఎంతో మంది దర్శకులు... ఎన్నో మంచి చిత్రాలు ఈ సినిమా నుంచే వచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఆర్య’ ఓ మలుపు’’ అన్నారు అల్లు అర్జున్. -
మెరుపుల తార.. తళుకుల చీర
అందం, నటనతో అలరిస్తున్న బాలీవుడ్ అగ్రనాయిక అలియా భట్ ఈసారి ఆకట్టుకునే వస్త్రధారణతో అంతర్జాతీయ యవనికపై అలరించింది. ప్రఖ్యాత ఫ్యాషన్ వేదిక ‘మెట్ గలా’లో ఆమె చీరలో మెరిసింది. -
రోడ్లన్నీ గతుకులపాలే.. ఊరంతా చీకటిపాలే
ఓట్లు కొనేసి ఆ తర్వాత ప్రజల బాగుని మరిచే రాజకీయ నాయకుల్ని నమ్మొద్దని... గొర్రెల్లా కాకుండా మనిషిలా ఆలోచించి ఓటు వేయండని పిలుపునిస్తూ ‘కమిటీ కుర్రోళ్ళు’ పాటందుకున్నారు. మరి వారి ఆట పాట జనాల్లో ఎలాంటి మార్పుని తీసుకొచ్చిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
‘డియర్ స్టూడెంట్స్’ సందడి మొదలు
ఇటీవలే ‘డియర్ స్టూడెంట్స్’ అగ్రతార నయనతారకు స్వాగతం పలికారు. ఈమె, నివిన్ పౌలీ జంటగా నటిస్తున్న వినోదాత్మక చిత్రమిది. సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్రాయ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. -
జులై 20న.. కౌలాలంపూర్లో
తెలుగు సినిమా వైభవాన్ని... వారసత్వ పరంపరని చాటి చెప్పేలా 90 ఏళ్ల వేడుకని నిర్వహిస్తామని చెప్పారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. జులై 20న కౌలాలంపూర్, బుకిట్ జలీల్లోని ప్రతిష్ఠాత్మక నేషనల్ స్టేడియంలో ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
తెరపై యుద్ధం.. ఖర్చు రూ.8కోట్లు
‘కార్తికేయ 2’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు నిఖిల్. ఇప్పుడు ‘స్వయంభూ’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
ఇంకా చాలా వేదికల ద్వారా ‘బాహుబలి’ని తీసుకొస్తామని అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..