‘ఆచార్య’.. బాక్సులు బద్దలవుతాయ్
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడు తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ తప్పకుండా బాక్సులు బద్దలుకొడుతుందని ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా నుంచి ఇటీవల..
లాహే లాహే సక్సెస్పై రచయిత, సంగీత దర్శకుడు
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ తప్పకుండా బాక్సులు బద్దలుకొడుతుందని ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా నుంచి ఇటీవల ‘లాహే లాహే’ పాట విడుదలై యూట్యూబ్లో దూసుకెళ్తోంది. పరమశివుడు-పార్వతిదేవిల ఏకాంత సమయాన్ని తెలియజేసే విధంగా రచించిన ఈ పాట ప్రతి ఒక్కర్నీ ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ‘లాహే లాహే’ గురించి చిత్ర సంగీత దర్శకుడు మణిశర్మ, రచయిత రామజోగయ్యశాస్త్రి చెప్పిన కొన్ని విశేషాలు..
అలా రాశా: రామజోగయ్యశాస్త్రి
‘‘కొరటాల శివ ఆలోచనలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయి. ఆయన మనసులో మాటల్ని కొద్దిగా మాత్రమే బయటకు చెబుతారు. జడలు విరబూసుకున్న అమ్మవారి రూపానికి సంబంధించి ఓ విజువల్ ఆయన మనసులో ఉంది. అది ఎక్కడో ఒకచోట ఈ పాటలో రావాలని ఆయన అనుకున్నారు. అలా ఈ పాట రాశాను. సాధారణంగా శివుడు గురించి పాట రాయవచ్చు. అలాగే అమ్మవారి గురించి విడిగా రాయవచ్చు. కానీ వాళ్లిద్దరి ఏకాంత సమయాన్ని.. వాళ్ల మధ్య జరిగే చిన్న చిన్న విషయాలను చమత్కారంగా చెప్పే అవకాశం రావడం అనేది ఒక సువర్ణావకాశమనే చెప్పాలి. జనాలకు మరింత చేరువ కావాలనే ‘లాహే లాహే’ పదాలు ఉపయోగించాం’’
వేదపండితుల నుంచి ఫోన్ కాల్స్ : మణిశర్మ
‘‘మొదటిసారి ‘లాహే లాహే’ లిరిక్స్ చూడగానే తెలియని వైబ్రేషన్స్ వచ్చాయి. వెంటనే ఆపాటకు ట్యూన్ చేయాలనిపించింది. ఇక, పాట విడుదలయ్యాక వేద పండితుల నుంచి నాకు మెస్సేజ్లు, ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. ప్రశంసలు కురిపించారు’’
చిన్న భయం: రామజోగయ్య శాస్త్రి
‘‘పాట రిలీజ్ అంటే ఒక చిన్న భయం ఉంటుంది. ఎందుకంటే కథ, సందర్భం ఏమీ బయటకు చెప్పలేం. మెగా ఫ్యామిలీ, ముఖ్యంగా చిరంజీవి అభిమానులకు ఉన్న అంచనాలు వేరే స్థాయిలో ఉంటాయి. పాట అనగానే మొదట వాళ్లు వేరే ఏదో ఊహించుకుంటారు. ఇలాంటి భక్తిపరమైన పాటను విడుదల చేస్తే ఏమైనా నిరాశకు గురి అవుతారా? అనే భయం విడుదలకు ముందు ఉంది. కానీ పాట విడుదలయ్యాక అందరూ దాన్ని బాగా ఆదరించారు. మా పాటను ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. పాట విడుదలైన రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పదిగంటల వరకూ సోషల్మీడియాలో వచ్చిన కామెంట్లకు రిప్లైలు ఇచ్చాను. అలాగే వేద పండితులు కూడా ఫోన్ చేశారు’’
గొప్పతనం శివదే: మణిశర్మ
‘‘పాటంటే ప్రతి పదం కూడా స్పష్టంగా వినిపించాలి. ఇది నా మొదటి సినిమా నుంచి నేను ఫాలో అవుతున్న నియమం. ఈ పాటకు సంబంధించి శాస్త్రిగారిని, నన్నూ ఎంతో ప్రోత్సహించిన దర్శకుడు కొరటాలశివకే ఈ క్రెడిట్ దక్కుతుంది. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలున్నాయి. ఇప్పటికే నాలుగు పాటలకు కంపోజింగ్ పూర్తి చేశాం. ఇక, ‘లాహే లాహే’ పాట విని చిరు అన్నయ్య నాకు ఫోన్ చేసి 15 నిమిషాలు మాట్లాడారు’’
శివ.. గొప్ప మనిషి: రామజోగయ్య శాస్త్రి
‘‘కొరటాల శివతో నాది దాదాపు నాలుగు సినిమాల ప్రయాణం. ఆయనలో ఉండే గొప్పలక్షణం ఏమిటంటే.. రచయితలను గౌరవిస్తారు. ఒకవేళ ఏదైనా లిరిక్స్ని ఫోన్లో పంపించినా సరే దానిని పైకి చదివి పక్కవాళ్లతో చెప్పి మమ్మల్ని మెచ్చుకుంటారు. ‘ముసలి తాత ముడతముఖం’ సాంగ్ రాసిన సమయంలో లొకేషన్కు వెళ్లి ఆయనతో చెప్పాను. వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్స్ అందర్నీ దగ్గరకు పిలిపించి మరీ ఆ పాట మరోసారి నాతో పాడించారు. వాళ్లందరి ముందు నా పాట బాగుందని చెప్పారు. ఆయన గొప్ప వ్యక్తి’’
ఆ కోరిక ఇలా తీరింది: రామజోగయ్య శాస్త్రి
‘‘చిరంజీవి చిత్రానికి ఓ పాట రాయాలనే కోరిక నాలో ఎప్పటి నుంచో ఉంది. ‘ఖైదీ నం:150’లో ‘రైతన్న’ పాట రాశాను. కానీ ఆయనకు తగ్గట్టు పాట రాయాలనే కోరిక నాకు అలాగే మిగిలింది. చిరుతో ఇది నాకు సెకండ్ సాంగ్. నా ఎదురుచూపులకు ఓ మంచి అవకాశం ఈ పాటతో దక్కింది. ఆ పాట విని చిరు నాకు ఫోన్ చేసి అభినందించారు. మెగాస్టార్ లాంటి పెద్ద వ్యక్తి నాలాంటి వాడికి ఫోన్ చేసి ప్రశంసిస్తారని ఊహించనేలేదు. ఈ సినిమా తప్పకుండా బాక్సులు బద్దలు కొడుతుంది’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
‘బేబీ’తో మంచి విజయాన్ని అందుకున్న తెలుగమ్మాయి వైష్ణవీ చైతన్య ఇప్పుడు ‘లవ్ మీ’తో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో ఎదురైన ప్రశ్నలపై ఆమె స్పందించారు. -
అందుకే ‘జనతా గ్యారేజ్’లో ఐటెం సాంగ్ చేశాను: కాజల్ అగర్వాల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
నటి కోవై సరళ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. -
నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!
బాలీవుడ్ సీనియర్ నాయిక కరీనాకపూర్ టాప్గేర్లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్కి భారత్ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది. -
‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలనుంది!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే..
తాజా వార్తలు (Latest News)
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు