Balakrishna: ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు: బాలకృష్ణ

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు (84) మరణం పట్ల నటుడు నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామారావు గొప్ప దర్శకుడన్నారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని బాలయ్య....

Updated : 20 Apr 2022 10:35 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు (84) మరణం పట్ల నటుడు నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామారావు గొప్ప దర్శకుడన్నారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని బాలయ్య గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు రామారావు మృతిపట్ల బాలకృష్ణ సంతాపం ప్రకటిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘దర్శకుడు అనే మాటకు వన్నె తెచ్చిన ప్రముఖ దర్శకులు తాతినేని రామారావు ఈరోజు మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన మరణవార్త నన్నెంతగానో కలచివేసింది. ఆయనొక అద్భుతమైన దర్శకులు. నాన్నతో కలిసి చరిత్రలో నిలిచిపోయే ‘యమగోల’ లాంటి విజయవంతమైన చిత్రాలు తీసి మేటి దర్శకులుగా నిలిచారు. ఆయన దర్శకత్వంలో నేను కథానాయకుడిగా చేసిన ‘తల్లితండ్రులు’ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించింది. నిర్మాత పక్షాన నిలబడి, నిర్మాతకు డబ్బులు మిగలాలని ఆలోచిస్తూ, అదే సమయంలో సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా చిత్రాలు నిర్మించే ప్రతిభ తాతినేని రామారావు సొంతం. బాలీవుడ్‌లోనూ హిట్ చిత్రాలు తీసి అక్కడా విజయవంతమైన దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని బాలకృష్ణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని