Pawan Kalyan: అనుకోని అతిథిపై పవన్‌కల్యాణ్‌ ఇన్‌స్టా పోస్ట్‌.. వీడియో వైరల్‌

ఇన్‌స్టా వేదికగా పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) తాజాగా ఓ వీడియో షేర్‌ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

Updated : 23 Nov 2023 16:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాజకీయ ప్రచారంలో ఫుల్‌ బిజీగా ఉంటున్నారు నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan). తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరుస పర్యటనల్లో ఉన్న ఆయన తాజాగా ఓ స్పెషల్‌ వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఓ అనుకోని అతిథి తనని కలిసిందని ఆయన తెలిపారు. ‘‘బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో బోర్డింగ్‌ కోసం ఎదురుచూస్తున్నప్పుడు డాగ్‌ స్క్వాడ్‌కు చెందిన బిందు అనే జాగిలం అనుకోని అతిథిగా నా వద్దకు వచ్చింది. దాని స్నేహపూర్వక ప్రవర్తన నా మనసుకు ఆనందాన్ని ఇచ్చింది. టేకాఫ్‌కు ముందు ఊహించని విధంగా ఓ అందమైన అనుభూతిని ఇచ్చింది’’ అని పవన్‌కల్యాణ్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

రివ్యూ: పులిమడ.. మలయాళం థ్రిల్లర్‌ ఎలా ఉంది?

సామాజిక మాధ్యమాలను చాలా అరుదుగా ఉపయోగించే పవన్‌కల్యాణ్‌ ఈ ఏడాది జులై నెలలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచారు. 2.8 మిలియన్ల మంది ఆయనని ఫాలో అవుతుండగా.. ఆయన మాత్రం ఎవరినీ అనుసరించడం లేదు. ఇక, ఇప్పటివరకూ ఆయన కేవలం ఏడు పోస్టులు మాత్రమే చేశారు. తాజాగా ఆయన షేర్‌ చేసిన జాగిలం వీడియోను 6 లక్షల మందికి పైగా లైక్‌ కొట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని