Prabhas: ఆమె బిగ్గెస్ట్‌ సూపర్‌స్టార్‌.. ఎప్పటికీ అభిమానిస్తా: ప్రభాస్‌

‘ఆమె బిగ్గెస్ట్‌ సూపర్‌స్టార్‌. ఎప్పటికీ అభిమానిస్తా’ అని అన్నారు ప్రముఖ హీరో ప్రభాస్‌. ఆయన చెప్పిన ఆ హీరోయిన్‌ ఎవరంటే?

Published : 03 Aug 2023 01:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తన సహ నటి దీపికా పదుకొణె(Deepika Padukone) బిగ్గెస్ట్‌ సూపర్‌స్టార్‌ అని ప్రముఖ హీరో ప్రభాస్‌ (Prabhas) కొనియాడారు. ఆమె అంటే ఎప్పటికీ తనకు అభిమానమేనన్నారు. ఈ ఇద్దరు కలిసి ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర విశేషాలు పంచుకునేందుకు ప్రభాస్‌ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోనే.. దీపికపై ప్రశ్న ఎదురవగా మనసులో మాట బయటపెట్టారు. ‘‘దీపికా పదుకొణె చాలా అందంగా ఉంటుంది. అద్భుతమైన నటి. ఇప్పటికే ఆమె ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌ అయింది. ఆమె ‘కల్కి’ సెట్స్‌లోకి అడుగుపెట్టిన ప్రతిసారి అందరిలోనూ ఉత్సాహం వస్తుంది. ఆమెతో కలిసి నటించాలని ఎప్పటి నుంచో అనుకునేవాణ్ని. ఇప్పుడు కుదిరింది’’ అని తెలిపారు.

రూ.252 కోట్ల అప్పు.. నితిన్‌ మరణానికి కారణమదేనా..?

సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అగ్ర నటులు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), కమల్‌హాసన్‌ (Kamal Haasan) కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మాత అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ప్రాజెక్ట్‌ కె’ (Project K) పేరుతో పట్టాలెక్కిన ఈ సినిమా టైటిల్‌ని అమెరికాలో ఇటీవల జరిగిన ‘శాండియాగో కామిక్‌ కాన్‌’ వేడుకలో ప్రకటించారు. అదే వేదికపై విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఆ ఈవెంట్‌లో ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించుకున్న తొలి భారతీయ చిత్రమిదే. మరోవైపు, ఈ సినిమాకి సీక్వెల్‌ ఉంటుందంటూ ప్రచారం జరగ్గా దానిపై దర్శకుడు స్పందించారు. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేదన్నారు. సినిమా కోసం క్రియేట్‌ చేసిన పాత్రలు, ప్రాంతాలు, వాహనాలతో యానిమేటెడ్‌ వెర్షన్‌ చేయొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనే ఉద్దేశంతోనే ‘కల్కి’ని ప్రారంభించానని తెలిపారు. ఈ చిత్రాన్ని 2024 జనవరి 12న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు గానీ టీజర్‌లో దాన్ని మెన్షన్‌ చేయలేదు. దాంతో, ఈ సినిమా ఎప్పుడొస్తుందోనన్న సందేహం నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని