KrishnamRaju: 70 వేల మందికి భోజన ఏర్పాట్లు చేయనున్న ప్రభాస్‌

నటుడు, మాజీ కేంద్రమంత్రి యూవీ కృష్ణంరాజు(Krishnam Raju) స్మారకసభ ఈ నెలాఖరున ఆయన స్వగ్రామమైన మొగల్తూరులో జరుగుతుందని సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. భారీ ఎత్తున నిర్వహించనున్న...

Updated : 21 Sep 2022 16:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు (Krishnam Raju) స్మారక సభ ఈ నెలాఖరున ఆయన స్వగ్రామమైన మొగల్తూరులో జరుగుతుందని సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. భారీ ఎత్తున నిర్వహించనున్న ఈ సభకు ఆయన కుటుంబ సభ్యులంతా హాజరుకానున్నారట. ప్రముఖ కథానాయకుడు ప్రభాస్ (‌Prabhas) ఈ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించనున్నారని సమాచారం. దానికి గాను ఆయన ఈ నెల 29న మొగల్తూరు చేరుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఈ సభకు మొగల్తూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సుమారు 70 వేల మందికి ప్రభాస్‌ భోజన ఏర్పాట్లు చేయించనున్నారట. ప్రజలతో పాటు, కొందరు సినీ ప్రముఖులూ ఈ సభకు హాజరవుతారని సమాచారం. 

కొద్ది రోజుల క్రితం కృష్ణంరాజు అనారోగ్య సమస్యతో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లో ఆయన సంస్మరణ సభను నిర్వహించారు. అయితే కృష్ణంరాజు సొంతూరు మొగల్తూరులోనూ ఈ నెలాఖరున ఆయన స్మారక సభను నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. గతంలో ప్రభాస్ తండ్రి, నిర్మాత యూవీవీ సత్యనారాయణరాజు సంస్మరణ సభను మొగల్తూరులోనే జరిగింది. ఆ కార్యక్రమం అనంతరం దాదాపు పన్నెండేళ్ల తర్వాత ప్రభాస్‌ సొంతూరుకి వెళ్తున్నారని సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని