Naatu Naatu: గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిందని తెలియగానే గంటన్నర పాటు ఏడ్చా: ప్రేమ్ రక్షిత్
Naatu Naatu song: నాటు నాటు సాంగ్కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సందర్భంగా కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ పంచుకున్న విశేషాలు..
ఇంటర్నెట్డెస్క్: ఎన్టీఆర్ (NTR), రామ్చరణ్ (Ramcharan) కథానాయకులుగా రాజమౌళి (Rajmouli) తెరకెక్కించిన బ్లాక్బస్టర్ చిత్రం ‘RRR’ గోల్డెన్గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా యువతను ఓ ఊపు ఊపేసిన ‘నాటు నాటు’ పాటకుగానూ ఈ అవార్డు దక్కింది. ఈ పాటకు అవార్డు వచ్చిందని తెలియగానే తన మైండ్ బ్లాంక్ అయిపోయిందని, కన్నీళ్లు ఆగలేదని డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ భావోద్వేగానికి గురయ్యారు.
ఈ సందర్భంగా ఓ ఆంగ్లమీడియాతో తను అనుభావాన్ని పంచుకున్నారు. ‘‘నాటు నాటు’కు అవార్డు వచ్చిందని చెప్పగానే నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కన్నీళ్లు ఆపుకోలేకపోయా. వాష్రూమ్లోకి వెళ్లి గంటసేపు ఏడ్చా. ఎందుకంటే అది దాదాపు అసాధ్యమనేది నా భావన. కానీ, జరిగింది. పనిపట్ల రాజమౌళి సర్కు ఉన్న నిబద్ధతే అందుకు కారణం. ఆ తర్వాత నా ఆనందానికి అవధుల్లేవు. ఇదంతా ఇద్దరు హీరోల వల్ల జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య, చరణ్ సర్ ఇద్దరూ అద్భుతమైన డ్యాన్సర్లు. కీరవాణిగారి సంగీతం ఈ పాటకు మరింత బలాన్ని ఇచ్చింది. ‘నాటు నాటు’ పాట ఎలా ఉండాలి? ఆ పాట థీమ్ ఎలా ఉంటుంది? కాన్సెప్ట్ ఇతర విషయాలను రాజమౌళి సర్ చెప్పారు’’ అని ప్రేమ్ రక్షిత్ తెలిపారు.
ఈ పాట కోసం కథానాయకులతో పాటు, ఇతర ఆర్టిస్టులు కూడా 20 రోజుల పాటు సాధన చేశారు. నాటు నాటు స్టెప్ కోసం ప్రేమ్ రెండు నెలల పాటు వివిధ డ్యాన్స్ కంపోజిషన్స్ చేశారు. ‘‘పాట షూటింగ్కు వెళ్లిన తర్వాత నటులెవరూ ఒక్కసారి కూడా విరామం తీసుకోలేదు. ఎందుకంటే ఇది హై ఎనర్జీ సాంగ్. ఆ టెంపో మళ్లీ రాదని వాళ్ల ఉద్దేశం. చరణ్ సర్, తారక్ అన్నయ్య ఇద్దరూ ఎంతో నిబద్ధతతో డ్యాన్స్ చేశారు. నేను చెప్పింది చెప్పినట్లు చేసుకుంటూ వెళ్లిపోయేవారు. పేకప్ చెప్పగానే రాజమౌళి సర్ కూడా మాతో కలిసి రిహార్సల్లో పాల్గొనేవారు. పాట షూట్ జరిగిననన్ని రోజు మేమంతా ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకూ నిరంతరం పనిచేసేవాళ్లం’’
‘‘తారక్,రామ్చరణ్ల విషయానికి వస్తే, ఒకరు సింహం, మరొకరు చిరుత. కొరియోగ్రాఫర్ ఏం చేస్తున్నాడనే దానిపైనే వారి దృష్టి అంతా ఉండేది. అలాంటి వాళ్ల కోసం సాంగ్ చేస్తుండటంతో వాళ్లను దృష్టిలో పెట్టుకుని 118 డిఫరెంట్ స్టెప్స్ డిజైన్ చేశాం. ‘నాటు నాటు’ చెప్పగానే ఇద్దరూ ఒకే సింక్లో చేసుసుకుంటూ వెళ్లిపోయేవారు. అదెలా సాధ్యమయ్యేది నాకు అర్థం కాదు. మేము సున్నా నుంచి మొదలు పెడితే, దానికి వాళ్లు మెరుగులు, మెరుపులు జోడించేవారు. అవార్డు రావడం పట్ల సగటు భారతీయుడిగా నేను గర్విస్తున్నా. భారతదేశంలో మనచుట్టూనే అనేక అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ వచ్చింది. ఇంకా గొప్ప అవార్డులు భారతీయ సినిమాలకు వస్తాయి’’ అని ప్రేమ్ రక్షిత్ చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!