ఆ దేశాల్లో ఉన్న సంతోషం మరెక్కడా లేదట
యూరప్లోని 10 దేశాల్లో ఉన్న ఆనందం మరెక్కడా లేదని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. సంతోషం ఎలా ఉంటుందో చూడాలంటే ఆ దేశాలకు వెళ్లి రావాలని ఆయన సూచించారు. తాజాగా ఆయన....
ఆనందాన్ని చూడాలంటే అక్కడికి వెళ్లాల్సిందే
హైదరాబాద్: యూరప్లోని 10 దేశాల్లో ఉన్న ఆనందం మరెక్కడా లేదని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అన్నారు. సంతోషం ఎలా ఉంటుందో చూడాలంటే ఆ దేశాలకు వెళ్లి రావాలని ఆయన సూచించారు. తాజాగా ఆయన ‘టాప్ 10 హ్యాపీయెస్ట్ కంట్రీస్’ గురించి ‘పూరీ మ్యూజింగ్స్’ వేదికగా వివరించారు. ఇంతకీ ఆ దేశాలేమిటి, అక్కడ ప్రజలు సంతోషంగా ఉండడానికి కారణమేమిటి?.. ఇలాంటి అంశాల గురించి పూరీ ఏమన్నారంటే..
‘ఒక మనిషి సంతోషంగా ఉన్నాడా లేదా? అనేది సరిగ్గా చెప్పలేం. ఎందుకంటే సంతోషాన్ని కొలవడం చాలా కష్టం. ఒక దేశంలో ఉన్న ప్రజలందరూ ఆనందంగా ఉన్నారా? లేదా? అని చెప్పడం ఇంకెంతో కష్టం. అయితే, దేశ జనాభా ఆనందాన్ని కొలవడం కోసం ఓ రీసెర్చ్ ఉంది. ఆరు అంశాల గురించి సమాచారాన్ని సేకరిస్తారు. ఆ దేశ జీడీపీ, ప్రజల జీవితకాలం, సామాజిక మద్దతు, అవినీతి, స్వేచ్ఛ, ఔదార్యం.. ఈ డేటాలను దృష్టిలో పెట్టుకుని యూఎన్వో వాళ్లు సంతోషకరమైన దేశాల జాబితాని తయారు చేస్తారు’
‘కొవిడ్ తర్వాత ఈ సంవత్సరం టాప్ 10 సంతోషకరమైన దేశాలేమిటంటే.. 10.ఆస్ట్రియా: ఇక్కడ ప్రజల జీవితకాల పరిమితి, జీడీపీ బాగుంది. ఈ దేశంలో అందరూ బైకింగ్ చేస్తారు. బైక్పై ఎక్కడికి వెళ్దామా? అనే టెన్షన్ తప్ప వీళ్లకి మరే ఇతర కష్టాలు లేవట. 9.న్యూజిలాండ్: ఎంతో శాంతివంతమైన దేశం. బీచ్లు, పర్వతాలు, కివీ పక్షులు, మనుషులకంటే ఎక్కువగా గొర్రెలు.. దాంతో ఇక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. 8.లక్సంబర్గ్: ఈ దేశంలో జనాభా చాలా తక్కువ. ఇక్కడ అందరికీ ఎక్కువ మొత్తంలో జీతాలు ఉంటాయి. సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఎంతో బాగుంటుంది. ఉద్యోగ విరమణ అనంతరం సైతం ఇక్కడ దర్జాగా బతకవచ్చు. హెల్త్ కేర్ కూడా సూపర్గా ఉంటుంది. 7.స్వీడన్: జీడీపీ అత్యధికంగా ఉంది. సాంఘిక సమానత్వం ఉంది. ఉచిత విద్య అందిస్తారు. మహిళలకు ఎక్కువ గౌరవం ఇస్తారు. కావాలంటే 16 నెలలపాటు పెయిడ్ ఫ్యామిలీ లీవ్ కూడా తీసుకోని దేశాలన్ని తిరిగి రావచ్చు. 6. నార్వే..అద్భుతమైన ప్రజా సంక్షేమ వ్యవస్థ, సామాజిక మద్దతు, ప్రభుత్వంపై నమ్మకం.. ఈ అంశాలన్ని కలిసి అక్కడి ప్రజల్ని సంతోషంగా ఉండేలా చేశాయి. 5.నెదర్లాండ్స్.. ఈ దేశంలో సంరక్షణ ఉంది. హెల్త్కేర్ బాగుంది. విద్యావ్యవస్థ పటిష్టంగా ఉంది. ఆరోజు, ఈరోజు అని కాదు డచ్ ప్రజలు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారని చెబుతారు. 4.ఐస్లాండ్: ఈ దేశంలోని ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్లకి టెన్షన్ కలిగించే ఒకే ఒక్క విషయం.. డిన్నర్ కోసం రెస్టారెంట్లో సీట్ రిజర్వ్ చేయడం. అదొక్కటే ఇక్కడ కష్టమైపోతుందట. వెంటనే రిజర్వేషన్ దొరకడం లేదట. ఇంతకు మించి పెద్ద కష్టాలంటూ ఇక్కడ లేవు. 3.స్విట్జర్లాండ్: ఇక్కడ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉంది. దేశంలోని ప్రతి పౌరుడి మాటకు విలువ ఇస్తారు. ప్రతిఒక్కరి ప్రైవసీని గౌరవిస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంటి ముందు ట్రాఫిక్ సిగ్నల్ పెట్టాలంటే ప్రభుత్వం ముందు అతని నుంచి పర్మిషన్ తీసుకోవాలి. చక్కని వాతావరణం, ఆవులతో స్విట్జర్లాండ్ పచ్చగా ఉంది. 2.డెన్మార్క్: ఇది బైక్ ఫ్రెండ్లీ దేశం. ఇక్కడ పర్వతాలు ఉండవు. ఏదో ఒకటి అన్వేషిస్తూ చక్కగా బైక్పై తిరగవచ్చు. ఈ దేశంలో 70 శాతం మంది ప్రజలు సైకిళ్లపైనే తిరుగుతారు. 1.ఫిన్లాండ్.. నాలుగు సంవత్సరాల నుంచి ఈ దేశమే సంతోషకరమైన దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. వీళ్లు మాట్లాడే భాషని ఫినీస్ అంటారు. ప్రపంచంలోనే మంచి విద్యావ్యవస్థ కలిగిన దేశంగా ఫిన్లాండ్కు పేరు ఉంది. ఇక్కడ టీచర్ కావాలంటే మాస్టర్ డిగ్రీ చేయాలి. టీచర్ అయితే మాత్రం జీతం మామూలుగా ఉండదు. ఏదైతేనే ప్రపంచంలో ఉన్న ఆనందకరమైన దేశాలివే. ఒకవేళ మీరు కనుక పరిశీలిస్తే.. ఈ దేశాలన్నింటిలోనూ జనాభా చాలా తక్కువగా ఉంది. అందుకే అక్కడ సంతోషం ఉంది. అలాగే ఈ దేశాలన్ని యూరప్లోనే ఉన్నాయి. కాబట్టి సంతోషం ఎలా ఉంటుందో చూడాలంటే మీరు యూరప్ వెళ్లాల్సిందే’’ అని పూరీ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?