Samantha Vijay: సామ్‌-విజయ్‌ డిన్నర్‌ పార్టీ.. నిర్మాణ సంస్థ ఏమందంటే..?

గత కొన్నిరోజుల నుంచి కశ్మీర్‌ అందాలు, అక్కడి జీవన శైలిని ఆస్వాదిస్తున్నారు నటీనటులు సమంత, విజయ్‌ దేవరకొండ. వీరిద్దరూ కలిసి నటిస్తోన్న ఫీల్‌గుడ్‌ ప్రేమ కథా చిత్రం ‘ఖుషి’. ‘నిన్ను కోరి’...

Published : 23 May 2022 13:27 IST

హైదరాబాద్‌: గత కొన్నిరోజుల నుంచి కశ్మీర్‌ అందాలు, అక్కడి జీవన శైలిని ఆస్వాదిస్తున్నారు నటీనటులు సమంత, విజయ్‌ దేవరకొండ. వీరిద్దరూ కలిసి నటిస్తోన్న ఫీల్‌గుడ్‌ ప్రేమ కథా చిత్రం ‘ఖుషి’. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చిత్రాల ఫేమ్‌ శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ దీనిని నిర్మిస్తోంది. కశ్మీర్‌లోని పరిసర ప్రాంతాల్లో ప్రారంభమైన ‘ఖుషి’ షూట్‌ తొలి షెడ్యూల్‌ నిన్నటితో పూర్తైంది. దీంతో విజయ్‌, సామ్‌, శివతోపాటు ఇతర చిత్రబృందం కశ్మీర్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్రనిర్మాణ సంస్థ మైత్రి ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసింది. విరామం తీసుకోకుండా గత కొన్నిరోజుల నుంచి చేస్తోన్న ‘ఖుషి’ ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తైంది. త్వరలోనే రెండో షెడ్యూల్‌ ప్రారంభిస్తాం అని తెలిపింది. శివతో దిగిన ఓ ఫొటోని షేర్‌ చేసిన సామ్‌.. ‘‘మజిలీ’ నుంచి ‘ఖుషి’ వరకూ మా ప్రయాణం. అదరగొట్టేశారు శివ’’ అని రాసుకొచ్చారు. ఈ ఏడాది క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 23న ఈ సినిమా విడుదల కానుంది.

టార్గెట్‌ వంద కేజీలు..!

షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ సమంత మాత్రం ఫిట్‌నెస్‌ విషయంలో వెనకడుగు వేయడం లేదు. తన పర్సనల్‌ ట్రైనర్‌తో కలిసి వర్కౌట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో షేర్‌ చేస్తున్నారు. తాజాగా ఆమె 100 కేజీల బరువుని లిఫ్ట్‌ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ‘‘100 కేజీలూ.. నేను వస్తున్నా.!! ఈరోజు 90 కేజీలు లిఫ్ట్‌ చేయగలిగాను. మరో 10 కేజీలు మాత్రమే మిగిలి ఉంది’’ అని సామ్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని