Santosh Sobhan: అమ్మకు ఓ పెద్ద ఇల్లు కొనివ్వాలి!
‘‘కుటుంబంతో కలిసి చూసి హాయిగా నవ్వుకునే ఫ్యామ్ కామ్ సినిమా ‘అన్నీ మంచి శకునములే’. ఈ చిత్రంతో నందిని రెడ్డి నవ్విస్తూ ఏడిపిస్తారు. ఇందులోని నిజమైన బలం డ్రామా, ఎమోషన్సే. చాలా కొత్తగా అనిపించే సన్నివేశాలున్నాయి’’ అన్నారు సంతోష్ శోభన్. ఆయన హీరోగా నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’.
‘‘కుటుంబంతో కలిసి చూసి హాయిగా నవ్వుకునే ఫ్యామ్ కామ్ సినిమా ‘అన్నీ మంచి శకునములే’. ఈ చిత్రంతో నందిని రెడ్డి నవ్విస్తూ ఏడిపిస్తారు. ఇందులోని నిజమైన బలం డ్రామా, ఎమోషన్సే. చాలా కొత్తగా అనిపించే సన్నివేశాలున్నాయి’’ అన్నారు సంతోష్ శోభన్(Santosh Sobhan). ఆయన హీరోగా నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’(Anni Manchi Sakunamule) ప్రియాంక దత్ నిర్మాత. మాళవిక నాయర్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సంతోష్ శోభన్.
ఈ మంచి శకునం మీకెలా ఎదురైంది?
‘‘నేను హీరో అయ్యాక తొలి అడ్వాన్స్ చెక్ అందుకుంది వైజయంతి మూవీస్ నుంచే. ఆ చెక్ నాకెంతో ఇష్టమైన ప్రియాంక దత్ ఇచ్చారు. అయితే ‘పేపర్బాయ్’ తర్వాత నాకు కాస్త గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ‘ఏక్ మినీ కథ’.. మరికొన్ని సినిమాలు చేశా. ఇన్నాళ్ల తర్వాత సరైన సమయంలో సరైన కథ కుదరడంతో ‘అన్నీ మంచి శకునములే’ ప్రారంభమైంది. ఈ చిత్ర విషయంలో నన్ను బాగా ఆకర్షించింది నందిని రెడ్డితో పని చేయడమే. తన తొలి చిత్రం ‘అలా మొదలైంది’ నాకు చాలా ఇష్టం. ఆ సినిమా చూశాక చాలా ఏళ్ల తర్వాత ‘ఖుషి’, ‘తొలిప్రేమ’ లాంటి చిత్రం చూశాననిపించింది. అప్పటి నుంచే నేను నందినితో పని చేయాలనుకున్నా. అనుకోకుండా అది ఇప్పటికి కుదిరింది. ఈ చిత్రంలో చాలా మ్యాజిక్ జరిగింది. నిజంగా నాకు అవకాశం రావడం అదృష్టమే.
ఈ చిత్ర కథేంటి? ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
‘‘నా కెరీర్లోనే బిగ్గెస్ట్ కథ ఇది. తప్పకుండా వెండితెరపై చూడాల్సిన సినిమా. ఈ ఫీలింగ్ సినిమా చేసేటప్పుడే అనిపించింది. ఈ చిత్ర టైటిల్ వినగానే చాలా నిజాయితీగా తీసే సినిమా అనిపించింది. ఈ మధ్యే సినిమాని ఎలాంటి నేపథ్య సంగీతం లేకుండా చూశాను. బయటకు వచ్చాక చాలా తేలిగ్గా.. ఎంతో హాయిగా.. లోలోపల కాస్త భావోద్వేగభరితంగా అనిపించింది. అదే శుభ శకునం నాకు. నా జీవితంలో ఇలాంటి కథ కానీ, ఇంత మంది నటీనటులతో కలిసి నటించే అవకాశం గానీ మళ్లీ రాదేమో అనిపిస్తోంది. ఈ చిత్రంలో నేను రుషి అనే పాత్రలో కనిపిస్తాను. ‘ఏక్ మినీ కథ’ దగ్గర్నుంచి ఇప్పటి వరకు బరువు మోసే పాత్రలే చేశాను. కానీ, ఇందులో నవ్వుతూ.. నవ్విస్తుండే పాత్ర పోషించా. సినిమా చూశాక నేను ఇలా చేయగలనా అని అనిపిస్తుంది చాలా మందికి. ఈ పాత్ర కోసం నన్ను ఆడిషన్ చేసి మరీ తీసుకున్నారు’’.
నటుడిగా ఇన్ని సినిమాలు చేశాక కూడా ఆడిషన్ అవసరమా అనిపించలేదా?
‘‘అలా నేనెప్పుడూ అనుకోను. అయినా ఆడిషన్ ఇస్తే తప్పేముంది. నన్ను ఎవరు స్క్రీన్ టెస్ట్కు పిలిచినా కచ్చితంగా వెళ్లి చేసి చూపిస్తా. నాది నాటకాల నుంచి వచ్చిన బ్యాచ్. చాలా మంది ‘నేను ఇన్ని ఆఫీసుల చుట్టూ తిరిగాను.. అన్ని ఆడిషన్లు ఇచ్చాను’ అంటూ వాటినేదో కష్టాల్లా చెబుతుంటారు. నిజానికి వాటిని కష్టాల్లా చూడొద్దు. మనం ఏమిటో తెలియని వారికి నిరూపించుకునేందుకు అదొక మంచి అవకాశం. దాన్ని తప్పుగా చూడొద్దు. ఆడిషన్ ద్వారా నాకు ఈ చిత్రంలో అవకాశం దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది’’.
కొత్త చిత్ర విశేషాలేంటి?
‘‘ఈ మధ్య కాలంలో నా నుంచి వరుసగా సినిమాలొచ్చాయి. అందుకే ఇకపై నిధానంగా ఆచితూచి ముందుకెళ్లాలి అనుకుంటున్నా. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్లో ఓ సినిమా చేస్తున్నా. ఆ తర్వాత మరో కొత్త బ్యానర్లో పని చేయనున్నా. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తా’’.
ఈ చిత్ర విషయంలో మీకు మర్చిపోలేని జ్ఞాపకాలేంటి?
‘‘1950 నాటి షావుకారు జానకి గారి నుంచి ఈతరంలో ఉన్న అద్భుతమైన నటీనటుల వరకు అందరితో కలిసి పని చేసే అవకాశం దొరికింది. ముఖ్యంగా సినిమాలో నేను, జానకి గారు డార్లింగ్ అని పిలుచుకుంటాం. అది మర్చిపోలేని అనుభూతి. ఇలాంటి పాత్ర చేసే అవకాశం ఈతరంలో నాకే వచ్చింది అనుకుంటున్నా. తను చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సీనియర్గా ఆమె నటనానుభవాల్ని నాతో పంచుకునేవారు. అలాగే నాకు రాజేంద్ర ప్రసాద్కు చాలా స్క్రీన్ స్పేస్ ఉంది. ఆయన నుంచి ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నా. ‘ఏప్రిల్ 1 విడుదల’లోని ఆయన కామెడీ టైమింగ్ను నేను కాపీ కొట్టి నేర్చుకున్నా’’.
మాతృ దినోత్సవం సందర్భంగా మీ అమ్మ గురించి ఏం చెబుతారు? ఆమెకు మీరు ఇవ్వాలనుకునే బహుమతి ఏంటి?
‘‘మొన్న ఓ టీవీ షోలో కూడా అమ్మ గురించి అడిగారు. నాకు మాటలు రాలేదు. నా సర్వస్వం తనే. నటుడిగా సినిమాలు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కెరీర్ ఆరంభం నుంచి నేను దాటొచ్చిన ఎత్తుపల్లాలన్నింటినీ తను స్వయంగా చూసింది. కఠిన సమయాల్లో నాకెంతో అండగా నిలిచింది. ధైర్యాన్నిచ్చింది. ఇప్పుడు పెద్ద సంస్థల్లో అవకాశాలు రావడంతో చెప్పలేని ఆనందం. అమ్మ నన్ను నమ్మింది కాబట్టే ఇన్ని చిత్రాలు చేయగలుగుతున్నా. మాకు మొదటి నుంచి సొంత ఇల్లు లేదు. ఎప్పటికైనా అమ్మకు ఓ పెద్ద ఇల్లు కొనివ్వాలని ఉంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
‘పంచాయత్ సీజన్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
‘పంచాయత్ సీజన్ 3’ వెబ్సిరీస్ విడుదల తేదీ ఖరారైంది. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందంటే? -
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్సిరీస్ ఎలా ఉంది?
భారీ తారాగణంతో సంజయ్లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన వెబ్సిరీస్ మెప్పించిందా? -
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. -
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈసారి ‘సిద్ధి’గా
చిట్టిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్రవేసుకుంది నటి ఫరియా అబ్దుల్లా. అమాయకమైన చూపులతోనూ నటనతోనూ ఆకట్టుకుంటున్న ఈ హైదరాబాదీ అమ్మాయి ‘ఆ ఒక్కటీ అడక్కు’లోని సిద్ధి పాత్రతో నవ్వులు పంచేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
తలదించితే బానిసవి.. ఎత్తినావా నువ్వే బాదుషావి
‘‘తలదించినావా బానిసవి.. ఎత్తినావా బాదుషావి.. తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా’’ అంటూ తను నమ్మిన జీవిత సూత్రాన్ని అందరికీ బోధిస్తున్నాడు పుష్పరాజ్. -
అక్టోబరులో మొదలు!
‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. -
రజనీ బయోపిక్ రానుందా?
సినిమాల్లో తమ అభిమాన హీరోలు చేసే యాక్షన్ హంగామాను చూస్తూ మురిసిపోతుంటారు ప్రేక్షకులు. -
కృష్ణమ్మ.. అందరూ మాట్లాడుకునే చిత్రమవుతుంది
‘‘సత్యదేవ్ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్డమ్ వస్తుంది. -
మనం నవ్వుతుంటే ప్రేక్షకులు భయపడాలి!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఆ మార్పు నాలో విశ్వాసాన్ని నింపింది
‘ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పు నాలో విశ్వాసాన్ని పెంచుతుంది’ అని అంటోంది బాలీవుడ్ నాయిక తాప్సీ. -
సందేశమిచ్చే గాంధీ తాత చెట్టు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం కానుంది. -
ఇందులో అన్నీ ఉంటాయి
‘‘ప్రేక్షకులకు చాలా తృప్తినిచ్చే సినిమా ‘ప్రసన్న వదనం’. దీన్ని సీటు అంచున కూర్చొని ఆస్వాదిస్తారు. అదిరిపోయిందని చప్పట్లు కొడతారు’’ అన్నారు సుహాస్. -
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి