SidSriram: మోస్ట్ వాంటెడ్ సింగర్
సంగీతానికి భాష అవసరం లేదు భావం ఉంటే సరిపోతుంది అనే మాటకు సిద్ శ్రీరామ్ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాడు.
సంగీతానికి భాష అవసరం లేదు భావం ఉంటే సరిపోతుంది అనే మాటకు సిధ్ శ్రీరామ్ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాడు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీ సాహిత్యాన్ని అలరించేలా ఆలపించి ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ మోస్ట్ వాంటెడ్ సింగర్గా మారాడు. గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగానూ ప్రతిభ చాటిన సిధ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు...
సిధ్ శ్రీరామ్ అసలు పేరు సిద్ధార్థ్ శ్రీరామ్. శ్రీరామ్, లత దంపతులకు 1990 మే 19న జన్మించారు. సిధ్ తండ్రి వ్యాపారి. తల్లి మ్యూజిక్ టీచర్. సోదరి పల్లవి శ్రీరామ్ భరతనాట్యం కళాకారిణి. సిధ్ కుటుంబం 1991లో చెన్నై నుంచి కాలిఫోర్నియాకి వెళ్లింది. అక్కడే సిధ్ తల్లి కర్ణాటక సంగీతానికి సంబంధించి ఓ ఇన్స్టిట్యూట్ నెలకొల్పారు. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచే శ్రీరామ్కు పాటలపై ఇష్టం ఏర్పడింది. తన మూడో యేటనే వేదికపై పాట ఆలపించి ఆశ్చర్యంలో పడేశాడు. బెర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ నుంచి మ్యూజిక్ ప్రొడక్షన్ అండ్ ఇంజినీరింగ్లో పట్టా పొందాడు. తనకు ఊహ తెలిశాక సంగీతాన్ని సీరియస్గా తీసుకుని ఆల్బమ్స్ రూపొందించి వాటిని యూ ట్యూబ్లో అప్లోడ్ చేసేవాడు. అవి అభిమానగణం సంపాదించడంతోపాటు సంగీత దర్శకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఉన్నారు.
సినిమా అవకాశం..
ఏఆర్ రెహమాన్ కడల్ (తమిళం) చిత్రంతో సిధ్ని సినీ ప్రపంచానికి పరిచయం చేశారు. చెన్నైలో రెహమాన్కి ఓ స్టూడియో ఉంది. అక్కడే 2011లో తొలిసారి రెహమాన్ని కలిశారు సిధ్. ఇద్దరి మధ్య సంగీత చర్చలు జరిగాయి. దాదాపు రెండు నెలల తర్వాత కడల్లో ఓ పాట పాడాలంటూ రెహమాన్ నుంచి ఫోన్ వచ్చింది. ఎన్నో ఏళ్ల కల నిజమవుతుందని భావించిన సిధ్కి ఓ చిక్కొచ్చింది. రెహమాన్ ఫోన్ చేసిన సమయంలో సిధ్ బోస్టన్లో ఉన్నారు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న సిధ్కి రెహమాన్ ఓ ఐడియా ఇచ్చారు. టెక్నాలజీని (రిమోట్ సిస్టం) ఉపయోగించి ఆ పాటను రికార్డు చేశారు. 4 గంటల్లో పాటని పూర్తి చేశారు. అదే ‘ఆడియే’ గీతం. తెలుగులో ‘యాడికే’ అంటూ సాగుతుంది.
రెహమాన్తో మళ్లీ మళ్లీ..
సిధ్ తొలి పాట తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. రెహమాన్ సంగీత దర్శకత్వంలోనే సిధ్ రెండో పాటని ఆలపించారు.‘ఐ’ చిత్రంలోని ‘నువ్వుంటే నా జతగా’ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. కొత్త స్వరాన్ని పరిచయం చేశారంటూ రెహమాన్ని ప్రశంసించారంతా. రెహమాన్ స్వరపరిచిన 24, సచిన్, అదిరింది, 2.ఓ, సర్కార్, సాహసం శ్వాసగా సాగిపో, 99 సాంగ్స్ చిత్రాల్లోనూ తన గళం వినిపించారు సిధ్.
బ్రేక్ ఇచ్చిన గీతగోవిందం
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా తెరకెక్కిన గీతగోవిందంలోని ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ పాట పాట సిధ్ కెరీర్ని మలుపుతిప్పింది. చిన్నపెద్దా తేడా లేకుండా తెలుగు ప్రేక్షకులంతా ఆ గానానికి మంత్ర ముగ్ధులయ్యారు. అప్పటి నుంచి అతను ఏ పాట పాడినా అది పెద్ద హిట్ అందుకుంటూనే ఉంది. అందుకే చిన్న సినిమాల్లో సిధ్ పాట ఉండేలా చూసుకుంటున్నారు దర్శక-నిర్మాతలు. అతని పాట వల్ల సినిమాకే క్రేజ్ వస్తుంది మరి! హుషారులోని ‘ఉండిపోరాదె’, ట్యాక్సీవాలాలోని ‘మాటే వినదుగా’, పడిపడిలేచె మనసులోని ‘ఏమై పోయావే’, డియర్ కామ్రేడ్లోని ‘కడలల్లే వేచె కనులె’, ఫలక్నుమా దాస్లోని ‘అరెరె మనసా’, అల వైకుంఠపురములో ‘సామజవరగమన’, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం’, శశిలోని ‘ఒకే ఒక లోకం నువ్వే’, వకీల్సాబ్లోని ‘మగువా మగువా’ సిధ్కి మంచి గుర్తింపు తెచ్చాయి.
జానపదంతోనూ..
హృద్యంగా పాటలు పాడే సిధ్ జానపదాన్ని సైతం ఆలపించి ఔరా అనిపించాడు. నల్లమల చిత్రం కోసం తొలిసారి ఈ ప్రయోగం చేశాడు. ఏమున్నవే పిల్లా అంటూ సాగే ఈ ఫోక్ సాంగ్ కొత్త సిద్ని పరిచయం చేసింది.
సంగీత దర్శకుడిగా..
ఎన్నో మధురగీతాల్ని ఆలపించిన సిధ్ ‘వానమ్ కొట్టాట్టమ్’ అనే తమిళ చిత్రంతో సంగీత దర్శకుడిగా మారాడు. శరత్ కుమార్, రాధిక, విక్రమ్ ప్రభు, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో ధన శేఖరన్ తెరకెక్కించిన చిత్రమిది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మించారు.
ఫేవరెట్ అంటే నచ్చదు..
మీకు ఇష్టమైన గాయకుడు, సంగీత దర్శకుడు అని సిధ్ని ఎవరైనా ప్రశ్నిస్తే.. నాకు ఫేవరెట్ అనే పదం నచ్చదు. గొప్ప పనిచేస్తోన్న ప్రతి ఒక్కరు తమ ప్రత్యేకతని చాటుకుంటుంటారనేది నా అభిప్రాయం అని సమాధానం ఇస్తుంటాడు.
ఓ గంట ప్రాక్టీస్..
ఎప్పటికప్పుడు స్వరాన్ని కొత్తగా వినిపించేందుకు తగిన కసరత్తు చేయాల్సిందే అంటాడు సిధ్. ఇప్పటికీ రోజూ కనీసం గంటసేపు కర్ణాటక సంగీతం అభ్యాసం చేస్తాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఓటీటీలోకి ‘డియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జి.వి.ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్’. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!