Dubbing Janaki: ముందు తిన్నానని.. క్యారేజ్ను కాలుతో తన్నింది: డబ్బింగ్ జానకి
సీనియర్ నటి డబ్బింగ్ జానకి (Dubbing Janaki) ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. ఆమె సినీ ప్రయాణం గురించి పంచుకున్నారు.
డబ్బింగ్ జానకి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. దక్షిణాదిలో సుమారు 600 చిత్రాలకు పైగా నటించి ప్రేక్షకులను అలరించారు. తొమ్మిదేళ్ల వయసులోనే నాటకాలతో మెప్పించారు. 1958లో విడుదలైన ‘భూ కైలాస్’తో తెరంగేట్రం చేశారు. తెలుగులో ‘గాంధీ’ సినిమాకు కస్తూరిభా పాత్రకు డబ్బింగ్ చెప్పి ‘డబ్బింగ్ జానకి’గా మారారు. తల్లి పాత్రలు పోషిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత సీరియల్స్లోనూ నటించి ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నటనలో ఆరున్నర దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన నట శిరోమణి డబ్బింగ్ జానకమ్మ (Dubbing Janaki). ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి అతిథిగా వచ్చి ఎన్నో విషయాలు పంచుకున్నారు.
నటనలో మీది చాలా సుదీర్ఘ ప్రయాణం కదా.. అది తలచుకుంటే మీకెలా అనిపిస్తోంది?
జానకి: గడిచిన రోజులే మంచివనిపిస్తాయి. రానున్న రోజులు చాలా భయంకరంగా ఉంటాయేమో. పాత రోజుల్లో అన్ని కష్టాలు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అది చాలా గొప్ప విషయం. ఇండస్ట్రీలోకి ప్రతి ఆర్టిస్టు కష్టపడే వచ్చారు. మా అనుభవాల వెనుక ఉన్న కష్టం మాకు మాత్రమే తెలుస్తుంది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మార్పుల గురించి చెప్పండి?
జానకి: ఆ రోజుల్లో నేను ఒక పెద్ద సినిమాలో నటించి రూ.750 తీసుకున్నాను. అప్పట్లో అదే పెద్ద అమౌంట్. బస్సులో వెళ్లడానికి డబ్బులు లేక కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లే దాన్ని. తినడానికి తిండి లేక పస్తులున్న రోజులు ఎన్నో ఉన్నాయి. వాటిని దాటుకుని వచ్చాం. నా బాల్యమంతా పెద్దాపురంలోనే గడిచింది. నాలుగో తరగతి చదివేటప్పుడు మొదటిసారి నాటకం వేశాను. వాళ్లకు మా అడ్రస్ ఎవరు చెప్పారో తెలీదు కానీ, ఇంటికి వచ్చి మా నాన్నను అడిగారు. అలా ‘అశాంతి’ అనే నాటకంతో నా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత చాలా రోజులు నాటకాలు వేశాను.
మీ వివాహం గురించి చెప్పండి..?
జానకి: మాది ప్రేమ వివాహం. మా పెళ్లి సమయంలో చాలా గొడవలు అయ్యాయి. మా వారికి సంగీతం అంటే ఇష్టం. నేను వేస్తున్న నాటకానికి హర్మొనీ వాయించాల్సిన అతను రాకపోతే ఆ స్థానంలో మా వారు వచ్చారు. అలా నా నాటకంలో భాగమైన అతనే నా జీవితంలో భాగమయ్యారు. నాటకాలు వేయకూడదు, మిలటరీ అతడిని చేసుకోకూడదు, గృహిణిగా ఉండాలి.. నా జీవితానికి నేను పెట్టుకున్న షరతులు ఇవి. కానీ ఈ మూడు జరగలేదు. మాకు ముగ్గురు పిల్లలు.
తెలుగు, తమిళ పరిశ్రమల్లో యాక్టర్లను గుర్తించే విధానం ఎలా ఉంటుంది?
జానకి: ఎవరి మనస్తత్వానికి తగట్లు వాళ్లు చూస్తారు. నేను ఎక్కడ నటిస్తున్నా.. నా పని నేను చూసుకుని వచ్చేస్తాను. కన్నడ ఇండస్ట్రీలో మాత్రం రాజ్ కుమార్ గారి సినిమా షూటింగ్లో ఆర్టిస్టులు అందరూ కలిసి భోజనం చేసేవారు.
‘జంబలకిడిపంబ’ సినిమాలో అలాంటి పాత్ర చేయడం ఎలా అనిపించింది?
జానకి: మొదట ఈవీవీ సత్యనారాయణ గారు నా పాత్ర గురించి చెప్పగానే భయపడ్డాను. చాలా ఇబ్బంది పడ్డా. కానీ ఆ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. మన మీద మనకు నమ్మకం ఉంటే ఏదైనా చేయెచ్చని నేను అనుకుంటాను. భగవంతుడు మనకు శక్తినిచ్చాడు. ప్రాణం ఉన్నంత వరకు నటిస్తూ ఉండాలని కోరుకుంటాను. ఉన్నంతలో తృప్తిగా ఉండడమే నా ఆరోగ్య రహస్యం. నేను మొదటి సారి నెగెటీవ్ పాత్రలో చేసిన సినిమాలో సావిత్రి నటించారు. ఆవిడ అప్పటికే పెద్ద స్టారు. తనతో కలిసి చాలా సినిమాల్లో నటించాను. సెట్లో చాలా సరదాగా ఉండేవారు.
రామారావు, నాగేశ్వరరావు లాంటి స్టార్స్తో పనిచేశారు కదా.. ఆ అనుభవాలు చెప్పండి?
జానకి: నాకు రామారావు గారంటే భయం, భక్తి. ఆయన్ని కలవాలంటే తెల్లవారు జామున 4 గంటలకు వెళ్లాలి. లేదంటే ఇక షూటింగ్లో బిజీ అవుతారు. ఆయన్ని చూడడం కోసం ఎంతమంది వచ్చినా విసుగు లేకుండా కలిసే వారు. అది చాలా గొప్ప విషయం. నాగేశ్వరరావు గారు చాలా సరదాగా ఉండే వారు. సెట్లో అంతా కూడా సందడిగా ఉంటారు.
సినిమాల్లోకి వద్దామనుకునే యువతకు మీరిచ్చే సలహా ఏంటి?
జానకి: కొత్తతరం రావాలి. ఇప్పటికే టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఇంకా వస్తాయి. మంచిగా మన పని మనం చేస్తూ వెళ్తే ఏ రంగంలోనైనా విజయం సాధిస్తారు. కష్టం లేనిది ఏదీ రాదని గ్రహించాలి. నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. కె. విశ్వనాథ్ గారితో నా అనుబంధం చాలా బాగుండేది. సొంత ఇంట్లో చేస్తున్నట్లు ఉండేది. ఆయన చెప్పిన దాంట్లో 50 శాతం చేసినా స్క్రీన్ మీద 100 శాతం కనిపిస్తుంది.
డబ్బింగ్ జానకి అనే పేరు ఎలా వచ్చింది?
జానకి: అప్పుడు ఇండస్ట్రీలో ముగ్గురు జానకిలు ఉన్నారు. షావుకారు జానకి, సింగర్ జానకి, నేను. అందుకని నా పేరును డబ్బింగ్ జానకి చేశారు. అప్పట్లో చాలా మంది హీరోయిన్స్కు డబ్బింగ్ చెప్పా. తర్వాత గ్రూప్ డ్యాన్స్లు కూడా చేశాను. శ్రీదేవి వాళ్ల అమ్మ నాకు మంచి స్నేహితురాలు. కమ్యూనిస్ట్ పార్టీలకు పాటలు పాడే దాన్ని, బుర్రకథలు చెప్పే దాన్ని. ఒక కళ కాదు.. బతకడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని చేసేదాన్ని.
మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
జానకి: ఆయన మెగాస్టార్ (chiranjeevi) కాకముందు నుంచే కలిసి నటించాం. ‘ప్రాణం ఖరీదు’ సినిమా సమయంలో నేను ఆ హీరోయిన్కు డబ్బింగ్ చెప్పాను. అందరితో కలిసి కట్టుగా ఉండేవాళ్లు. నాకు స్టేజీ ఆర్టిస్ట్గా చేయడమే ఎక్కువ తృప్తినిచ్చింది. 1979లో వెండి కిరీటం గెలుచుకున్నా. అలా గెలుచుకుంటే తెలియని ఆనందం ఉంటుంది.
సినిమాల్లో అవకాశం ఎలా వచ్చింది?
జానకి: ఒకసారి నేను, మా వారు బస్సులో వెళ్తుంటే ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్ మేము తెలుగులో మాట్లాడం చూసి మీరు తెలుగు వారా అని అడిగారు. సినిమాల్లో నటిస్తారా అని స్టూడియో అడ్రస్ ఇచ్చారు. అక్కడ స్క్రీన్ టెస్ట్ చేసి ‘భూకైలాస్’లో అవకాశమిచ్చారు. ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి.
చెన్నైలో ఉన్నప్పుడు చంద్రమోహన్ వాళ్లింట్లో అద్దెకు ఉండే వారని విన్నాం?
జానకి: అవును. చంద్రమోహన్ వాళ్ల ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీ ఉందని తెలిసి అడిగాను. సినిమా వాళ్లకు ఇవ్వను అన్నారు. రెండు నెలలు చూడండి. మీకు నచ్చకపోతే వెళ్లిపోతా అని చెప్పి అందులోకి వెళ్లాను. ఇండస్ట్రీలో నాకు నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రమోహన్ గారే. చాలా మంచి వ్యక్తి.
కమల్హాసన్కు అమ్మ క్యారెక్టర్ చేసినప్పుడు ఎలా అనిపించింది?
జానకి: ఆ సినిమాలో ఓ సన్నివేశంలో కమల్ హాసన్ నా కాళ్లమీద పడి ఏడుస్తారు. అప్పటికే ఆయన పెద్ద స్టార్. అయినా అలా చేశారు. అది చాలా గొప్ప విషయం. అందరు హీరోలు అలా చేయలేరు. ఆవిడ కాళ్ల మీద నేను పడేదేంటనుకుంటారు. నేను కృష్ణగారితో కూడా చాలా సినిమాలు చేశా. ఆయన నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ (Alluri Sitarama Raju) సినిమాకు డబ్బును మంచి నీళ్లలా ఖర్చు పెట్టారు.
ఎవరో ఒక నటి తనకంటే ముందు మీరు తినేశారని క్యారేజీ బాక్స్ను తన్నేశారట?
జానకి: పేరు చెప్పను. నా కంటే పెద్దనటి కూడా కాదు. మా ఇద్దరికీ రూమ్ ఇచ్చారు. నాకు త్వరగా తిని నిద్రపోయే అలవాటు. అందుకని మాకు పంపిన బాక్స్లో కొంచెం తినేసి పడుకున్నా. ఆవిడ వచ్చి చూసి క్యారెజ్ బాక్స్ను కాలితో ఒక్క తన్ను తన్నింది. నేనేం పట్టించుకోకుండా నా పని నేను చూసుకున్నా.
సీతాకోక చిలుక (Seethakoka Chilaka)సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?
జానకి: భారతీరాజా గారంటే నాకు కొంచెం భయం. ఆయన చెప్పినట్లు చేయకపోతే సీరియస్ అయ్యేవారు. ఆయనతో చాలా మంది ఆర్టిస్టులు తిట్లు తిన్నారు. ఆ సినిమా క్లైమాక్స్ విరామం లేకుండా 24 గంటలు తీశారు. నా పాత్రకు మంచి పేరు వచ్చింది.
మీ వారు చనిపోయాక ఐదో రోజే షూటింగ్కు వెళ్లారట?
జానకి: మోహన్ బాబు ‘కలెక్టర్ గారు’ సినిమాకు నేను డేట్స్ ఇచ్చాను. అప్పుడు మా వారు చనిపోయారు. నిర్మాతలను ఇబ్బంది పెట్టకూడదని ఐదో రోజు షూటింగ్కు వెళ్లాను. ఆ బాధను నాలోనే దాచుకుని నటించాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే