samantha: సొగసరి యాక్షన్ గురి
ప్రేమకథల్లో ఒదిగిపోతూ.. కథానాయకులతో ఆడిపాడుతూ తెరపై హొయలొలికించే కథానాయికలు ఇప్పుడు తమలోని యాక్షన్ కోణాన్ని బయటకు తీస్తున్నారు. హీరోలకు దీటుగా పోరాటాలతో అదరగొట్టి.. సినీప్రియుల్ని మురిపించేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రేమకథల్లో ఒదిగిపోతూ.. కథానాయకులతో ఆడిపాడుతూ తెరపై హొయలొలికించే కథానాయికలు ఇప్పుడు తమలోని యాక్షన్ కోణాన్ని బయటకు తీస్తున్నారు. హీరోలకు దీటుగా పోరాటాలతో అదరగొట్టి.. సినీప్రియుల్ని మురిపించేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఇప్పుడిలా యాక్షన్ భామలుగా అలరించేందుకు సిద్ధమవుతున్న ఆ నాయికల చిత్ర విశేషాలివీ.
ఖాకీ కట్టి.. లాఠీ పట్టి
అసలు సిసలు హీరోయిజానికి నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తుంటాయి పోలీసు కథలు. అందుకే ఈ తరహా కథలతో సందడి చేసేందుకు కథానాయకులెప్పుడూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే ఇప్పుడీ పోలీలు కథలతో యాక్షన్ హంగామా రుచి చూపించేందుకు కథానాయికలు పోటీ పడుతున్నారు. ఓవైపు కమర్షియల్ సినిమాలతోనూ.. మరోవైపు నాయికా ప్రాధాన్య చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది కీర్తి సురేశ్. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల్లో రెండు యాక్షన్ ప్రాధాన్య చిత్రాలున్నాయి. అందులో ఒకటి ‘రివాల్వర్ రీటా’ కాగా.. మరొకటి ‘సైరెన్’. జయం రవి హీరోగా ఆంటోని భాగ్యరాజ్ తెరకెక్కించిన ఈ ‘సైరెన్’ చిత్రంలో నందిని అనే పోలీసు అధికారిగా కీర్తి సందడి చేయనుంది. ఇప్పటికే ప్రచార చిత్రాల్లో ఆమె పాత్రను చూపించిన తీరును బట్టి సినిమాలో ఆమె యాక్షన్తో పాటు ఛేజింగ్ సన్నివేశాల్లోనూ నటించినట్లు తెలుస్తోంది. ఇక ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రివాల్వర్ రీటా’ చిత్రంలోనూ తన పాత్ర పూర్తిగా యాక్షన్ కోణంలో సాగనున్నట్లు తెలుస్తోంది.
ఇక కీర్తిలాగే పోలీసు పాత్రతో సినీప్రియుల ముందుకు రానున్న మరో కథానాయిక కాజల్ అగర్వాల్. ఆమె ప్రస్తుతం ‘సత్యభామ’ అనే నాయికా ప్రాధాన్య చిత్రంలో నటిస్తోంది. సుమన్ చిక్కాల తెరకెక్కిస్తున్న క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇందులో కాజల్ ఏసీపీగా పవర్ఫుల్ యాక్షన్ పాత్రను పోషిస్తోంది. ఓ యువతి హత్య కేసును ఛేదించే క్రమంలో ఆమెకు ఎదురైన సవాళ్లేంటి? వాటిని ఆమె ఎలా అధిగమించింది? అన్నది ఆసక్తికరం. ఇప్పటికే విడుదలైన టీజర్లో ఆమె యాక్షన్ హంగామాను మచ్చుకు చూపించారు. మరి పూర్తిస్థాయిలో వెండితెరపై తనదైన యాక్షన్తో ఎలా అదరగొట్టనుందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు. కాజల్ ప్రస్తుతం కమల్హాసన్ సరసన ‘భారతీయుడు 2’లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోనూ ఆమె పాత్రకు యాక్షన్ టచ్ ఉంది. దీనికోసం ఆమె మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకొని చిత్రీకరణలో పాల్గొంది. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘కల్కి’తో కలిసి దీపిక పోరాటం?
అటు గ్లామర్ పాత్రలతోనూ.. ఇటు యాక్షన్ పాత్రలతోనూ సినీప్రియుల్ని మెప్పించిన భామ దీపిక పదుకొణె. ఆమె ప్రస్తుతం ‘కల్కి 2898ఎ.డి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కానున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. కమల్హాసన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, దిశా పఠానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విభిన్నమైన సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో.. దీపిక యాక్షన్ ఛాయలున్న పాత్రలోనే కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘‘చీకటిలో కాంతిరేఖ’’ అంటూ ఇప్పటికే విడుదల చేసిన ఆమె ఫస్ట్లుక్లో తన గెటప్ను ఓ యోధురాలి తరహాలోనే ఆసక్తికరంగా చూపించారు. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. హృతిక్రోషన్తో కలిసి నటిస్తోన్న ‘ఫైటర్’లోనూ దీపిక పోరాటాలతో అదరగొట్టనుంది.
సిటాడెల్ కోసం సమంత సాహసాలు..
‘ది ఫ్యామిలీమ్యాన్-2’, ‘యశోద’ సినిమాలతో తనలోని యాక్షన్ కోణాన్ని సినీప్రియులకు పరిచయం చేసింది నటి సమంత. ఇప్పుడామె ‘సిటాడెల్’ సిరీస్ కోసం స్పై ఏజెంట్గా మారి సరికొత్త సాహసాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది. రాజ్-డీకే తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్లో వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. మరి ఇందులో స్పై ఏజెంట్గా సామ్ ఎలాంటి సాహసాలు చేసిందో చూడాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు.
‘సైంధవ్’ కోసం తుపాకీ పట్టి..
సంక్రాంతి బరిలో ‘సైంధవ్’గా సందడి చేయనున్నారు వెంకటేశ్. ఆయన హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మలతో పాటు ఆండ్రియా ఓ నాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తను జాస్మిన్ అనే యాక్షన్ కోణంలో సాగే పాత్రలో కనువిందు చేయనుంది. యాక్షన్ థ్రిల్లర్గా ముస్తాబవుతోన్న ఈ సినిమా జనవరి 13న థియేటర్లలోకి రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్స్ ఏర్పాటు చేసిన పార్టీలో ఎన్టీఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. -
Mahesh babu: మహేశ్ జుట్టులాగి ఆటపట్టించిన మంజుల.. క్యూట్ మొమెంట్స్ వైరల్..
ఓ పెళ్లి వేడుకకు మహేశ్బాబు హాజరుకాగా, ఆయన సోదరి మంజుల ఆటపట్టించారు.
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
ముద్దు సన్నివేశాలకు నో చెప్పిన కారణంగా అవకాశాలు కోల్పోయినట్లు మృణాల్ ఠాకూర్ చెప్పారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
పేరు ఊరిస్తోంది
విజయవంతమైన కలయికల్ని పునరావృతం చేయడమన్నది చిత్రసీమలో తరచూ కనిపిస్తూనే ఉంటుంది. ఈ తరహావి ప్రేక్షకుల్లో అంచనాల్ని అమాంతం పెంచేస్తుంటాయి. అంతేకాదు ఇవి మార్కెట్ను బలంగా ప్రభావితం చేస్తుంటాయి. -
బంగారం అంటే మెరవాలా?
సమంత పునరాగమనం ఏ సినిమాతో అనేది ఖరారైంది. సొంత నిర్మాణంలోనే ఆ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇటీవలే ఆమె ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించిన విషయం తెలిసిందే. -
ఇక్కడ ఎవరికి వారే హీరో
‘‘స్వేచ్ఛ కోసం అందాన్ని సైతం ఆయుధంగా ఉపయోగించుకునే కళ ఈ బిబ్బోజాన్కు మాత్రమే తెలుసు’’ అంటూ ఇటీవలే ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని తన పాత్రను పరిచయం చేసింది అదితిరావ్ హైదరి. -
శరవేగంగా.. ‘ఐడెంటిటీ’
టోవినో థామస్, త్రిష జోడీగా అఖిల్ పాల్, అనాస్ఖాన్ తెరకెక్కిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఐడెంటిటీ’. ‘2018’ సంచలనం విజయం తర్వాత ఈ సినిమా వస్తుండటంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. మరోవైపు త్రిష నాయిక కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. -
‘థగ్లైఫ్’ గీత రచయితగా..
అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ విలక్షణమైన నటనతోనే కాదు.. దర్శక నిర్మాతగా, స్క్రిప్ట్ రచయితగా, గాయకుడిగానూ గతంలో మెప్పించారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘థగ్ లైఫ్’తో గీత రచయితగా మరోసారి ప్రయోగం చేశారు. -
రణ్వీర్తో త్వరలోనే..
హిందీ మొదలుకొని మలయాళం వరకూ అన్ని పరిశ్రమల తారల్నీ భాగం చేస్తూ తాను సినిమాల్ని చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు ప్రశాంత్వర్మ. సంచలన విజయం సాధించిన ‘హను-మాన్’ చిత్రంతోనే పీవీసీయూ (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) పేరుతో తనదైన కథల ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించడం మొదలు పెట్టారు. -
కథ కుదిరింది
గతేడాది ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో సినీప్రియుల్ని అలరించారు సాయిదుర్గా తేజ్. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు కొత్త కబురు వినిపించలేదు. ఆ మధ్య సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రకటన వచ్చినా కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. -
థ్రిల్ ప్రాప్తిరస్తు
ప్రియదర్శి హీరోగా నటించనున్న కొత్త చిత్రం ఖరారైంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, శ్రీ వెంకటేశ్వర ఏషియన్ సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాతో నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. -
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
‘దేవర’ సినిమా విషయంలో తనకెదురైన ప్రశ్నపై అల్లరి నరేశ్ స్పందించారు. -
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
నెగెటివ్ కామెంట్స్ను తాను పట్టించుకోనన్నారు నటి వరలక్ష్మీ శరత్కుమార్. -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM