Tollywood: మాస్ నాడి పట్టి..బాలీవుడ్ని వెనక్కి నెట్టి
బాలీవుడ్ అంటే చిత్ర పరిశ్రమలకు అన్నింటికీ పెద్దన్నలా ఉండేది. వసూళ్ల పరంగా రికార్డుల మోత మోగించేది. దేశవ్యాప్తంగా బాలీవుడ్ సినిమాలకు మంచి రీచ్ ఉండటంతో భారీ వసూళ్లు దక్కేవి. ప్రాంతీయ భాషా చిత్రాల పరిధి కొంతవరకే ఉండేది. దక్షిణాది చిత్రాలంటే కాస్త చిన్నచూపు అనే విమర్శ కొనసాగేది. ‘
బాలీవుడ్ అంటే చిత్ర పరిశ్రమలకు అన్నింటికీ పెద్దన్నలా ఉండేది. వసూళ్ల పరంగా రికార్డుల మోత మోగించేది. దేశవ్యాప్తంగా బాలీవుడ్ సినిమాలకు మంచి రీచ్ ఉండటంతో భారీ వసూళ్లు దక్కేవి. ప్రాంతీయ భాషా చిత్రాల పరిధి కొంతవరకే ఉండేది. దక్షిణాది చిత్రాలంటే కాస్త చిన్నచూపు అనే విమర్శ కొనసాగేది. ‘బాహుబలి’తో బాలీవుడ్కే కాదు ప్రపంచ సినిమాకు దక్షిణాది సినిమా సత్తా ఏంటో తెలిసింది. క్రమంగా బాలీవుడ్ను దాటి ముందుకు వడివడిగా అడుగులు వేస్తోంది దక్షిణాది సినిమా. ‘పుష్ప’ దక్షిణాదిలో ఎంత హిట్ అయ్యిందో అంతే గొప్పగా హిందీ ప్రేక్షకుల్ని అలరించింది. అక్కడే రూ.100కోట్లు పైనే వసూలు చేసి ఔరా అనిపించింది. దీనికి మన మాస్ మంత్రమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ చిత్రాల తర్వాత దక్షిణాది భారీ చిత్రాలన్నీ పాన్ ఇండియా వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప’ భారీ విజయంతో ఈ వేగం రెట్టింపైంది. అదే సమయంలో బాలీవుడ్లో ఒకప్పటి వేగం కనిపించడం లేదంటున్నారు సినీ విమర్శకులు. బాలీవుడ్ స్థానాన్ని దక్షిణాది చిత్రాలు ఆక్రమించడం మొదలైంది అంటున్నారు. కరోనా మొదలయ్యాకా ఒకటి రెండు బాలీవుడ్ సినిమాలు విడుదలైనా వావ్ అనిపించేలా సత్తా చాట లేదు. ఇదే సమయంలో దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు చిత్రసీమ భారీ విజయాలు అందుకుంది. ‘‘దక్షిణాది చిత్రాలు హిందీ చిత్రాలను దాటేస్తున్నాయి. బాలీవుడ్తో పోలిస్తే దక్షిణాది సినిమాల శాటిలైట్ హక్కులూ భారీ ధర పలుకుతున్నాయి. బాక్సాఫీసు వద్ద వసూళ్లు అదే స్థాయిలో ఉంటున్నాయి’’అంటున్నారు ‘పుష్ప’ హిందీ హక్కులు దక్కించుకున్న మనీష్షా.
బాలీవుడ్ ఎందుకిలా!
బాలీవుడ్ నుంచి భారీ సినిమా వస్తుందంటే ఇతర అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ అంచనాలుండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి నెమ్మదిగా మారుతుంది అనేది స్పష్టంగా తెలుస్తోంది. భారీ బాలీవుడ్ చిత్రాలు మూస దారిలో వెళుతున్నాయి. కథలో కొత్తదనం ఉండటం లేదు, ఎక్కువమందికి చేరువయ్యే కథలు రావడం లేదు...ఇలాంటి వ్యాఖ్యలు బాలీవుడ్పై సర్వసాధారణమయ్యాయి. తాజాగా అజిత్తో ‘వలిమై’ చిత్రాన్ని నిర్మించిన బోనీ కపూర్ మాట్లాడుతూ ‘‘దక్షిణాది సినిమాల్లో యాక్షన్, డ్రామా, కామెడీ.. ఈ మూడు బాగా ఉంటున్నాయి. ఇవే మాస్ ప్రేక్షకులకు బాగా చేరువచేస్తున్నాయి’’ అంటున్నారు.
అంచనాల పాన్ ఇండియా
దక్షిణాది భాషల్లోని అగ్ర హీరోల చిత్రాలన్నీ పాన్ ఇండియా బాట పట్టడానికి కారణం బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి దక్కుతున్న ఆదరణే. ప్రముఖ దర్శకుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’, ‘కేజీఎఫ్ 2’, ‘లైగర్’ ఇలా పలు దక్షిణాది చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈసారి మరిన్ని విజయాలు దక్కితే అటు ఇటు కావడం ఖాయమనే మాటలూ వినిపిస్తున్నాయి. బాలీవుడ్ను దాటి దక్షిణాది సినిమాలు దూసుకుపోవడం తథ్యం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇదే జరిగితే ఎక్కువ లాభపడేది మన తెలుగు పరిశ్రమే.
మాస్ని ఆకట్టుకోవడంలో విఫలం
‘‘కొన్ని ఏళ్లుగా బాలీవుడ్లో ఎక్కువ శాతం మందికి చేరువయ్యే సినిమాలు రావడం లేదు. సల్మాన్ఖాన్, అజయ్దేవ్గణ్, ఆమిర్ఖాన్ లాంటి పెద్ద హీరోల చిత్రాలూ మల్టీప్లెక్స్ ప్రేక్షకులకే పరిమతం అయ్యేలా ఉంటున్నాయి. రాజ్కుమార్ రావ్, ఆయుష్మాన్ ఖురానా లాంటి వారి పరిధి కొంత వరకే ఉంటుంది. అంతేకానీ రూ.300కోట్లు వసూళ్లు సాధించే పరిస్థితి లేదు. అందుకే మాస్ నాడి పట్టుకున్న ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’, ‘పుష్ప’ చిత్రాలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల మనసుని గెలిచేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజ జీవిత కథలంటే ప్రత్యేక బాధ్యత
కలల్ని సాకారం చేసుకోవడానికీ... సమున్నత లక్ష్యాల్ని చేరుకోవడానికి అంధత్వం అడ్డు రాదని చాటుతూ పారిశ్రామిక వేత్తగా ఎదిగిన తెలుగు తేజం... శ్రీకాంత్ బొల్లా. బొల్లాంట్ ఇండస్ట్రీస్ని స్థాపించిన ఆయన జీవితం ఆధారంగానే ‘శ్రీకాంత్’ చిత్రం తెరకెక్కింది. -
నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!
బాలీవుడ్ సీనియర్ నాయిక కరీనాకపూర్ టాప్గేర్లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్కి భారత్ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది. -
నిజమైన బలం అదే
సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమయ్యే అభిప్రాయాలపైనా... సాగే చర్చపైనా స్పందించకూడదని సమంత నిర్ణయించుకుందా? ఆమె ఇన్స్టాలో పంచుకున్న ఓ పోస్ట్ ఆ అభిప్రాయాన్నే సూచిస్తోంది. -
రాయన్ వస్తున్నాడు
ధనుష్ కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘రాయన్’. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. -
ఓటీటీలోకి నేరుగా ‘విద్యా వాసుల అహం’
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా మణికాంత్ గెల్లి తెరకెక్కించిన చిత్రం ‘విద్యా వాసుల అహం’. మహేశ్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి సంయుక్తంగా నిర్మించారు. -
‘టైటానిక్’ కెప్టెన్ కన్నుమూత
‘టైటానిక్’, ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’లాంటి చిత్రాల్లో మరపురాని పాత్రలు పోషించిన హాలీవుడ్ నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూశారు. -
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ షురూ
యావత్తు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ చిత్రీకరణ మొదలైంది. తమ డీ2ఆర్ ఫిల్మ్స్ బ్యానర్లో తెలుగు ద్వయం రాజ్, డీకే ఈ వెబ్సిరీస్ రూపొందిస్తున్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్ సినీ ప్రియులకు శుభవార్త చెప్పింది. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది.