Tollywood: టాలీవుడ్లో ఈరోజు హాట్ అండ్ స్వీట్ న్యూస్ ఇవే!
తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల జోరు పెరిగింది. కొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండగా, మరికొన్ని షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. మంగళవారం
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల జోరు పెరిగింది. కొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండగా, మరికొన్ని షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. మంగళవారం ఏయే చిత్రాలు ఎలాంటి అప్డేట్స్తో వచ్చాయో చూసేద్దామా!
‘అఖండ’ పూర్తయింది.. విడుదలే తరువాయి
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ ‘అఖండ’. ప్రగ్యాజైశ్వాల్ కథానాయిక. శ్రీకాంత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. మంగళవారంతో ‘అఖండ’ షూటింగ్ పూర్తయినట్లు చిత్ర బృందం తెలిపింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని చిత్ర బృందం వెల్లడించింది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా వేగంగా సాగుతున్నాయి. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. బాలకృష్ణ ఇందులో రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
‘అర్జున ఫల్గుణ’కు కూడా..
వైవిధ్య చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీవిష్ణు. ఆయన కీలక పాత్రలో తేజ మర్ని దర్శకత్వం వహించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. ఈ సినిమా షూటింగ్ కూడా మంగళవారంతో పూర్తయింది. ‘ఇక అర్జునుడి సమయం మొదలు’ అంటూ పోస్టర్ను చిత్ర బృందం పంచుకుంది. త్వరలోనే విడుదల తేదీ కూడా ప్రకటించనున్నారు. ‘అర్జున ఫల్గుణ’ అని ఎవరు తలుచుకున్నారు? మరి అర్జునుడు వచ్చాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
‘పుష్ప’నుంచి మరో సింగిల్
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప’. రష్మిక కథానాయిక. ఇందులో ఆమె శ్రీవల్లి అనే పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త అప్డేట్ను చిత్ర బృందం వెల్లడించింది. ‘శ్రీవల్లి’ అంటూ సాగే పాటను దసరా కానుకగా అక్టోబరు 13న విడుదల చేయనున్నట్లు చిత్ర బృంద ప్రకటించింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్న ఈచిత్రం మొదటి భాగం డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘మహా సముద్రం’ శర్వా డబ్బింగ్ పూర్తి
శర్వానంద్, సిద్ధార్థ్ కథానాయకులుగా అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న రొమాంటిక్ యాక్షన్ డ్రామా ‘మహా సముద్రం’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. దసరా కానుకగా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శర్వానంద్ డబ్బింగ్ పూర్తయినట్లు చిత్ర బృందం వెల్లడించింది.
చిట్టెమ్మ.. పుత్తడి బొమ్మ అంటున్న వరుణ్ డాక్టర్
తమిళంతో పాటు, తెలుగులోనూ అలరిస్తున్న నటుడు శివ కార్తికేయన్. నీల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటించిన తాజా మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘వరుణ్ డాక్టర్’. ప్రియాంక అరుళ్ మోహన్, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. అక్టోబరు 9న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ‘చిట్టెమ్మ.. పుత్తడిబొమ్మ’ అంటూ సాగే పాట గ్లింప్స్ను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రత్యేకమైన సెట్లో తీర్చిదిద్దిన ఈ పాట బాగుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్