Samantha: నా కారణంగా బాధపడితే క్షమించండి: సమంత
Samantha: పీరియాడికల్ చిత్రం ‘శాకుంతలం’లో నటించడం సంతోషంగా ఉందని అగ్ర కథానాయిక సమంత చెప్పుకొచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘జెస్సీ’, ‘ఇందు’, ‘బిందు’, ‘గీత’, ‘శశి’, ‘అంజలి’, ‘సమీర’, ‘రామలక్ష్మి’, ‘మధురవాణి’, ‘శ్రావణి’ తదితర వైవిధ్య పాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాల్ని దోచుకుంది నటి సమంత (Samantha). ఆ వైవిధ్యతని వెండితెరపైనే కాకుండా డిజిటల్ మాధ్యమాల్లోనూ చూపించాలనుకుంది. అలా చేసిన ప్రయత్నం, ప్రయోగమే ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ (The family man 2) వెబ్ సిరీస్. ఇందులో ‘రాజీ’ పాత్రని పోషించి, విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. డీ గ్లామర్గా కనిపించి ‘తను సమంతనేనా?’ అనే ఆశ్చర్యంలో పడేసింది. ఉత్తమ నటిగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (Indian film festival of melbourne) అవార్డు దక్కించుకుంది. ఈ సందర్భంగా సమంత ఓ ప్రముఖ ఆంగ్ల మీడియాతో ముచ్చటించింది. ఆ వివరాలివీ...
* ఉత్తమ నటిగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్- 2021 అవార్డు గెలుచుకున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు?
సమంత: చాలా చాలా ఆనందంగా ఉంది. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’.. నేను నటించిన తొలి వెబ్ సిరీస్. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ నటిగా అవార్డు పొందడం నాలో మరింత ఉత్సాహాన్ని పెంచింది. ఈ సిరీస్ ఇప్పటికే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ అవార్డు ప్రకటనతో మరింత ప్రోత్సాహం అందినట్టే.
* ‘ఫ్యామిలీమ్యాన్ 2’ వెబ్సిరీస్లో రాజీగా అత్యుత్తమంగా నటించారు. కానీ మీ పాత్ర, సిరీస్లపై విమర్శలు వచ్చాయి కదా..!
సమంత: అవును. సిరీస్ విడుదలకి ముందు కొన్ని విమర్శలు ఎదురైనా విడుదలైన కొన్ని రోజుల్లోనే ఆ ట్రోలింగ్ ఆగిపోయింది. అయితే రాజీ పాత్ర పోషించినందుకు ఇప్పటికీ నాపై ఆగ్రహం వ్యక్తం చేసేవారున్నారు. ప్రజల మనోభావాల్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ పాత్రలో నటించలేదు. నాకు బాగా నచ్చడంతో నిజాయతీగా రాజీ పాత్రని పోషించా. అయినా ఆ పాత్ర కొందరిని బాధించింది కాబట్టి ఈ సందర్భంగా క్షమాపణలు కోరుతున్నా.
* సామాజిక మాధ్యమాల ఖాతాల్లో అక్కినేని సమంత పేరుని తొలగించి ఎస్ అని పెట్టారు. అది హాట్ టాపిక్ అయింది. దీనిపై మీ స్పందన?
సమంత: అది హాస్యాస్పదమైన గాసిప్. సాధారణంగా నేను గాసిప్స్కి స్పందించను. ఇప్పుడూ అంతే.
* ‘శాకుంతలం’లో నటించడం ఎలా అనిపించింది?
సమంత: పీరియాడికల్ చిత్రంలో నటించాలని ఎప్పటి నుంచో కోరిక. అది ‘శాకుంతలం’తో నెరవేరింది. ఈ సినిమాకి పని చేయడం గొప్ప అనుభూతిని పంచింది. ఇటీవల చిత్రీకరణ పూర్తయింది. సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్), వి.ఎఫ్.ఎక్స్ (విజువల్ ఎఫెక్ట్స్)లతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని ఆసక్తి ఎదురుచూస్తున్నా.
* ‘కాతువాకుల రెండు కాదల్’ చిత్రం కోసం నయనతార, విజయ్ సేతుపతితో నటించడం ఎలా ఉంది?
సమంత: నేనెప్పుడూ కామెడీ పాత్రని పోషించడాన్ని ఆనందిస్తా. ఈ చిత్రం పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ కావడంతో బాగా ఎంజాయ్ చేస్తూ నటించా. ఇందులో భాగమవడం, ఇద్దరు సూపర్స్టార్లు నయనతార, విజయ్ సేతుపతితో కలిసి పనిచేయడం మంచి థ్రిల్ పంచింది. ఇది తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన సినిమా. అందరినీ నవ్విస్తుందనే నమ్మకం నాకు ఉంది.
* ఇటీవల మీరు చూసిన వెబ్ సిరీస్ ఏంటి?
సమంత: ‘మారే ఆఫ్ ఈస్ట్టౌన్’ని చూశాను. చాలా బాగుంది. కేట్ విన్ల్సెట్ నటన విశేషంగా ఆకట్టుకుంది. ఇటీవల నేను ఎంజాయ్ చేసిన గొప్ప వెబ్ సిరీస్ ఇది.
* మీ తదుపరి చిత్రాలు?
సమంత: ఇప్పటి వరకు ప్రకటించిన చిత్రాలే తప్ప కొత్త కథల్ని వినలేదు. కొన్ని రోజులు విరామం తీసుకుని, ఆ తర్వాత స్క్రిప్టుల్ని వినాలనుకుంటున్నా. ( ప్రస్తుతం..గుణ శేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’, విఘ్నేశ్ దర్శకత్వంలో ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమాలు చేస్తున్నారామె).
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
‘డబుల్ ఇస్మార్ట్’ అప్డేట్ షేర్ చేసిన పూరి జగన్నాథ్..
పూరి జగన్నాథ్- రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి అప్డేట్ వచ్చింది. -
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
విజయ్ దేవరకొండ తన తర్వాత ప్రాజెక్ట్ను ప్రకటించారు. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
మమితా బైజు, అర్జున్ అశోకన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథేంటంటే? -
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
జులై నుంచి ప్రేమలో..
ప్రభాస్ ప్రేమకథకి ముహూర్తం కుదిరింది. జులై నుంచే ఆయన కొత్త ప్రేమాయణం మొదలు కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పక్కాగా సిద్ధమైనట్టు సినీ వర్గాలు తెలిపాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో... అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. -
సంయుక్త.. ఊ కొట్టేనా?
తెలుగు చిత్రసీమలోకి వచ్చిన అనతి కాలంలోనే వరుస విజయాలందుకుంటూ స్టార్ నాయిక స్థాయికి చేరుకుంది సంయుక్తా మేనన్. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘స్వయంభూ’తో పాటు శర్వానంద్తోనూ ఓ చిత్రం చేస్తోంది. -
ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది
‘నేను మొదటగా సంతోషపడేది నన్ను నేను తెరపై చూసుకున్నప్పుడే’ అని అంటోంది బాలీవుడ్ కథానాయిక యామీ గౌతమ్. ‘ఆర్టికల్ 370’తో భారీ విజయాన్ని అందుకుందీమె. హిందీలోనే కాదు తెలుగు చిత్రాల్లోనూ నటించి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. -
వాణీ కోసమే ఈ పాత్ర!
నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్ని ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది బాలీవుడ్ నాయిక వాణీ కపూర్. ఇప్పుడామె మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. ఆమె ప్రధాన పాత్రలో ‘బడ్తమీజ్ గిల్’ అనే సినిమా రాబోతున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. -
‘కన్నప్ప’లో అక్షయ్ పని పూర్తి
‘కన్నప్ప’తో సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు మంచు విష్ణు. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మోహన్బాబు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. -
సమ్మోహనం.. ఈ కలయిక
అపూర్వమైన కలయికలు కొన్ని ఉంటాయి. వాళ్లు కలిశారంటే చాలు... సినిమాకి క్లాప్ కొట్టిన రోజే బ్లాక్బస్టర్ బొమ్మని తెరపై చూసేసినంత సంబరం. రజనీకాంత్ - అమితాబ్ బచ్చన్ కలయిక అచ్చం అలాంటిదే. భారతదేశం గర్వించదగ్గ తారలు ఈ ఇద్దరూ. -
త్వరలో కుందాపురానికి ‘కాంతార 1’
‘కాంతార’ సినిమాతో జాతీయ స్థాయిలో సత్తా చాటారు రిషబ్ శెట్టి. ఇప్పుడీ సినిమాకి ప్రీక్వెల్గా ‘కాంతార: చాప్టర్ 1’ సిద్ధమవుతోంది. రిషబ్ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. -
ఏమయ్యిందే గుండెకు.. ఏనాడు లేదే ఇంత ఉలుకు
అశోక్ గల్లా హీరోగా అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. వారణాసి మానస కథానాయిక. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే?
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్