Runway 34: క్రేజీ మల్టీస్టారర్‌.. టైటిల్‌ మారింది

బాలీవుడ్‌ ప్రముఖ నటులు అమితాబ్‌ బచ్చన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ కలిసి నటిస్తోన్న సినిమా టైటిల్‌ మారింది. చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా కొత్త పేరుని ప్రకటిస్తూ నాయకానాయికల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.

Published : 29 Nov 2021 17:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ ప్రముఖ నటులు అమితాబ్‌ బచ్చన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ కలిసి నటిస్తున్న సినిమా టైటిల్‌ మారింది. సామాజిక మాధ్యమాల వేదికగా చిత్ర బృందం కొత్త పేరును ప్రకటిస్తూ నాయకానాయికల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ క్రేజీ మల్టీస్టారర్‌కు ‘మేడే’ అనే టైటిల్‌కి బదులుగా ‘రన్‌వే 34’ అనే పేరు ఖరారైంది. పోస్టర్లను చూస్తుంటే పైలెట్‌ జీవితాలకు సంబంధించిన కథలా అనిపిస్తుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని అజయ్‌ దేవ్‌గణ్‌ తెరకెక్కిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ఆకాంక్ష సింగ్‌, బొమన్‌ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏడీఎఫ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2022 ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకురానుంది. అజయ్‌ దేవ్‌గణ్‌కి దర్శకత్వం కొత్తేం కాదు. గతంలో ‘యు మీ ఔర్‌ హమ్‌’, ‘శివాయ్‌’ చిత్రాలకు డైరెక్షన్‌ చేసిన సంగతి తెలిసిందే.

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని