Balakrishna: యాదాద్రి ఆలయంలో ‘అఖండ’ టీమ్‌ ప్రత్యేక పూజలు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని ‘అఖండ’ చిత్రబృందం సోమవారం ఉదయం దర్శించుకుంది. ‘అఖండ’ ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్రబృందం గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో...

Updated : 27 Dec 2021 13:27 IST

యాదాద్రి, భువనగిరి: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని ‘అఖండ’ చిత్రబృందం సోమవారం ఉదయం దర్శించుకుంది. ‘అఖండ’ ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్రబృందం గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విజయోత్సవ యాత్రలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా టీమ్‌ యాదాద్రి ఆలయానికి చేరుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకుంది.

అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అఖండ’ విజయవంతమైన సందర్భంగా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటున్నాం. భారతదేశంలోని ప్రతిఒక్కరూ స్వామివారిని దర్శించుకునే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకశ్రద్ధ తీసుకుని ఈ ఆలయ పునఃనిర్మాణం చేపట్టారు. యాదాద్రి ఆలయం ఒక చరిత్రాత్మకం. ఆలయ నిర్మాణంలో పనిచేసిన ప్రతీ ఒక్క కార్మికునికి కృతజ్ఞతలు. చిన్నప్పటి నుంచీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటున్నా. ఆయన నా ఇష్ట దైవం. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను ఆ భగవంతుడు కాపాడాలని కోరుకున్నా’’ అని బాలయ్య తెలిపారు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని