ఈ వైరం... ఆ తీరం
కథానాయకుడికి తగిన జోడీ ఎంత ముఖ్యమో... సై అంటే సై అంటూ ఢీ కొట్టే ప్రతినాయకుడూ అంతే కీలకం. సినిమాలో హీరోయిజం పండాలంటే, హీరోకి ప్రత్యర్థిగా కనిపించే విలన్ దీటుగా ఉండాల్సిందే. రాజమౌళి సహా కొద్దిమంది దర్శకులు విలన్ పాత్రలపై ప్రత్యేకమైన ప్రేమని కనబరుస్తుంటారు. హీరోని మించి ఆ పాత్రల్ని తీర్చిదిద్దుతుంటారు. ఆయా దర్శకుల సినిమాల్లోని హీరోల గురించి ఎంతగా మాట్లాడుకుంటామో...
కథానాయకుడికి తగిన జోడీ ఎంత ముఖ్యమో... సై అంటే సై అంటూ ఢీ కొట్టే ప్రతినాయకుడూ అంతే కీలకం. సినిమాలో హీరోయిజం పండాలంటే, హీరోకి ప్రత్యర్థిగా కనిపించే విలన్ దీటుగా ఉండాల్సిందే. రాజమౌళి సహా కొద్దిమంది దర్శకులు విలన్ పాత్రలపై ప్రత్యేకమైన ప్రేమని కనబరుస్తుంటారు. హీరోని మించి ఆ పాత్రల్ని తీర్చిదిద్దుతుంటారు. ఆయా దర్శకుల సినిమాల్లోని హీరోల గురించి ఎంతగా మాట్లాడుకుంటామో... విలన్ గురించీ అంతే! ఆ మేజిక్ని చూసి ఇతర దర్శకులూ అదే పద్ధతిని అనురిస్తుంటారు. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ బలమైన విలన్లని ఎంపిక చేసుకుంటున్నారు. అందుకే తెలుగు సినిమాల్లో అటు హిందీ, భోజ్పురి నటులు మొదలుకొని ఇటు బెంగాల్కి చెందిన జిషూ సేన్ గుప్తా వరకు ఎంతోమంది మన హీరోల్ని ఢీ కొట్టేందుకు వస్తున్నారు.
రామ్చరణ్ శంకర్ సినిమాలో నాయిక ఎవరన్నది ఖరారైంది. ఇక తేలాల్సింది ప్రతినాయకుడే. ప్రభాస్ - ప్రశాంత్ నీల్ చేస్తున్న ‘సలార్’లో విలనిజం బాధ్యత ఎవరనేది అధికారికంగా ఖరారు కాలేదు. చిరంజీవి, బాలకృష్ణలకీ విలన్లు కావాలి. కొన్నాళ్లుగా విలన్ ఎంపిక పనిలోనే ఉన్న ఆయా చిత్రబృందాలు ఓ నిర్ణయానికొచ్చాయని పరిశ్రమ వర్గాలు చెప్పుకొంటున్నాయి.
బాలకృష్ణ కోసం విజయ్ సేతుపతి?
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందనున్న ఆ సినిమాలో ప్రతినాయక పాత్ర కోసం తమిళ నటుడు విజయ్ సేతుపతిని సంప్రదించారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘లూసిఫర్’ రీమేక్లో ప్రతినాయకుడిగా ఓ హీరో కనిపిస్తారని తెలిసింది. మలయాళంలో ఆ పాత్రని హిందీ హీరో వివేక్ ఒబెరాయ్ చేశారు. మరి ఆయన్నే తెలుగులో రంగంలోకి దించుతారేమో చూడాలి.
బన్నీ విలన్తోనే చరణ్ ఢీ
విలన్ పాత్రల కోసం కథానాయకుల్నే రంగంలోకి దింపడం కొత్త ట్రెండ్. రానా దగ్గుబాటి, ఆది పినిశెట్టి, ఆర్య తదితరులు ప్రతినాయకులుగా కనిపించి సత్తా చాటిన విషయం తెలిసిందే. ‘పుష్ప’ కోసం మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ వారంలోనే చిత్రీకరణలో పాల్గొనున్నారాయన. బన్నీని ఢీ కొట్టే ఫహాద్ తదుపరి రామ్చరణ్కీ విలన్గా కనిపిస్తారని సమాచారం. రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. దిల్రాజు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో విలన్గా ఫహాద్ ఎంపికయ్యారని తెలిసింది. శంకర్ సినిమాల్లో ప్రతినాయక పాత్రలు ఓ రేంజ్లో ఉంటాయి. మరి ఫహాద్ని శంకర్ ఎలా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఫ్యామిలీమేన్తో ప్రభాస్ ఫైట్!
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రుతిహాసన్ కథానాయిక. ప్రభాస్ డాన్గా కనిపిస్తారని సమాచారం. ఇందులో ఆయన్ని ఢీ కొట్టే ప్రతినాయకుడిగా ‘ఫ్యామిలీమేన్’ ఫేమ్ మనోజ్ బాజ్పాయ్ని ఎంపిక చేశారని సమాచారం. ఇటీవలే హైదరాబాద్లో ఓ కీలక షెడ్యూల్ని చిత్రీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మిరాయ్’ ‘ది బ్లాక్ స్వర్డ్’ గ్లింప్స్.. ఆకట్టుకుంటున్న మంచు మనోజ్ వారియర్ లుక్!
మంచు మనోజ్ (Manchu Manoj), తేజ సజ్జా (Teja Sajja) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సూపర్ ఫ్యాంటసీ సినిమా ‘మిరాయ్’(Mirai). ‘ది సూపర్ యోధ’ అనేది ఉప శీర్షిక. కార్తిక్ ఘట్టమనేని దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ది బ్లాక్ స్వర్డ్’ గ్లింప్స్ను చిత్ర బృందం విడుదల చేసింది.
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
‘బాహుబలి’ తీసేముందు గేయ రచయిత సీతారామశాస్త్రి సలహా తీసుకున్నట్లు రాజమౌళి చెప్పారు. -
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటిహేమ స్పష్టం చేశారు. -
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్
తనను టాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తామని మూవీ టీమ్ బెదిరిస్తున్నట్లు పాయల్ రాజ్పుత్ తెలిపారు. -
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర సంగతులు.. -
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. ఈ వారం కూడా పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాయి. -
కోపం రగిలితే.. మృత్యువుకైనా ముచ్చెమటే!
‘‘దూకే ధైర్యమ జాగ్రత్తా.. రాకే.. ఎగబడి రాకే.. దేవర ముంగిట నువ్వెంతే’’ అంటూ తన వీరత్వాన్ని పరిచయం చేస్తున్నారు ఎన్టీఆర్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. -
తెలుగులో తొలి అడుగులు.. మెరిసేనా!
పాన్ ఇండియా సినిమాలకు చిరునామాగా నిలుస్తోంది తెలుగు చిత్రసీమ. కొన్నేళ్లుగా ఇక్కడి కథలకు, నటులకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. అందుకే ఇప్పుడు ఉత్తరాది తారలూ మన కథల్లో భాగమయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. -
ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తోంది
‘ఈరోజు ప్రపంచమంతా తెలుగు సినిమాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఆదరిస్తోంది. తెలుగు నటీనటులు, దర్శకులకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతోంది. దీన్ని నిలబెట్టుకునేలా దర్శకులు మరిన్ని మంచి చిత్రాలు తీయాల’న్నారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్. -
జులైలో భారతీయుడు 2
కథానాయకుడు కమల్హాసన్.. దర్శకుడు శంకర్ల కలయికలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. వీళ్లిద్దరి నుంచి 1996లో వచ్చిన విజయవంతమైన సినిమా ‘భారతీయుడు’కు కొనసాగింపుగా తెరకెక్కింది. -
తెరపై మ్యాజిక్ సృష్టిస్తా..
‘దర్శకులు నాకు సరిపోయే పాత్రలు ఇస్తే.. తెరపై మ్యాజిక్ చేసి చూపిస్తా’’ అంటోంది బాలీవుడ్ నాయిక సోనాక్షి సిన్హా. ఇటీవలే ‘హీరామండీ:ది డైమండ్ బజార్’తో ప్రేక్షకులను ఆకట్టుకుందీమె. -
నవ్విస్తూ.. కవ్విస్తూ.. కంటతడి పెట్టిస్తూ
‘రాజు యాదవ్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కె.కృష్ణమాచారి తెరకెక్కించారు. అంకిత కారాట్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలోకి రానుంది. -
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఐఆర్జీసీకి ఆప్తుడు.. ఎవరీ హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
-
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
-
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు