Varudu Kaavalenu: అంతటి గొప్ప సినిమా ఇది: నాగశౌర్య

నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. అక్టోబరు 29న ప్రేక్షకుల ముందుకురానుంది.

Published : 23 Oct 2021 23:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. అక్టోబరు 29న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సంగీత్‌ వేడుకని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి పూజా హెగ్డే ముఖ్య అతిథిగా వచ్చారు. వేడుకని ఉద్దేశించి పూజా మాట్లాడుతూ.. ‘ఈ వేడుకకి నన్ను ఆహ్వానించిన వంశీ, చిన్నబాబుగారికి థ్యాంక్స్‌. దర్శకురాలు సౌజన్య చాలా గ్రేట్‌. మంచి సినిమా తెరకెక్కించారు. నాగశౌర్య సెల్ఫ్‌మేడ్‌ యాక్టర్‌. చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌’ అని అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ.. ‘మన కుటుంబం గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామో అంతే గొప్పగా నేను ఈ సినిమా గురించి చెప్పుకుంటాను. అంత గొప్ప సినిమా ఇది’ అని అన్నారు. ‘ప్రేమ, కుటుంబం, అనుబంధాల నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఈ సినిమా అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నా’ అన్నారు రీతూవర్మ.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని