Tollywood Drugs Case: ఈడీ విచారణకు హాజరైన నవదీప్‌

టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో ఈడీ విచారణకు సోమవారం ఉదయం నటుడు నవదీప్‌ హాజరయ్యారు. విచారణ నిమిత్తం నవదీప్‌ ఇప్పటికే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు....

Updated : 13 Sep 2021 12:42 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో ఈడీ విచారణకు సోమవారం ఉదయం నటుడు నవదీప్‌ హాజరయ్యారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించనున్నారు. అనుమానాస్పద లావాదేవీలు, డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాల గురించి ఈడీ అధికారులు ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎఫ్‌క్లబ్‌లో జరిగే పార్టీలకు తరచూ హాజరయ్యే సెలబ్రిటీలెవరు? అక్కడ జరిగే పార్టీల్లో డ్రగ్స్ సరఫరా చేస్తారా? అనే అంశాలపై క్షుణ్ణంగా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఎఫ్‌క్లబ్‌ మేనేజర్‌ని సైతం నేడు ఈడీ అధికారులు విచారించనున్నారు.

కాగా.. మత్తుమందుల కేసులో ఈడీ చేపట్టిన దర్యాప్తు అగమ్యగోచరంగా తయారైనట్లు సమాచారం. ఇప్పటివరకూ పూరీ జగన్నాథ్‌, ఛార్మి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, నందు, రానా, రవితేజలను విచారించినా నిధుల బదిలీపై ఆధారాలేవీ లభించనట్లు తెలుస్తోంది. తమకు కెల్విన్‌ ఎవరో తెలియదని వాళ్లు విచారణలో చెప్పినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని