Shahid Kapoor: ‘సుల్తాన్‌’ దర్శకుడితో కబీర్‌సింగ్‌

‘కబీర్‌సింగ్‌’ భారీ విజయం తర్వాత ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు షాహిద్‌కపూర్‌. ఇటీవలే డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చి దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డీకే

Updated : 14 Nov 2021 07:23 IST

‘కబీర్‌సింగ్‌’ భారీ విజయం తర్వాత ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు షాహిద్‌కపూర్‌. ఇటీవలే డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చి దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో ఓ వెబ్సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌ చిత్రీకరణ పూర్తయింది. తాజాగా ఆయన నుంచి రానున్న కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ‘సుల్తాన్‌’, ‘టైగర్‌ జిందా హై’ లాంటి చిత్రాలతో భారీ విజయాలు అందుకున్న దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని షాహిద్‌ ప్రకటించారు. క్రైమ్‌, యాక్షన్‌ కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది. షాహిద్‌ నటించిన ‘జెర్సి’ థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అలీ అబ్బాస్‌ నుంచి రూపొందించిన ‘తాండవ్‌’ వెబ్‌సిరీస్‌ వివాదాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని