Tollywood: టీఎఫ్సీసీ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్సీసీ) ఎన్నికలు కొనసాగుతున్నాయి. ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికలు జరిగే ఈ ఎన్నికల్లో 2023-25 ఏడాదికి గాను నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఓటింగ్ ద్వారా ఎన్నుకోనున్నారు.
హైదరాబాద్: తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్సీసీ) ఎన్నికలు ముగిశాయి. ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికలు జరిగే ఈ ఎన్నికల్లో 2023-25 ఏడాదికి గాను నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఓటింగ్ ద్వారా ఎన్నుకోనున్నారు. అధ్యక్ష స్థానానికి నిర్మాతలు దిల్ రాజు, సి.కల్యాణ్ పోటీపడుతున్నారు. ఫిల్మ్ ఛాంబర్ మనుగడ, భవిష్యత్ తరాలకు మంచి సినీ పరిశ్రమను అందిద్దామనే నినాదంతో దిల్ రాజు ప్యానెల్.. చిన్నసినిమాల మనుగడ, డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల ఛార్జీల తగ్గింపు హామీలతో సి.కల్యాణ్ ప్యానెల్ బరిలో నిలిచాయి. ఇప్పటికే ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి 16 మంది ఈసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, స్టూడియోల యజమానులు సహా సుమారు 2వేలకు పైగా టీఎఫ్సీసీలో సభ్యులుగా ఉన్నారు. నిర్మాతల సెక్టార్ నుంచి సుమారు 1500 మంది, డిస్ట్రిబ్యూటర్ల నుంచి 500, స్టూడియోల నుంచి 98 మంది సభ్యులుగా ఉన్నారు. వారు ఒక్కొక్కరిగా వచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3గంటల వరకూ క్యూలైన్లోఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.
సినీ ప్రముఖులు సురేశ్బాబు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, రాఘవేంద్రరావు, శ్యాంప్రసాద్ రెడ్డి, సుప్రియ, పోసాని కృష్ణమురళి, బండ్ల గణేశ్, జీవిత తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈవీఎంల ద్వారా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తొలుత పలు ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కాసేపు నిలిచిపోయింది. ఆ తర్వాత సిబ్బంది ఆ సమస్యలను పరిష్కరించడంతో పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. టీఎఫ్సీసీ ఎన్నికల నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ ప్రాంగణం సందడిగా మారింది. మధ్యాహ్నం 3 గంటల వరకు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఫిల్మ్ ఛాంబర్లో ఫలితాలను ప్రకటించనున్నారు.
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఎన్నికల తీరుపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విస్మయం వ్యక్తం చేశారు. ఛాంబర్ ఎన్నికలను చూస్తుంటే ఏడవాలో నవ్వాలో అర్థం కావడం లేదన్నారు. సభ్యులు ఎందుకు పోటీపడుతున్నారో తెలియడం లేదన్నారు. ఫిల్మ్ ఛాంబర్ లోపలి వాతావరణం చూస్తే ఫిల్మ్ ఛాంబర్ ఎదిగిందని సంతోషపడాలో లేక సాధారణ ఎన్నికలను తలపిస్తున్నందుకు సిగ్గేస్తుందన్నారు. ఫిల్మ్ ఛాంబర్ సినీ పరిశ్రమలోని అన్ని సెక్టార్స్ కు మంచి చేయడానికి ఉందని, తాను తన తండ్రి ఛాంబర్ కోసం పనిచేశామని పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితి భవిష్యత్ లో ఎదురుకావద్దని తమ్మారెడ్డి హితవు పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
రాజమౌళి-మహేశ్ల ప్రాజెక్ట్కు సంబంధించి వస్తున్న కథనాలపై నిర్మాణ సంస్ధ క్లారిటీ ఇచ్చింది. -
ఖాన్సార్ మరింత ఎరుపెక్కేలా.. ‘సలార్2’లో మరో విలన్గా మలయాళ నటుడు
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ‘సలార్2: శౌర్యంగపర్వం’లో మరో మలయాళ నటుడు వచ్చి చేరారు. -
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎమర్జెన్సీ’(Emergency). ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. -
‘దేవర ముంగిట నువ్వెంత’: ఎన్టీఆర్ మూవీ సాంగ్పై నిర్మాత ఆసక్తికర ట్వీట్
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. ఈ సినిమా తొలి గీతంపై నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ప్రేక్షకులు చాలా స్మార్ట్.. ‘పుష్ప’ పాత్రను అలా ఏమీ చూడరు: అల్లు అర్జున్
‘పుష్ప’లో తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అల్లు అర్జున్. -
ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే.. ఇటు ఫన్.. అటు థ్రిల్
ఈ వారం థియేటర్లో, ఓటీటీల్లో సందడి చేసేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. అవేంటంటే? -
‘డబుల్ ఇస్మార్ట్’.. డబుల్ ఇంపాక్ట్.. అప్డేట్ ఇచ్చిన చిత్ర బృందం
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’కు సంబంధించి చిత్రబృందం అప్డేట్ ఇచ్చింది. -
‘కల్కి’ సీజీ వర్క్పై నిర్మాత ఫన్నీ పోస్ట్.. నాగ్ అశ్విన్ ఏమన్నారంటే!
‘కల్కి’ సీజీ వర్క్పై నిర్మాత ఫన్నీ పోస్ట్ పెట్టారు. -
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
Raja Saab: ప్రభాస్, మారుతీ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్ర షూటింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. -
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మరోసారి వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ ఇదే..
విశ్వక్సేన్ హీరోగా రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా మరోసారి వాయిదా పడింది. -
‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్.. ఈసారి హైఓల్టేజ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో..
Sundeep Kishan: సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించిన ‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్గా ‘మాయ-వన్’ రాబోతోంది -
‘కన్నప్ప’లో ప్రభాస్.. అప్డేట్ ఇచ్చిన మంచు విష్ణు
‘కన్నప్ప’ సినిమా క్రేజీ అప్డేట్ ఇచ్చారు హీరో మంచు విష్ణు. అదేంటంటే? -
కమల్ హాసన్ సినిమాలో బాలీవుడ్ హీరో.. గౌరవంగా ఉందంటూ పోస్ట్
కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’లో బాలీవుడ్ హీరో అలీ ఫజల్ కీలకపాత్రలో నటిస్తున్నారు. -
విజయ్ దేవరకొండ బర్త్డే స్పెషల్.. మూడు సినిమాల అప్డేట్స్ ఇవే..
విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. -
గుడ్న్యూస్ చెప్పిన రష్మిక.. మరో భారీ ప్రాజెక్ట్తో రెడీ
నటి రష్మిక తన అభిమానులకు గుడ్న్యూస్ చెప్పారు. మరో క్రేజీ ప్రాజెక్ట్లో అవకాశమం వచ్చినట్లు తెలిపారు. -
‘ఆరంభం’ టీమ్ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంది: వెంకటేష్ మహా
‘ఆరంభం’ సినిమా మే10న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’లపై ప్రశాంత్ నీల్ అప్డేట్ ఇచ్చారు. దీంతో సినీప్రియులు ఆనందిస్తున్నారు. -
‘సలార్’లో పాత్రపై ఊహించని అప్డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్
‘సలార్’లో తన పాత్రపై పృథ్వీరాజ్ సుకుమారన్ అప్డేట్ ఇచ్చారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. -
‘దేవర’ ఎన్టీఆర్కు ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది: కొరటాల శివ
‘దేవర’ సినిమా ఎన్టీఆర్కు ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని కొరటాల శివ అన్నారు. -
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
‘కుబేర’ కోసం ధనుష్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గతవారం వైవిధ్యమైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరించగా, మే రెండో వారంలో చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి థియేటర్తో పాటు, ఓటీటీలో వస్తున్న చిత్రాలేంటో చూసేయండి.
తాజా వార్తలు (Latest News)
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365
-
తెదేపాకు ఓటేశాడని.. కొడవలితో చెవి కోసేశాడు
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM