TS High Court: ‘వ్యూహం’ సెన్సార్‌ సర్టిఫికెట్‌పై సస్పెన్షన్‌ పొడిగింపు

రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘వ్యూహం’ సినిమా సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ సస్పెన్షన్‌ను తెలంగాణ హైకోర్టు పొడిగించింది.

Updated : 22 Jan 2024 11:34 IST

హైదరాబాద్‌: రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘వ్యూహం’ సినిమా సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ సస్పెన్షన్‌ను తెలంగాణ హైకోర్టు పొడిగించింది. మరో మూడు వారాల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డు నిపుణుల కమిటీని హైకోర్టు ఆదేశించింది. మూడు వారాల్లోపు చిత్రానికి సంబంధించిన కొత్త సెన్సార్ సర్టిఫికెట్ జారీ విషయంలో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.

‘వ్యూహం’ సినిమాకు సీబీఎఫ్‌సీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను నిలిపివేస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ తరఫు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఏపీలో ఎన్నికలపై ప్రభావం ఉంటుందనుకుంటే తెలంగాణలోనైనా విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసేలా చిత్రీకరించిన ‘వ్యూహం’ సినిమా ప్రదర్శనకు సీబీఎఫ్‌సీ ధ్రువీకరణ పత్రం జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ లోకేశ్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని