Veera Simha Reddy: ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్.. ఒంగోలులో ట్రాఫిక్ ఆంక్షలు
పోలీసుల ఆంక్షల నడుమ ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సర్వం సిద్ధమవుతోంది. శుక్రవారం సాయంత్రం ఒంగోలులో జరగనున్న ఈ ఈవెంట్లో చిత్రబృందం, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు.
ఇంటర్నెట్డెస్క్: నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy) ప్రీ రిలీజ్ వేడుకకు ఒంగోలులోని బీఎంఆర్ వెంచర్స్ సిద్ధమవుతోంది. చిత్ర నటీనటులతోపాటు భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొననున్న ఈ కార్యక్రమం కోసం శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఈ వేడుకను దృష్టిలో ఉంచుకుని ఒంగోలు పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి కోసం మంగమ్మ కాలేజీ, మార్కెట్ యార్డ్ల్లో పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు.
ఉత్కంఠ నడుమ..!
‘వీరసింహారెడ్డి’ ముందస్తు విడుదల వేడుక ఈనెల 6న (శుక్రవారం) సాయంత్రం నిర్వహించాలని చిత్రబృందం నిర్ణయించుకున్నప్పటి నుంచి అభిమానులు ఆశగా ఎదురుచూశారు. తర్జనభర్జనలు, తీవ్ర ఉత్కంఠ నడుమ త్రోవగుంట సమీపంలోని బీఎంఆర్ అర్జున్స్ ఇన్ఫ్రా సంస్థకు చెందిన స్థలంలో కఠిన నిబంధనల నడుమ వేడుకకు పోలీసులు అనుమతినిచ్చారు. తొలుత ఈ కార్యక్రమాన్ని స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఏబీఎం కళాశాల మైదానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోగా పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. నిర్వహణ బాధ్యతలు చూసే శ్రేయాస్ మీడియా ప్రతినిధులు ఎస్పీ మలికా గార్గ్తో సమావేశమయ్యారు. అర్జున్స్ ఇన్ఫ్రా సంస్థకు చెందిన 17 ఎకరాల స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించి ఇక్కడ ఏర్పాటుకు అనుమతి కోరారు. బుధవారం రాత్రంతా తర్జనభర్జనలు జరిగాయి. చివరకు వేడుక నిర్వహణకు మౌఖిక ఉత్తర్వులు ఇచ్చిన అధికారులు పార్కింగ్ ప్రదేశాలు, ఇతర అంశాలపై మెలిక పెట్టారు. గురువారం ఉదయం నుంచి పనులు ఆరంభించిన నిర్వాహకులు సాయంత్రానికి ప్రధాన వేదిక, లైటింగ్, ఎల్ఈడీ తెరలు, బారికేడ్లు, వివిధ గ్యాలరీల నిర్మాణాలు చేపట్టారు. అదనపు ఎస్పీ(అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఒంగోలు డీఎస్పీ నాగరాజు, దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి సందర్శించి పలు సూచనలు చేశారు. సుమారు వెయ్యి మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు.. రూ.15 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని సూచించారు. అనుమతించిన సంఖ్య కంటే అదనంగా ప్రేక్షకులను లోపలికి రానివ్వకూడదని, అక్కడ జరిగే ప్రతి విషయానికీ నిర్వాహకులే బాధ్యత వహించాలని స్పష్టంచేశారు. నిర్వాహకులు జారీ చేసిన పాసులు ఉన్నవారికి మాత్రమే ప్రాంగణంలోకి అనుమతి ఉంటుందని.. వాటికి కూడా స్థానిక పోలీసుల స్టాంపింగ్ తప్పనిసరని పేర్కొన్నారు. ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల ఏర్పాటుతో పాటు వివిధ గ్యాలరీలకు పటిష్టమైన బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని.. బాణసంచా కాల్చకూడదని సూచించారు. వేడుకలకు పోలీసు భద్రత ఉంటుందని.. అయితే నిర్వాహకులు సైతం తగిన సంఖ్యలో బౌన్సర్లు, వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. చిన్నారులు, వృద్ధులను ప్రాంగణంలోకి అనుమతించకూడదని.. సినిమాకు సంబంధించి మినహా, మరే ఇతర రెచ్చగొట్టే నినాదాలు చేయకూడదని నిబంధనలు విధించారు.
ట్రైలర్ రానుంది..!
మాస్ యాక్షన్, ఫ్యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘వీర సింహారెడ్డి’ ట్రైలర్ను ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ట్రైలర్ విడుదల జరగనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. దీంతో నందమూరి అభిమానులు సోషల్మీడియా వేదికగా కౌంట్డౌన్ మొదలు పెట్టారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈసినిమా కోసం బాలకృష్ణ, శ్రుతిహాసన్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ఈ సినిమా విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
పెళ్లిపై నటి వరలక్ష్మీ శరత్కుమార్ ఓ వీడియో క్రియేట్ చేశారు. దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన రణ్వీర్ సింగ్
రణ్వీర్ సింగ్ తన ఇన్స్టా నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. -
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. -
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్పెట్టారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
ఎన్నికల తర్వాత కూడా తాను ఇండస్ట్రీలోనే కొనసాగుతానని కంగనా స్పష్టం చేశారు. -
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
తన గురువు సుకుమార్కి బుచ్చిబాబు సానా ప్రేమ లేఖ రాశారు. నెట్టింట అది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. -
‘పుష్ప’ తర్వాత ఎలాంటి మార్పు రాలేదు: ఫహాద్ ఫాజిల్
‘పుష్ప’ తర్వాత తన కెరీర్లో ఎలాంటి మార్పు రాలేదని నటుడు ఫహాద్ ఫాజిల్ అన్నారు. -
‘యానిమల్’తో పోలుస్తూ ‘రానా నాయుడు’పై రానా కామెంట్..
‘యానిమల్’ విడుదలయ్యాక ‘రానా నాయుడు’ చాలామందికి మంచి సిరీస్లా కనిపించిందని రానా అన్నారు. -
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
సిద్ధార్థ్తో తన రిలేషన్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి ఓపెన్ అయ్యారు. -
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
‘ఆర్య’ విడుదలై 20 ఏళ్లు పుర్తయిన సందర్భంగా అల్లుఅర్జున్ పోస్ట్ పెట్టారు. -
పవన్ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ది అని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది. -
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా సుశాంత్ ఏమన్నారంటే? -
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హీరామండి’ నటుడు
‘హీరామండి’లో సోనాక్షీతో తన సన్నివేశాల గురించి నటుడు ఇంద్రేష్ మాలిక్ స్పందించారు. -
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
సమంత (Samantha) ఒక ఫొటో షేర్ చేసి డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM