Venkatesh: ప్రతీదీ.. తొలి చిత్రమే!
‘‘కష్టపడి సినిమా చేయడం.. ప్రేక్షకుల నిర్ణయానికి వదిలేయడం... నా ప్రయాణం ఈ తరహాలోనే ఉంటుంది. బాక్సాఫీస్ లెక్కల్ని నమ్మను కానీ.. నిర్మాతకి మాత్రం కచ్చితంగా డబ్బు రావాల్సిందే. సెట్కి వెళ్లినప్పుడు ఆ కోణంలోనే ఆలోచిస్తుంటా’’....
‘‘కష్టపడి సినిమా చేయడం.. ప్రేక్షకుల నిర్ణయానికి వదిలేయడం... నా ప్రయాణం ఈ తరహాలోనే ఉంటుంది. బాక్సాఫీస్ లెక్కల్ని నమ్మను కానీ.. నిర్మాతకి మాత్రం కచ్చితంగా డబ్బు రావాల్సిందే. సెట్కి వెళ్లినప్పుడు ఆ కోణంలోనే ఆలోచిస్తుంటా’’ అంటున్నారు అగ్ర కథానాయకుడు వెంకటేష్. వినోదం పంచడంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలి ఉందని నిరూపించిన కథానాయకుడాయన. ‘ఎఫ్2’తో నవ్వులు పండించిన ఆయన... ‘ఎఫ్3’లో రేచీకటి బాధితుడిగా కనిపించనున్నారు. వరుణ్తేజ్తో కలిసి ఆయన నటించిన ‘ఎఫ్3’ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘ఎఫ్3’ ప్రచార చిత్రాలు చూస్తుంటే ‘ఎఫ్2’ కంటే హుషారుగా నటించినట్టు అనిపిస్తోంది. మీరేమంటారు?
‘ఎఫ్2’ తర్వాత నేనెక్కడైనా కనిపిస్తే కుటుంబమంతా వచ్చి పలకరిస్తుంటారు. తల్లిదండ్రులు వచ్చి మాట్లాడతారేమో అనుకుంటే... వాళ్ల పిల్లలు వచ్చి ‘ఎఫ్2’ని అన్ని సార్లు చూశాం, ఇన్నిసార్లు చూశామని నా మేనరిజమ్స్ని ప్రదర్శించి చూపిస్తుంటారు. వాళ్లంతా నా ‘బొబ్బిలిరాజా’ చూసినవాళ్లు కాదు, నా ‘ప్రేమించుకుందాం రా’ చూసినవాళ్లూ కాదు. తర్వాత తరం పిల్లలు. వాళ్లకి కూడా ఇది నచ్చిందని తెలిసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంటుంది. నటుడిగా నేను ఈతరంలోకి కూడా ప్రవేశించాను కదా అని మరింత నమ్మకం కలుగుతుంటుంది.
కామెడీ కథల్లో నటిస్తున్నప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉంటాయి?
ప్రతి సినిమా నాకు తొలి సినిమానే. కొన్ని వారాలపాటు అదే ఆలోచనతోనే ఉంటూ పనిచేస్తుంటా. కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. మనసులో ఏదీ పెట్టుకోకుండా స్వేచ్ఛగా ఉండాలి. అప్పుడే ఆ హావభావాలు పండుతాయి. నేను హీరోని, వెంకటేష్ని అనే విషయాల్ని మనసులో ఎప్పుడూ పెట్టుకోను. సహజంగా ఉంటాను. వినోదాన్ని ఆస్వాదిస్తూ పనిచేస్తాను. ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’, ‘అబ్బాయిగారు’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’... ఈ సినిమాలన్నీ అలా చేసినవే. నాలోని ఆ లక్షణమే దర్శకులకి నచ్చుతుందేమో. అందుకే వాళ్లు ఇలాంటి వినోదాత్మకమైన కథలతో నన్ను సంప్రదిస్తుంటారు.
‘దృశ్యం2’, ‘నారప్ప’ గాఢతతో కూడిన కథలు. వాటి తర్వాత ఈ సినిమా చేయడం మరింత సులభంగా అనిపించిందేమో కదా?
అవి వేరే మూడ్లో సాగే సినిమాలు. ఇది భిన్నమైన కథ. ఎందుకో కామెడీ చేయాలని సెట్స్కి వెళ్లినప్పుడు ఏదో మేజిక్ జరుగుతుంది. క్రేజీగా అనిపిస్తుంది, వెంటనే ఓ రకమైన ఉత్సాహంతో పనిచేస్తుంటా. బయట కూడా నేను స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ ఓ జోకర్లాగా, సరదాగా గడుపుతుంటా. ఆ ఉత్సాహం అలా ఉంటుంది, నా చుట్టుపక్కలవాళ్లు కూడా అలా ప్రోత్సహిస్తుంటారు. ఆ రెండు సినిమాలు ఓటీటీలో విడుదల కావడంతో చాలా మంది చూడలేదు. ఇప్పుడు థియేటర్లో ఈ సినిమా విడుదల కానుండడంపై చాలా సంతోషంగా ఉన్నా. ఇలాంటి నాన్స్టాప్ వినోదాత్మక సినిమాల్ని ఎక్కువమంది మధ్య చూడటంలో ఓ కిక్ ఉంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చూస్తున్నప్పుడు ఆ హంగామానే వేరు. ఇప్పటికే ‘ఎఫ్2’ పాత్రల్ని ప్రేక్షకులు సొంతం చేసుకున్నారు కాబట్టి, ‘ఎఫ్3’లో ఆ వినోదాన్ని రెండింతలు, మూడింతలుగా ఆస్వాదిస్తారు. తొలిసారి రేచీకటి బాధితుడిగా ఓ మంచి పాత్రని చేశా.
డబ్బు చుట్టూ తిరిగే కథ కదా, డబ్బు గురించి మీరేం చెబుతారు?
మానవుల్లో ఆశ సహజం. అది తప్పేం కాదు. కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఏదీ వేగంగా, సులభంగా, అడ్డ దారుల్లో రాదని! అది తెలుసుకోకుండా ప్రతి ఒక్కరూ వేగంగా సంపాదించాలని చూస్తుంటారు. ఆ అవకాశాలు లేనప్పుడు వాడే కొత్తగా ఏదో సృష్టించి, ఇంకో సమస్యని ఎదుర్కొంటాడు. ఆ క్రమంలో కొన్ని కొత్త పాఠాలు నేర్చుకోవాలి. లేదంటే దాని పర్యవసనాలు ఎదుర్కొంటూనే ఉంటాడు. సరైన మార్గంలో సరైన పనులు చేస్తున్నప్పుడు నిజంగా మనకు ఏది అవసరమో, దేనికి అర్హులమో అదే ఇస్తుంది ఈ విశ్వం అని నమ్ముతాన్నేను.
ఈమధ్య వస్తున్న సినిమాలు, పాన్ ఇండియా ట్రెండ్పై మీ అభిప్రాయమేమిటి?
విభిన్నమైన సినిమాలొస్తున్నాయి. అయితే ఏ విషయం గురించీ ఎక్కువగా ఆలోచించకూడదు. ప్రతి సినిమా ప్రత్యేకమైనదే. ఇక్కడ ప్రేక్షకులు ముఖ్యం, వాళ్లని గౌరించాలి. మనం ఏం చేసినా వాళ్లకు నచ్చాలి. ట్రెండ్ పేరుతో నేను ఆటలు ఆడను, చూస్తానంతే. పాన్ ఇండియా చిత్రాలైనా, ఇంకేదైనా మంచి బృందం కుదరాలి. అలాంటివి కుదిరినప్పుడు మాత్రం వదులుకోకూడదు.
కామెడీ పరంగా మీపై ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది? దర్శకుడు అనిల్ రావిపూడి పనితీరు గురించి ఏం చెబుతారు?
‘మసాలా’ సినిమాకి రచయితగా పని చేసినప్పట్నుంచి అనిల్ని గమనిస్తున్నా. సింపుల్గా రాస్తాడు, అతని సంభాషణలు కూడా సహజమైన నటనని ప్రదర్శించేందుకు దోహదం చేస్తుంటాయి. ఈవీవీ, శ్రీనువైట్ల... వీళ్లందరిని పోలిన టైమింగ్ అతనిలో ఉంటుంది. అనిల్లోని స్పష్టత నాకు బాగా నచ్చుతుంది. కామెడీ పరంగా నాపై చాలామంది ప్రభావం ఉంది. నేను యువకుడిగా ఉన్న రోజుల్లో అల్లు రామలింగయ్య నటన, ఆయన సంభాషణలు చెప్పే విధానం భలే నచ్చేది. ఆ తర్వాత జానీలీవర్. ఇలా కొంతమంది మాట్లాడే విధానంలోనే కామెడీ పండుతుంటుంది. నేనూ డబ్బింగ్లో ఆ తరహా ప్రయత్నం చేస్తుంటా. అలా ఒకరని కాదు, చాలా మంది ప్రభావమే ఉంటుంది. నేను మంచి విద్యార్థిని. పరిసరాల్ని, మనుషుల్ని సునిశితంగా పరిశీలిస్తుంటా. అది నటించేటప్పుడు చాలా మేలు చేస్తుంటుంది.
మల్టీస్టారర్ సినిమాలపై మీ అభిప్రాయమేమిటి? వరుణ్తేజ్తో కలిసి చేసిన ప్రయాణం గురించి ఏం చెబుతారు?
కథలు బాగుంటే అందరితోనూ చేస్తాను. అలాంటి సినిమాలు ఆడినా ఆడకపోయినా కథ ఆసక్తికరంగా ఉంటే కచ్చితంగా చేయాల్సిందే. మరొక హీరోతో కలిసి పనిచేయడాన్ని నేను బాగా ఆస్వాదిస్తుంటా. వరుణ్తేజ్తో కలిసి చేసిన ఈ ప్రయాణం అద్భుతం అనిపించింది. మా కలయికలో వచ్చిన తొలి సినిమా ప్రయాణాన్ని ఆస్వాదించారంతా. ‘ఎఫ్3’లో వరుణ్ పాత్ర ఇంకా బాగుంటుంది.
రానాతో కలిసి నెట్ఫ్లిక్స్లో వెబ్సిరీస్ చేశారు. ఏదైనా షో చేసే ఆలోచన ఉందా?
కొవిడ్ సమయంలో రానా నెట్ఫ్లిక్స్ షో గురించి చెప్పాడు. అద్భుతంగా అనిపించింది. దక్షిణాదిలో ఆ తరహా సిరీస్ ఎవ్వరూ చేయలేదు. అప్పుడు చేతిలో వేరే పని కూడా లేదు కాబట్టి చేశాం. కెరీర్లో తొలిసారి ఓ భిన్నమైన పాత్రలో కనిపిస్తా. ఇక షోస్ గురించి కూడా సంప్రదించారు కానీ నేనే చేయలేదు. ఏదైనా ఓ డైలాగ్ ఇచ్చి రెండు మూడుసార్లు అదే చెప్పమంటే నావల్ల కాదు. ఏదైనా సింగిల్ టేక్లోనే చేయడానికి ఇష్టపడతాను. షోస్ చేయడానికి అదే ఇబ్బంది.
తదుపరి మీరు చేయబోయే సినిమాల విశేషాలేమిటి?
సితార, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థల్లో సినిమాలు చేస్తున్నా. సల్మాన్ఖాన్తో కలిసి నటించే సినిమా మొదలవబోతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఓటీటీలోకి ‘డియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జి.వి.ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్’. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!