Vishal: 19ఏళ్ల కెరీర్లో 12 పెళ్లిళ్లు చేశారు.. అందుకే తొలిసారి ట్వీట్ చేశా: నటుడు విశాల్
ఇటీవల లక్ష్మీ మేనన్ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలతో పాటు, జాతీయ అవార్డులపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు నటుడు విశాల్ వివరణ ఇచ్చారు.
ఇంటర్నెట్డెస్క్: సల్మాన్ఖాన్ పెళ్లి చేసుకున్న తర్వాత తాను కూడా చేసుకుంటానని సినీ నటుడు విశాల్ (Vishal) అన్నారు. ఆయన కథానాయకుడిగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన టైమ్ ట్రావెల్ మూవీ ‘మార్క్ ఆంటోనీ’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ ఆంగ్ల మీడియాకు వచ్చిన ఇంటర్వ్యూలో విశాల్ మాట్లాడారు. ‘పెళ్లెప్పుడు’ అన్న ప్రశ్నకు పైవిధంగా స్పందించారు. ప్రతి దానికి ఒక సమయం ఉంటుందని అన్నారు.
‘‘సాధారణంగా నేను వివాదాలపై స్పందించను. ఇటీవల తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ట్వీట్ చేశాను. నటి లక్ష్మీ మేనన్ను నేను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది నాకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, అవతలి అమ్మాయి భవిష్యత్ కూడా ఉంది. నేను స్పందించకపోతే, ఆమె వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది. నా గురించి ఏ విషయమైనా మీరు ఫోన్ చేసి అడగవచ్చు. గతంలో చాలా మందిని పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు రాశారు. నిజం చెప్పాలంటే నా 19ఏళ్ల కెరీర్లో ఇప్పటివరకూ 12మందిని పెళ్లి చేసుకున్నట్లు రాశారు. చిన్నప్పటి నుంచి నాకు సంబంధించిన విషయాలు పేపర్లో వస్తే, కట్ చేసి భద్రపరచడం మా నాన్నగారికి అలవాటు. అలా ఒకరోజు ఏదో పేపర్ కట్ చేస్తుంటే, ‘ఏం చేస్తున్నారు’ అని అడిగా, ‘లక్ష్మీ మేనన్తో నీకు పెళ్లి అని వార్త వచ్చింది’ అన్నారు. అలా ఆ విషయం నాకు తెలిసింది. హీరోయిన్లలో నాకు మంచి స్నేహితులు ఉన్నారు. ఎప్పుడైనా భోజనానికో, సినిమాకో వెళ్దామని వాళ్లు అడిగితే, నేను వద్దనే చెబుతాను. బయట జంటగా కనిపిస్తే, డేటింగ్లో ఉన్నామని వార్తలు రాసేస్తారు. అందుకే మా ఇంట్లో భోజనం చేసి, సరదాగా కబుర్లు చెప్పుకొంటాం. తెలుగు ఇండస్ట్రీలోనూ రానా, నితిన్, నాని నాకు క్లోజ్ ఫ్రెండ్స్’’అని విశాల్ చెప్పుకొచ్చారు.
గతంలో జాతీయ అవార్డులపై తాను చేసిన వ్యాఖ్యలకు కూడా విశాల్ వివరణ ఇచ్చారు. అవార్డులకు తాను వ్యతిరేకంగా కాదని తెలిపారు. ‘‘జాతీయ అవార్డులను కించ పరిచేలా నేనెప్పుడూ వ్యాఖ్యలు చేయను. అవార్డులు ఇచ్చే విషయంలో నా దృష్టి కోణం అది. అసలు అవార్డులపై నాకు నమ్మకం లేదు. అవార్డైనా, రివార్డైనా ప్రేక్షకులు ఇచ్చేది. సినిమా పరిశ్రమకు ప్రతి శుక్రవారం రివార్డు అనేది ఉంటుంది. ప్రేక్షకులు ఆదరించబట్టే నేను, నా కుటుంబం మూడు పూటలా తినగలుగుతున్నాం. వచ్చిన నామినేషన్స్లో నుంచి ఫలానా వ్యక్తి ఉత్తమ నటుడు అని, కోట్ల మంది అభిప్రాయాన్ని పది, పన్నెండు మంది కూర్చొని ఎలా నిర్ణయిస్తారు. 40 కోట్ల మంది అభిప్రాయాన్ని నలుగురు ఎలా డిసైడ్ చేస్తారు’’ అని విశాల్ అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
పెళ్లిపై నటి వరలక్ష్మీ శరత్కుమార్ ఓ వీడియో క్రియేట్ చేశారు. దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన రణ్వీర్ సింగ్
రణ్వీర్ సింగ్ తన ఇన్స్టా నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. -
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. -
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్పెట్టారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
ఎన్నికల తర్వాత కూడా తాను ఇండస్ట్రీలోనే కొనసాగుతానని కంగనా స్పష్టం చేశారు. -
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
తన గురువు సుకుమార్కి బుచ్చిబాబు సానా ప్రేమ లేఖ రాశారు. నెట్టింట అది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. -
‘పుష్ప’ తర్వాత ఎలాంటి మార్పు రాలేదు: ఫహాద్ ఫాజిల్
‘పుష్ప’ తర్వాత తన కెరీర్లో ఎలాంటి మార్పు రాలేదని నటుడు ఫహాద్ ఫాజిల్ అన్నారు. -
‘యానిమల్’తో పోలుస్తూ ‘రానా నాయుడు’పై రానా కామెంట్..
‘యానిమల్’ విడుదలయ్యాక ‘రానా నాయుడు’ చాలామందికి మంచి సిరీస్లా కనిపించిందని రానా అన్నారు. -
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
సిద్ధార్థ్తో తన రిలేషన్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి ఓపెన్ అయ్యారు. -
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
‘ఆర్య’ విడుదలై 20 ఏళ్లు పుర్తయిన సందర్భంగా అల్లుఅర్జున్ పోస్ట్ పెట్టారు. -
పవన్ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ది అని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది. -
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా సుశాంత్ ఏమన్నారంటే? -
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హీరామండి’ నటుడు
‘హీరామండి’లో సోనాక్షీతో తన సన్నివేశాల గురించి నటుడు ఇంద్రేష్ మాలిక్ స్పందించారు. -
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
సమంత (Samantha) ఒక ఫొటో షేర్ చేసి డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్