TANA: తానా తదుపరి అధ్యక్షుడిగా నరేన్ కొడాలి
తానా తదుపరి అధ్యక్షుడిగా నరేన్ కొడాలి ఎన్నికయ్యారు. జనవరి 18న ప్రకటించిన ఫలితాల ప్రకారం అన్ని జాతీయ పదవులను నరేన్ టీమ్ చేజిక్కించుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: అనూహ్య మలుపులతో రెండేళ్లపాటు కొనసాగిన ‘తానా’ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. ఉత్కంఠగా సాగిన తానా ఎన్నికల్లో నరేన్ కొడాలి టీమ్ ఘన విజయం సాధించింది. తదుపరి తానా అధ్యక్షుడిగా వర్జీనియాకు చెందిన నరేన్ కొడాలి గెలుపొందారు. జనవరి 18న ప్రకటించిన ఫలితాల ప్రకారం అన్ని జాతీయ పదవులను నరేన్ బృందమే చేజిక్కించుకుంది. సుమారు మూడు వేల ఓట్ల ఆధిక్యంతో సతీష్ వేమూరిపై నరేన్ కొడాలి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఘన విజయం సాధించారు. బోర్డు డైరెక్టర్లుగా లావు శ్రీనివాస్, రవి పొట్లూరి, మల్లి వేమన గెలుపొందారు. సెక్రటరీగా రాజా కసుకుర్తి, కోశాధికారిగా భరత్ మద్దినేని, జాయింట్ సెక్రెటరీగా వెంకట్ కోగంటి, జాయింట్ కోశాధికారిగా సునీల్ పాంత్రా ఎన్నికయ్యారు.
గత రెండేళ్లుగా ఒడుదొడుకుల నేపథ్యంలో ఒకసారి ఎన్నికలు రద్దయిన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికలతో పూర్తిస్థాయిలో కార్యవర్గం ఏర్పడింది. రద్దయిన మొదటి ఎన్నికల్లో నరేన్ కొడాలికి ప్రత్యర్థిగా నిలిచిన శ్రీనివాస్ గోగినేని.. తాజా ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగి నరేన్ ప్యానెల్కు మద్దతివ్వడం గమనార్హం. ఈ విజయానికి తానా మునుపటి అధ్యక్షులు గంగాధర్ నాదెళ్ల, జయరాం కోమటి, సతీష్ వేమన, అంజయ్య చౌదరి లావు, మోహన్ నన్నపనేని తదితరులు కృషి చేశారు.
తానా ఎన్నికల ఫలితాలు ఇవే..
- ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్
- నరేన్ కొడాలి - 13,225 (విజయం)
- సతీష్ వేమూరి - 10,362
- బోర్డు డైరెక్టర్లు
- లావు శ్రీనివాస్ - 12,695 (విజయం)
- రవి పొట్లూరి- 13,044 (విజయం)
- సురీష తూనుగుంట్ల - 11,237
- మల్లి వేమన - 11,774 (విజయం)
- శ్రీనివాస్ ఉయ్యూరు - 10,520
- వెంకట రమణ యార్లగడ్డ- 10,131
- కార్యదర్శి
- రాజా కసుకుర్తి - 12,456 (విజయం)
- అశోక్ కొల్లా - 11,083
- కోశాధికారి
- భరత్ మద్దినేని - 12,827 (విజయం)
- మురళి తాళ్లూరి - 10,617
- జాయింట్ సెక్రటరీ
- వెంకట్ కోగంటి - 13,015 (విజయం)
- వంశీ వాసిరెడ్డి - 10,501
- జాయింట్ ట్రెజరర్
- సునీల్ పంత్రా - 13,013 (విజయం)
- శశాంక్ యార్లగడ్డ - 10,463
- కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్
- రజినీ ఆకురాటి - 10,177
- లోకేష్ కొణిదెల - 13,362(విజయం)
- సాంస్కృతిక సేవా సమన్వయకర్త
- రజనీకాంత్ కాకర్ల - 10,854
- ఉమా ఆర్ కాటికి - 12,638(విజయం)
- మహిళా సేవల సమన్వయకర్త
- సోహిని అయినాల- 12,009(విజయం)
- మాధురి యేలూరి - 11,436
- కౌన్సిలర్ ఎట్ లార్జ్
- ప్రదీప్ గడ్డం - 10,590
- సతీష్ కొమ్మన - 12,827(విజయం)
- అంతర్జాతీయ సమన్వయకర్త
- శ్రీధర్ కొమ్మాలపాటి - 10,168
- ఠాగూర్ మల్లినేని - 13,300(విజయం)
- స్పోర్ట్స్ సమన్వయకర్త
- శ్రీరామ్ ఆలోకం - 10,213
- నాగ పంచుమూర్తి -13,261(విజయం)
- ఫౌండేషన్ ట్రస్టీ
- రామకృష్ణ అల్లు - 12,515 (విజయం)
- భక్త బల్లా - 13,552 (విజయం)
- శ్రీనివాస్ కూకట్ల - 12,286(విజయం)
- సత్యనారాయణ మన్నె -11,196
- రవికిరణ్ మువ్వ - 10,490
- నాగరాజు నలజుల - 9,883
- సుమంత్ రామ్ - 9,643
- రవి సామినేని - 10,148
- రాజా సూరపనేని - 13,170(విజయం)
- ఎండూరి శ్రీనివాస్ - 12,261(విజయం)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు.