తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వినూత్నంగా ‘తెలుగు భాషా దినోత్సవం’
వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వేంకట రామమూర్తి జయంతి పురస్కరించుకొని తానా సాహితీ విభాగం “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.......
అట్లాంటా, జార్జియా: వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వేంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకొని తానా సాహితీ విభాగం “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్టు 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రపంచస్థాయి అంతర్జాల దృశ్యమాధ్యమ సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. ప్రతి నెలా ఆఖరి ఆదివారం జరుగుతున్న కార్యక్రమాలలో ఇది 16వ సమావేశం కావడం గమనార్హం. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు తన స్వాగతోపన్యాసంలో గిడుగు వేంకట రామమూర్తి కృషిని, ఆయనకు ఆ ఉద్యమంలో సహకరించిన అనేకమంది సాహితీవేత్తలకు ఘన నివాళులర్పించి సభను ప్రారంభించారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ ఓ మధురమైన తెలుగు పద్యం పాడి సభలో తెలుగుదనం నింపారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అతిథులకు, వక్తలకు ఆహ్వానం పలికారు. శనివారం జరిగిన సభలో ముఖ్య అతిథిగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి, సాంఘిక సంక్షేమ శాఖామంత్రి, తెలుగు సంతతికి చెందిన డా. శశి (పిల్లలమర్రి) పంజాను సభకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా శశి తండ్రిది (పిల్లలమర్రి వేంకట కృష్ణయ్య) తెనాలి అని, తల్లిది (మాధవపెద్ది సీతాదేవి) గుంటూరు అని తెలిపారు. శశి, ఆమె సోదరుడు మోహన్ పుట్టింది నరసరావుపేట అయినప్పటికీ చిన్నప్పట్నుంచి కోల్కతాలో పెరగడం, విద్యాభ్యాసం, ఉద్యోగంతో పాటు రాజకీయాల్లో రాణించడం ముదావహమన్నారు. వృత్తిరీత్యా వైద్యురాలిగా తీరికలేకుండా ఉంటూనే రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో చురుగ్గా పాల్గొనడం అభినందనీయమన్నారు.
తెలుగు గడ్డపై పుట్టడం నా అదృష్టం: బెంగాల్ మంత్రి డాక్టర్ శశి పంజా
ఈ సందర్భంగా డా. శశి పంజా మాట్లాడుతూ.. కేంద్ర మాజీమంత్రి అజిత్ కుమార్ పంజా కుమారుడు డా. ప్రసన్నకుమార్ పంజాతో వివాహం కావడం వల్ల తన పేరు శశి పంజాగా మారిందన్నారు. ఎందరో మహానుభావులు పుట్టిన తెలుగు నేలపై జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తన తండ్రి ఉద్యోగరీత్యా కోల్కతాలో స్థిరపడడంతో చిన్నప్పట్నుంచి తెలుగు నేలకు దూరమయ్యానని, కానీ తెలుగు భాషకు కాదన్నారు. ఇప్పటికీ తమ ఇంట్లో తెలుగే మాట్లాడతామని, మధురమైన మన తెలుగు భాషను మాట్లాడే వారు బెంగాల్ రాష్ట్రంలో చాలామంది ఉన్నారని తెలిపారు. అందుకే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తెలుగును ఇటీవలే అధికార భాషగా గుర్తించారని గుర్తు చేశారు. తెలుగు వ్యవహారిక భాషగా ఉండాలనే ఉద్యమంలో గిడిగు వేంకట రామమూర్తి తన సర్వస్వాన్ని త్యాగం చేశారని కొనియాడుతూ.. ఆయనకు నివాళులర్పించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదికను ఆమె ప్రశంసించారు.
తానా కృషిని అభినందించిన తనికెళ్ల భరణి
ఈ సభలో ప్రముఖ నటులు, రచయిత తనికెళ్ల భరణి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు దీనావాస్థ స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. విదేశాల్లో, ముఖ్యంగా తానా ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు వైభవంగా జరగడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. తనికెళ్ల భరణి తెలుగులో రచించిన “ఎందరో మహానుభావులు” గ్రంథాన్ని సత్య భావన అనే రచయిత్రి ఆంగ్లానువాదం చేయగా.. ఆ ప్రతిని మంత్రి డా. శశి పంజా ఆవిష్కరించారు. తెలుగు సంతతికి చెందిన వ్యక్తి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్గా సేవలందిస్తున్న డా. బొప్పూడి నాగ రమేష్ ఈ సభలో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఎంతో మంది సంగీత విద్వాంసుల జీవిత చరిత్రలను అత్యంత మనోహరంగా భరణి చిత్రీకరించారని, ఇది అందరూ చదవాల్సిన పుస్తకమని ఆయన అన్నారు.
అమ్మ భాషను కాపాడుకుందాం: కరణం మల్లీశ్వరి
రెండో రోజు సభలో శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల పల్లెనుంచి సిడ్నీ ఒలింపిక్స్లో పతకం సాధించి.. దిల్లీలో క్రీడా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమితులైన పద్మశ్రీ డా. కరణం మల్లీశ్వరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగు వ్యక్తిగా పుట్టడం తన అదృష్టమన్నారు. మాతృభాషను రక్షించుకునేందుకు అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.
తానా ప్రత్యేక వీడియో విడుదల
తానా ప్రపంచ సాహిత్య వేదిక కోసం తెలుగు వైభవం, సాహితీవేత్తలపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి విడుదల చేశారు. ఈ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ఇకనుంచి ప్రతి నెలా సాహిత్య కార్యక్రమానికి ముందు ఈ వీడియోను ప్రదర్శిస్తామన్నారు. ఈ గీతాన్ని రాసిన తెలుగు వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, స్వరపరచిన సంగీత దర్శకులు నేమాని పార్థసారథి, గానం చేసిన దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెండు రోజులపాటు జరిగిన వేడుకల్లో గిడుగు వేంకట రామమూర్తితో సహా మొత్తం 17 మంది లబ్ద ప్రతిష్టులైన విశిష్ట సాహితీవేత్తల కుటుంబ సభ్యులే పాల్గొని ఆ నాటి సామాజిక పరిస్ధితులు, వారి జీవన విధానం, సహ రచయితలతో వారి అనుబంధం, వారి సాహిత్య సృష్టి మొదలైన ఎన్నో పుస్తకాలలో లభ్యంకాని ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం సాహిత్య చరిత్రలోనే ఒక సరికొత్త కోణం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ చర్చా కార్యక్రమాలను ఈ కింది యూట్యూబ్ వీడియోల్లో చూవచ్చని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశిష్ట సాహితీవేత్తల కుటుంబ సభ్యులు వీళ్లే..
* డా. తుమ్మల సీతారామమూర్తి చౌదరి (తెనుగు లెంక, ఆధునిక పద్య కవి, పండితుడు) కుమారుడు తుమ్మల శ్రీనివాసమూర్తి
* డా. రాయప్రోలు సుబ్బారావు (గొప్ప జాతీయవాది, ప్రముఖ కవి, రచయిత) మనవరాలు ఆచార్య డా. మనోరమ కానూరి
* డా. కొండవీటి వేంకట కవి (సుప్రసిద్ధ కవి, హేతువాది, చలనచిత్ర సంభాషణల రచయిత) కుమార్తె ఆచార్య డా. కొండవీటి విజయలక్ష్మి
* డా. ముళ్ళపూడి వెంకటరమణ (ప్రముఖ సాహితీవేత్త, ప్రముఖ చలనచిత్ర కథా, హాస్య సంభాషణల రచయిత) కుమారుడు వర ముళ్ళపూడి
* డా. గొల్లపూడి మారుతీరావు (రేడియో ప్రయోక్త, నటుడు, చలనచిత్ర కథా, మాటల రచయిత) కుమారుడు గొల్లపూడి రామకృష్ణ
* బ్రహ్మర్షి డా. ఉమర్ ఆలీషా (సూఫీ వేదాంతవేత్త, తెలుగు సాహితీ వేత్త, సంఘ సంస్కర్త) ముని మనవడు డా. ఉమర్ ఆలీ షా
* పద్మభూషణ్ డా. గుర్రం జాషువా (కవితా విశారద, కవి కోకిల, నవయుగ కవి చక్రవర్తి) ముని మనవడు గుర్రం పవన్ కుమార్
* పద్మభూషణ్ డా. దేవులపల్లి కృష్ణశాస్త్రి (సుప్రసిద్ధ భావకవి, ప్రముఖ చలనచిత్ర గీత రచయిత) మనవరాలు రేవతి అదితం
* కళా ప్రపూర్ణ గిడుగు వేంకట రామమూర్తి (వాడుక భాషోద్యమ పితామహుడు, బహు భాషాశాస్త్రవేత్త) ముని మనవరాలు గిడుగు స్నేహలతా మురళి
* పద్మభూషణ్ డా. బోయి భీమన్న (ప్రముఖ కవి, సామాజిక చైతన్య రచయిత) సతీమణి హైమవతీ భీమన్న
* గురజాడ అప్పారావు (సంఘ సంస్కర్త, హేతువాది, అభ్యుదయ కవి) ముని మనవరాలు అరుణ గురజాడ
* రాష్ట్రేందు డా. గుంటూరు శేషేంద్రశర్మ (ప్రముఖ కవి, విమర్శకుడు, పండితుడు, సాహితీవేత్త) కుమారుడు గుంటూరు సాత్యకి
* పద్మశ్రీ డా. పుట్టపర్తి నారాయణాచార్యులు (సరస్వతీ పుత్ర, సుప్రసిద్ధ కవి) కుమార్తె డా. పుట్టపర్తి నాగపద్మిని
* పద్మభూషణ్ డా. విశ్వనాథ సత్యనారాయణ (కవి సామ్రాట్, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత) మనవడు విశ్వనాథ సత్యనారాయణ
* డా. రావూరి భరద్వాజ (జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, గొప్ప భావకుడు) కుమారుడు రావూరి వెంకట కోటేశ్వర రావు, ఆయన కోడలు లక్ష్మి
* కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి (ప్రముఖ సాహితీవేత్త, కవి) కుమారుడు డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ
* దేవరకొండ బాలగంగాధర తిలక్ (అభ్యుదయ కవి, కథకుడు, నాటకకర్త) కుమారుడు డా. దేవరకొండ సత్యనారాయణ మూర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు.