‘పెట్రో’ ధరలపై కేజ్రీవాల్ మౌనం ఎందుకు?
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతుంటే కేజ్రీవాల్ ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. నగరంలో ఇంధన ధరలపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ దిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ కుమార్ కేజ్రీవాల్కు లేఖ రాశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను సీఎం దృష్టికి
వ్యాట్ తగ్గించాలని కాంగ్రెస్ డిమాండ్
దిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతుంటే కేజ్రీవాల్ ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. నగరంలో ఇంధన ధరలపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ దిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ కుమార్ కేజ్రీవాల్కు లేఖ రాశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దిల్లీ ప్రభుత్వం లీటరు పెట్రోల్పై రూ.23లు, లీటరు డీజిల్పై రూ.13లు వ్యాట్ విధించడం ప్రజలను మోసగించడమేనని విమర్శించారు. పెద్ద ఎత్తున వ్యాట్ విధిస్తున్నందుకు దిల్లీ ప్రజలు సీఎంను సమాధానం కోరుతున్నారని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం విధిస్తున్న అధిక ఎక్సైజ్ సుంకంతో దిల్లీలో గతంలో ఎన్నడూ లేనంత ప్రియంగా మారాయన్నారు. ఇంధన ధరలు పైపైకి పోతుంటే దిల్లీ ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ధరలు తగ్గించే అంశంపై ప్రధానితో ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. పన్నులు తగ్గించాలని మోదీ ప్రభుత్వాన్ని ఎందుకు అడగడం లేదన్నారు. దిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.100.91 పైసలు కాగా.. డీజిల్ ధర రూ.89.88గా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.