ఉపాధ్యాయ పోస్టులు ప్రకటించి విస్మరించడం తగదు
రాష్ట్రంలో 13 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ రాష్ట్ర శాసనసభలో ప్రకటించి అమలును విస్మరించడం తగదని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు.
ప్రొఫెసర్ కోదండరాం
బషీర్బాగ్, న్యూస్టుడే: రాష్ట్రంలో 13 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ రాష్ట్ర శాసనసభలో ప్రకటించి అమలును విస్మరించడం తగదని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మెగా డీఎస్సీ ప్రకటించి నిరుద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో డీఎస్సీ నిరుద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 13,068 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేస్తామని ప్రకటించి 5 వేల పోస్టులకు నోటిఫికేషన్ వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోటీ పరీక్షల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం వల్ల కావడంలేదని, గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు తీర్పే దీనికి నిదర్శనమన్నారు. రాష్ట్ర నిరుద్యోగ ఐకాస ఛైర్మన్ నీల వెంకటేశ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ, ఓయూ ఐకాస నేత మహిపాల్యాదవ్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతుల నుంచి బేషరతుగా ధాన్యం సేకరించాలి
మిగ్జాం తుపాను నేపథ్యంలో అన్నదాతల నుంచి బేషరతుగా ధాన్యం సేకరించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయే రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. -
తుపానుతో ‘యువగళం’ పాదయాత్రకు తాత్కాలిక విరామం
మిగ్జాం తుపాను కారణంగా యువగళం పాదయాత్రకు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తాత్కాలిక విరామం ప్రకటించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని తీర ప్రాంతమైన ఉప్పాడ కొత్తపల్లి మండలంలో ప్రస్తుతం యాత్ర సాగుతున్న విషయం తెలిసిందే. -
ఓటమిపై అసహనాన్ని పార్లమెంటులో చూపొద్దు
దేశంలో వివిధ శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో ఎదురైన ఓటమితో అసహనానికి గురై దానిని పార్లమెంటులో చూపించవద్దని ప్రధాని నరేంద్రమోదీ విపక్షాలకు సూచించారు. -
మిజోరంలో జడ్పీఎం జోరు
ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ఒకే పార్టీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చే సంప్రదాయానికి తెరపడింది. -
హామీల అమలుకు కాంగ్రెస్కు సమయమిద్దాం
రెండుసార్లు మనల్ని గెలిపించిన ప్రజలు.. ఈసారి కాంగ్రెస్ పార్టీకి పాలించే అవకాశమిచ్చారని, ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కనీసం ఆర్నెల్ల సమయమిద్దామని భారాస అధినేత కేసీఆర్ తమ పార్టీ నాయకులతో అన్నట్లు తెలిసింది. -
ఖరారు బాధ్యత హైకమాండ్దే..
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి (సీఎల్పీ నేత) ఎవరనే విషయంలో కాంగ్రెస్లోని అత్యధిక ఎమ్మెల్యేలు రేవంత్రెడ్డివైపు మొగ్గు చూపినా సోమవారం రాత్రి వరకు పార్టీ అధిష్ఠానం నుంచి గ్రీన్సిగ్నల్ రాలేదు. -
పంట నష్టం లెక్కింపులో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి: పవన్
ప్రకృతి విపత్తులు మిగిల్చే నష్టాలతో రైతులు కుదేలవుతారని, పంట నష్టాన్ని లెక్కించడంలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. -
ఇండోసెల్ కంపెనీకి జగన్ కానుక రూ.90 కోట్లు
నెల్లూరు వద్ద ఇండోసెల్ కంపెనీ నెలకొల్పనున్న సోలార్ ప్యానల్ ప్లాంటుకు జగన్ ప్రభుత్వం భారీ ఉచిత కానుక ఇస్తోందని భాజపా అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. -
గుడివాడకు వెనిగండ్ల రాము, అరకుకు సియ్యారి దొన్నుదొర
గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జిగా వెనిగండ్ల రాము, అరకు ఇన్ఛార్జిగా సియ్యారి దొన్నుదొరను నియమించినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.


తాజా వార్తలు (Latest News)
-
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే
-
‘మీరు పావలా.. అర్ధ రూపాయికీ పనికిరారు’
-
Vishal: మేం అలాంటి పరిస్థితిలో లేం..: జీసీసీపై విశాల్ అసహనం
-
Nani: మహేశ్ బాబుతో మల్టీస్టారర్.. నాని ఆన్సర్ ఏంటంటే?
-
Jairam Ramesh: ‘ఆ మూడు బిల్లులు ప్రమాదకరం..! వాటిని వ్యతిరేకిస్తాం’
-
Live Bomb: ఇంటి పెరట్లోనే బాంబు.. దంపతులు షాక్..!