తెలంగాణ ప్రజలను మద్యానికి బానిస చేసిన భారాస
భారాస ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మద్యానికి బానిసలను చేసిందని భాజపా నేత, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ విమర్శించారు.
భాజపా మాజీ ఎంపీ రవీంద్ర నాయక్
ఈనాడు, దిల్లీ: భారాస ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మద్యానికి బానిసలను చేసిందని భాజపా నేత, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ విమర్శించారు. దిల్లీ తెలంగాణ భవన్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ దేశానికి ఏం చేయడం లేదని మంత్రి కేటీఆర్ విమర్శిస్తున్నారని, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లు, ట్రిపుల్ తలాక్ రద్దు, రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు వంటి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. కేసీఆర్ ఎస్సీలను మోసం చేయడంతో పాటు కాళేశ్వరం మొదలు అన్ని పథకాల్లోనూ అవినీతి చేశారని ఆరోపించారు. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే కేవలం నాలుగు శాతమే అమలవుతున్నాయని, ఈ విషయంతో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు తమతో కలిపి పోరాటం చేయాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతుల నుంచి బేషరతుగా ధాన్యం సేకరించాలి
మిగ్జాం తుపాను నేపథ్యంలో అన్నదాతల నుంచి బేషరతుగా ధాన్యం సేకరించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయే రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. -
తుపానుతో ‘యువగళం’ పాదయాత్రకు తాత్కాలిక విరామం
మిగ్జాం తుపాను కారణంగా యువగళం పాదయాత్రకు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తాత్కాలిక విరామం ప్రకటించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని తీర ప్రాంతమైన ఉప్పాడ కొత్తపల్లి మండలంలో ప్రస్తుతం యాత్ర సాగుతున్న విషయం తెలిసిందే. -
పంట నష్టం లెక్కింపులో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి: పవన్
ప్రకృతి విపత్తులు మిగిల్చే నష్టాలతో రైతులు కుదేలవుతారని, పంట నష్టాన్ని లెక్కించడంలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. -
ఇండోసెల్ కంపెనీకి జగన్ కానుక రూ.90 కోట్లు
నెల్లూరు వద్ద ఇండోసెల్ కంపెనీ నెలకొల్పనున్న సోలార్ ప్యానల్ ప్లాంటుకు జగన్ ప్రభుత్వం భారీ ఉచిత కానుక ఇస్తోందని భాజపా అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. -
గుడివాడకు వెనిగండ్ల రాము, అరకుకు సియ్యారి దొన్నుదొర
గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జిగా వెనిగండ్ల రాము, అరకు ఇన్ఛార్జిగా సియ్యారి దొన్నుదొరను నియమించినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.


తాజా వార్తలు (Latest News)
-
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే
-
‘మీరు పావలా.. అర్ధ రూపాయికీ పనికిరారు’
-
Vishal: మేం అలాంటి పరిస్థితిలో లేం..: జీసీసీపై విశాల్ అసహనం
-
Nani: మహేశ్ బాబుతో మల్టీస్టారర్.. నాని ఆన్సర్ ఏంటంటే?
-
Jairam Ramesh: ‘ఆ మూడు బిల్లులు ప్రమాదకరం..! వాటిని వ్యతిరేకిస్తాం’
-
Live Bomb: ఇంటి పెరట్లోనే బాంబు.. దంపతులు షాక్..!