Nagababu: భీమవరం సభలో చిరంజీవి తప్ప మిగిలిన వారి నటన అద్భుతం: నాగబాబు ట్వీట్‌

‘మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ భీమవరంలో అద్భుతంగా జరిగింది. ఆ మహానుభావుడికి నా నివాళి. ఆ సభలో మా అన్నయ్య చిరంజీవి తప్ప అందరూ...

Updated : 07 Jul 2022 10:09 IST

ఈనాడు, అమరావతి: ‘మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ భీమవరంలో అద్భుతంగా జరిగింది. ఆ మహానుభావుడికి నా నివాళి. ఆ సభలో మా అన్నయ్య చిరంజీవి తప్ప అందరూ అద్భుతంగా నటించారు. ఆ మహా నటులందరికీ నా అభినందనలు’ అంటూ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, సినీనటుడు కొణిదెల నాగబాబు బుధవారం రాత్రి ట్వీట్‌ చేశారు. 

పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో సోమవారం స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి జగన్‌, మంత్రి రోజా తదితరులు పాల్గొన్నారు. దీనిపై నాగబాబు తాజాగా ట్విటర్‌లో వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని