టెస్టు ఛాంపియన్షిప్: భారత్ పరిస్థితేంటి?
ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ క్లైమాక్స్కు చేరుకుంది. ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం సాధించడం, పాకిస్థాన్ను న్యూజిలాండ్ చిత్తుగా ఓడించడం, శ్రీలంకపై ఇంగ్లాండ్ తొలి టెస్టు గెలవడంతో సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. జూన్లో లార్డ్స్ మైదానంలో జరగనున్ను ఫైనల్కు ఏ రెండు జట్లు అర్హత సాధిస్తాయని...
ఇంటర్నెట్డెస్క్: ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ క్లైమాక్స్కు చేరుకుంది. ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం సాధించడం, పాకిస్థాన్ను న్యూజిలాండ్ చిత్తుగా ఓడించడం, శ్రీలంకపై ఇంగ్లాండ్ తొలి టెస్టు గెలవడంతో సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. జూన్లో లార్డ్స్ మైదానంలో జరగనున్ను ఫైనల్కు ఏ రెండు జట్లు అర్హత సాధిస్తాయని అందరిలోనూ ఉత్కంఠ పెరిగింది. ఈ నేపథ్యంలో ఏ జట్టుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చూద్దాం..
టాప్లో భారత్
కరోనా కారణంగా కొన్ని టెస్టులు, సిరీస్లు రద్దవ్వడంతో ఫైనల్కు విజయాల శాతం ఆధారంగా ఎంపిక చేస్తామని ఐసీసీ తెలిపింది. అంతకుముందు పాయింట్ల ఆధారంగా ఎంపిక చేస్తారని వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే గెలుపుశాతం అని ప్రకటించడంతో టీమిండియాకు క్లిష్టపరిస్థితులు ఎదురయ్యాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సిరీస్ల్లో అధిక విజయాలు సాధించాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే ఆసీస్పై అద్భుత ప్రదర్శనతో 2-1తో సిరీస్ గెలవడంతో భారత్ గెలుపుశాతం 71.7కి చేరింది. పట్టికలో టాప్లో నిలిచింది.
కానీ, ఫైనల్కు చేరాలంటే ఇంగ్లాండ్తో జరిగే నాలుగు టెస్టుల సిరీస్ భారత్కు కీలకం. ఇంగ్లాండ్పై 4-0, 3-0, 3-1 లేదా 2-0తో విజయం సాధిస్తే టీమిండియా అర్హత సాధిస్తుంది. ఆ సిరీస్ స్వదేశంలోనే జరగనుండంతో కోహ్లీసేన తప్పక గెలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ చేతిలో 0-3, 0-4తో ఓటమిపాలైతే టెస్టు ఛాంపియన్షిప్ రేసు నుంచి టీమిండియా ఔట్ అవుతుంది.
కివీస్ వెయింటింగ్
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ గురించి ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో టెస్టు ఛాంపియన్షిప్లో న్యూజిలాండ్ మ్యాచ్లు ముగిశాయి. స్వదేశంలో పాకిస్థాన్ను చిత్తు చేయడంతో కివీస్ 70 విజయశాతంతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. అయితే గెలుపు శాతం మెరుగ్గా ఉన్నా ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా ఆడనున్న మ్యాచ్లపై కివీస్ అర్హత ఆధారపడి ఉంది. ఇంగ్లాండ్ అయిదు మ్యాచ్ల్లో (శ్రీలకం-1, భారత్-4), ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 3-0 లేదా 2-0తో పైచేయి సాధిస్తే న్యూజిలాండ్ అవకాశాలు దెబ్బతింటాయి. దీంతో ఆ మ్యాచ్లు ముగిసేవరకు కివీస్ వెయిట్ చేయాల్సిందే.
ఆసీస్ ముందు సఫారీల సవాల్
పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 69.2%తో మూడో స్థానంలో ఉంది. భారత్ దెబ్బకి టాప్లో ఉన్న ఆసీస్ మూడో స్థానానికి పడిపోయింది. అయితే ఫైనల్కు చేరుకోవడానికి కంగూరూలకు అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టెస్టుల సిరీస్లో రెండు మ్యాచ్లు విజయం సాధిస్తే తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. అయితే ఆ సిరీస్లో ఓటమి చవిచూడకూడదు. కాగా, సఫారీలు సిరీస్ను గెలిస్తే..ఆసీస్ పోరాటానికి ముగింపు పలికనట్లే.
నాలుగో స్థానంలో ఇంగ్లాండ్
65.2 శాతంతో ఇంగ్లాండ్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. శ్రీలకంతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించి, భారత్తో జరగనున్న సిరీస్లో 3-0, 4-0తో గెలిస్తే ఫైనల్కు అర్హత సాధిస్తుంది.
పోటీలోనే ఉన్న దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికా 40 శాతంతో అయిదో స్థానంలో ఉన్నప్పటికీ ఫైనల్కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పాకిస్థాన్, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించాలి. ఆ తర్వాత ఇతర జట్ల ఫలితాలపై అవకాశం ఆధారపడి ఉంటుంది. మరోవైపు పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లు ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM