India vs Nepal: భారత్ను వెంటాడుతున్న వర్షం.. నేపాల్తో మ్యాచ్ జరుగుతుందా..?
ఆసియా కప్లో భాగంగా భారత్, నేపాల్ (India vs Nepal) మధ్య జరిగే మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశముంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్లో భారత్ మ్యాచ్లకు వరుణుడు కరుణించేలా లేడు. పాకిస్థాన్ మ్యాచ్తో అసలుసిసలు మజాను ఆస్వాదిద్దామనుకున్న అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లిన సంగతి తెలిసిందే. పల్లెకెలె వేదికగా దాయాదుల మధ్య జరిగిన పోరులో రెండుసార్లు వర్షం అంతరాయాల నడుమ భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం వరుణుడు మరోసారి ఆటంకం కలిగించడంతో పాక్ ఇన్నింగ్స్ ప్రారంభమవ్వకుండానే మ్యాచ్ రద్దయింది. రేపు (సెప్టెంబరు 4న) భారత్, నేపాల్ (India vs Nepal) మధ్య జరగాల్సిన మ్యాచ్కూ వర్ష ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్ కూడా పల్లెకెలె వేదికగానే జరగాల్సి ఉంది. అయితే, మ్యాచ్ జరిగే రోజు 80 శాతం వర్షం పడే అవకాశాలున్నాయి. వర్షం ప్రభావంతో టాస్ కూడా ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో పలుమార్లు జల్లులు కురిసి ఆటకు అంతరాయం ఏర్పడే అవకాశముంది.
విరాట్ కోహ్లీ, రోహిత్ బౌల్డ్.. ఎవరి వికెట్ను ఎంజాయ్ చేశానంటే?: షహీన్
ఈ మ్యాచ్ కూడా రద్దయితే భారత్ పరిస్థితి?
వర్షం కారణంగా భారత్, పాక్ మ్యాచ్ రద్దు కావడంతో ఇరుజట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. గ్రూప్ ఎలో పాకిస్థాన్ ఒక విజయం (నేపాల్పై), ఒక పాయింట్తో కలిపి సూపర్-4కు దూసుకెళ్లింది. నేపాల్తో మ్యాచ్ జరిగితే భారత్ విజయం లాంఛనమే. ఒకవేళ వరుణుడి ఆటంకంతో భారత్, నేపాల్ మ్యాచ్ కూడా రద్దయితే రెండు పాయింట్లతో టీమ్ఇండియా సూపర్-4కు అర్హత సాధించి నేపాల్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. సూపర్-4లో భాగంగా సెప్టెంబరు 10న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మరోసారి తలపడతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.