WTC Final: అశ్విన్ తుది జట్టులో ఉంటాడా... లేదా? ఆస్ట్రేలియా శిబిరంలో ఇదే హాట్ టాపిక్!
టీ20లను ఆస్వాదించిన క్రికెట్ అభిమానుల కోసం టెస్టు పోరు సిద్ధమైంది. మరో ఐదు రోజుల్లో ఆస్ట్రేలియా - భారత్ (AUS vs IND) జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా తుది జట్టులో ఎవరుంటారనేదానిపై ఆసీస్ తీవ్రంగా చర్చిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు రారాజుగా తేల్చే టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final) ప్రారంభానికి మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. జూన్ 7వ తేదీ నుంచి ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య ఇంగ్లాండ్లోని ఓవల్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్ర సాధన చేసేస్తున్నారు. ఈ క్రమంలో భారత తుది జట్టులో ఎవరు ఉంటారనే దానిపై ఆసీస్ శిబిరంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఓవల్ మైదానం పేస్కు అనుకూలంగా ఉంటుంది. అందుకే, టీమ్ఇండియా తుది జట్టులో ఒక స్పిన్నర్కే స్థానం కల్పిస్తుందనే అభిప్రాయంతో ఆసీస్ ఉంది. దీనిపై ఆస్ట్రేలియా సహాయక కోచ్ డానియల్ వెటోరీ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ తరఫున తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్ ఆడకపోవచ్చని పేర్కొన్నాడు. బెక్హామ్లోని కౌంటీ క్రికెట్ స్టేడియంలో ఆసీస్ ట్రైనింగ్ సెషన్ జరిగింది. ఈ సందర్భంగా డానియల్ వెటోరీ మాట్లాడాడు.
జడ్డూనే బెటర్..
భారత్ ఎలాంటి బౌలింగ్ ఎటాక్తో బరిలోకి దిగనుందనే దాని గురించి మేం చర్చించాం. జడేజా తప్పకుండా జట్టులో ఉంటాడని భావిస్తున్నా. బౌలింగ్లో మాత్రమే కాకుండా బ్యాటింగ్లోనూ అదనపు బలంగా మారతాడు. ఆరో స్థానంలో కీలకమవుతాడు. అశ్విన్ అద్భుతమైన బౌలర్. ఏ జట్టైనా ఇలాంటి ఆటగాడిని తీసుకోవడానికే తొలుత మొగ్గు చూపుతుంది. అయితే, ఈసారి మాత్రం టీమ్ కాంబినేషన్ ప్రకారం తుది జట్టులో అవకాశం కష్టం. ఓవల్ పిచ్ బాగుంది. రోజులు గడిచే కొద్దీ స్పిన్నర్లకు అనుకూలంగా మారొచ్చు. కానీ, ఇద్దరు స్పిన్నర్లు ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఓవల్ పిచ్ మొదట పేస్కు సహకరిస్తుంది. ముగ్గరు పేసర్లు కాకుండా భారత్ నాలుగో ఫాస్ట్ బౌలర్తో బరిలోకి దిగుతుందో లేదో చూడాలి. ఆ జట్టులో ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఉన్నాడు. దీంతో జడేజాతోపాటు శార్దూల్కు తుది జట్టులో అవకాశం రావొచ్చు.
గ్రీన్ కీలకం..
మా జట్టులో పేస్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ కీలక పాత్ర పోషిస్తాడు. ఐపీఎల్లోనూ మంచి ప్రదర్శనే ఇచ్చాడు. గ్రీన్ సన్నద్ధత కూడా ఉన్నతస్థాయిలో ఉంటుంది. గ్రీన్ ఇప్పటికే చాలా ఉత్తమ క్రికెట్ ఆడాడు. తప్పకుండా పుంజుకొని నాణ్యమైన ప్రదర్శన ఇస్తాడని భావిస్తున్నా. చాలా మంది క్రికెటర్లు విరామం తీసుకోవడం లేదా టీ20 గేమ్ ఆడటం జరిగింది. వీరిని మళ్లీ టెస్టు మోడ్లోకి తీసుకురావడమే కష్టమైన సవాల్’’ అని వెటోరీ తెలిపాడు.
అశ్విన్ రికార్డు ఇదీ..
భారత్ వేదికగా జరిగిన బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో అశ్విన్ 25 వికెట్లు తీయగా.. జడేజా 22 వికెట్లు తీశాడు. దీంతో భారత్ 2-1 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. ఆసీస్పైనా మంచి రికార్డు అశ్విన్ సొంతం. అలాగే ఇంగ్లాండ్ పిచ్లపై ఏడు టెస్టుల్లో అశ్విన్ 18 వికెట్లు తీశాడు. డబ్ల్యూటీసీ రేసులో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ అశ్విన్. ఈ సీజన్లో 13 మ్యాచుల్లో 61 వికెట్లు తీశాడు. దీంతో అశ్విన్ ఆడితే తమ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందనేది ఆసీస్ కోచింగ్ సిబ్బంది భావనగా ఉందని నెట్టింట కామెంట్లు వస్తున్నాయి. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందా..? లేదా అనేది తెలియాలంటే వేచి చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
ఐపీఎల్ 2024లో బెంగళూరు వరుస ఆరు ఓటముల తర్వాత రెండో విజయం సాధించింది. హైదరాబాద్ను 35 పరుగుల తేడాతో ఆ జట్టు ఓడించింది. -
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట